అన్వేషించండి

Crime News: కూల్‌గా నడుచుకుంటూ వెళ్తూ స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లోని ఓ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థిని ఇంటర్వెల్ సమయంలో 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

అహ్మదాబాద్: విద్యార్థులు ఒక్కసారిగా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారో అర్థం చేసుకోవడం తల్లిదండ్రులకు కష్టతరంగా మారింది. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది.  నవరంగ్‌పురాలోని సోమ్ లలిత్ పాఠశాలకు చెందిన 16 ఏళ్ల టెన్త్ క్లాస్ విద్యార్థిని గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్  నాల్గవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.  

కీ చైన్ తిప్పుడూ కూల్‌గా కనిపించిన విద్యార్థిని

ఈ సంఘటన స్కూల్‌లో ఇంటర్వెల్ సమయంలో జరిగింది. అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా కనిపించిన బాలిక చేతిలో కీ చైన్ పట్టుకుని తిప్పుతూ వెళుతోంది. ఒక్కసారిగా సైడ్ నుంచి కిందకు దూకేసింది. ఇది గమనించిన తోటి విద్యార్థులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేసేలోపే జరగరాని నష్టం జరిగిపోయింది. బాలిక ఆత్మహత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  CCTV ఫుటేజ్‌లో ఆమె కిందకు దూకడం కనిపిస్తోంది. విద్యార్థిని అలా కిందకు దూకి ఆత్మహత్య చేసుకోవడంతో స్కూల్లో గందరగోళం నెలకొంది. తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.

 

ఆమెను కాపాడాలని తోటి విద్యార్థులు ప్రయత్నించారు..

స్కూల్ మేనేజింగ్ ట్రస్టీ ప్రజ్ఞేష్ శాస్త్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆ బాలిక గత ఐదు సంవత్సరాలుగా సోమ్ లలిత్‌లో చదువుతోంది. అయితే ఇంటర్వెల్ సమయంలో విద్యార్థులు తమ క్లాస్ రూముల  నుండి బయటకు వచ్చారు. అప్పటివరకూ ఎంతో ప్రశాంతంగా కనిపించిన టెన్త్ క్లాస్ విద్యార్థిని కీ చైన్ తిప్పుతూ వెళ్తూ ఒక్కసారిగా ఆగింది. ఆమె పారాపెట్ వైపు వెళ్లడాన్ని గమనించి కొంతమంది విద్యార్థులు ఆమెను ఆపడానికి ప్రయత్నించారు. ఒకరు ఆమె చేయి పట్టుకునేందుకు చూస్తుండగా, సిబ్బందికి సమాచారం అందేలోపే విద్యార్థిని కిందకు దూకేసింది అని ఆయన తెలిపారు.

కిందకు దూకిన బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖ్యంగా తలకు తీవ్రమైన గాయమైంది. కొన్ని ఎముకలు విరిగాయి. విద్యార్థినిని వెంటనే చికిత్స అందించేందుకు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆమెను మరొక ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేస్తుండగా గురువారం రాత్రి 10 గంటలకు విద్యార్థిని మరణించింది.

కొన్ని రోజులుగా విద్యార్థినికి అనారోగ్య సమస్యలు

నెల రోజులపాటు లాంగ్ మెడికల్ లీవ్ తరువాత ఆ విద్యార్థిని 15 రోజుల కిందటే స్కూల్‌కు తిరిగి వచ్చింది. ఆమె అనారోగ్య సమస్యల గురించి విద్యార్థిని తల్లిదండ్రులకు తెలుసునని పాఠశాల అధికారులు వెల్లడించారు. సంఘటన జరిగిన రోజు టెన్త్ క్లాస్ విద్యార్థిని బాధగా కనిపించిందని, తరగతి గదిలో గట్టిగా అరిచిందని ప్రిన్సిపాల్ లీనా అరోరా పోలీసులకు తెలిపారు.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు కేసు నమోదు చేసినట్లు నవరంగ్‌పురా పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ ఎ.ఎ. దేశాయ్ తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆమె తల్లిదండ్రులతో పాటు స్కూల్ సిబ్బందని ప్రశ్నించారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, విద్యార్థిని ఇటీవల స్కూల్‌కు తిరిగి రావడానికి ముందు కొన్నిరోజుల పాటు క్లాసులకు హాజరుకాలేదని, లాంగ్ లీవ్ లో ఉందన్నారు. మృతురాలు నరన్‌పురా నివాసి, కాగా కేసు దర్యాప్తులో నిజాలు వెల్లడవుతాయని చెప్పారు. విద్యార్థిని ఆత్మహత్యతో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, మానసిక పరిస్థితిపై ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget