అన్వేషించండి

Chittoor Crime: మహిళా దినోత్సవం రోజే ఘోరం, గడ్డి కోసం వెళ్లిన మహిళపై అత్యాచారయత్నం, హత్య!

Chittoor Crime: పశువుల గడ్డి కోసం పొలానికి వెళ్లిన మహిళపై ఓ మృగాడు అత్యాచారయత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో హత్య చేసి బావిలో పడేసిన ఘటన స్థానికంగా సంచలనమైంది.

Chittoor Crime: మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చి పోతున్నారు. పసికందుల నుంచి పండు ముసలి వరకూ ఎవరిని వదిలి పెట్టడం‌ లేదు మృగాళ్లు. వయస్సుతో తేడా లేకుండా మహిళలపై దాడులకు దిగుతూ ప్రాణాలను సైతం బలితీసుకుంటున్నారు. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కామాంధుల ఆగడాలకు అడ్డుకట్టపడడంలేదు. చిత్తూరు జిల్లాలో ఒంటరిగా ఉన్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను కిరాతకంగా హత్య చేసిన ఘటన మహిళా దినోత్సవం నాడే వెలుగుచూసింది. 

మహిళపై దాడి, ఆపై హత్య 

చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యం మండలం ఊటబావులపల్లె గ్రామానికి చెందిన మహిళ తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటోంది. రెండు సంవత్సరాల క్రితం ఆమె భర్త బతుకుదెరువు కోసం కోవైట్ కు వెళ్లాడు. దీంతో ఇంటి వద్ద ఖాళీగా లేకుండా రెండు పాడి ఆవులను తీసుకుని వాటిని‌ మేపుకుంటూ పిల్లలను చదివించుకుంటుంది. ఈ క్రమంలో పశువులకు మేత కోసం సోమవారం సాయంత్రం గడ్డిని తీసుకుని‌ వచ్చేందుకు గ్రామానికి సమీపంలోని పొలాల వద్దకు వెళ్లింది. అయితే పశువుల గడ్డి సేకరిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో ఆ వ్యక్తిపై ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో తమ కోరిక తీర్చలేదని కోపోద్రిక్తుడైన వ్యక్తి ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అనసూయ శవాన్ని పొలానికి వంద మీటర్ల దూరంలో ఉన్న ఓ పాడుబడ్డ బావిలో పడ్డేశారు. 

దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

అయితే ఇంటి వద్ద అమ్మ కోసం నిరీక్షిస్తున్న చిన్నారులు ఎంత సేపటికి అమ్మ రాకపోయే సరికి ఇంటి ప్రక్కనే ఉన్న బంధువులకు చెప్పారు. దీంతో రాత్రంతా గ్రామస్తులు ఆమె కోసం గాలించారు. కానీ మహిళ ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ ఉదయం మరొకసారి ఆమె కోసం గాలించారు. అయితే గ్రామానికి శివారు ప్రాంతమైన పాడుబడ్డ బావిలో మహిళ మృతిదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల కోసం పీలేరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. తల్లి ఆకస్మిక మరణంలో ఆ ఇద్దరు పిల్లలకు దిక్కుతోచని స్థితిలో కన్నీరు మున్నీరు అవుతున్నారు. తల్లి మృతదేహం వద్ద చిన్నారుల రోధనను చూసి గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ హత్య కేసులో గ్రామస్తుల సమాచారం మేరకు మహిళ సమీప బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget