అన్వేషించండి

Medak: చికెన్‌ కర్రీతో అన్నం తిని పడుకున్న చిన్నారులు.. పొద్దునే లేచి చూస్తే షాక్! తీవ్ర విషాదం..

రాత్రి కోడి కూరతో అన్నం తిన్నాక ఉదయం లేచి ఆస్పత్రికి వెళ్లేలోపే ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారి తల్లి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

మెదక్ జిల్లాలో ఇద్దరు అక్కా తమ్ముళ్లు చికెన్ కూర తిన్నాక చనిపోవడం కలకలం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. రాత్రి కోడి కూరతో అన్నం తిన్నాక ఉదయం లేచి ఆస్పత్రికి వెళ్లేలోపే ఇద్దరు పిల్లలు చనిపోయారు. వారి తల్లి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. తూప్రాన్‌ మండలం వెంకటాయపల్లికి చెందిన బుల్లే మల్లేశ్‌, బాలమణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో కుమార్తె మనీష (13), కుమారుడు కుమార్‌(10). మనోహరాబాద్‌ పట్టణ శివారులో ఉండే కోళ్ల ఫారాల్లో ఈ ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అక్కడ తరచూ కోళ్లను కోసి ఇంటికి తీసుకొచ్చి వండుకుంటూ ఉండడం వాళ్లకు అలవాటు. ఈ క్రమంలోనే సోమవారం కూడా ఓ కోడిని తెచ్చుకున్నారు.

Also Read: Gold-Silver Price: ఎగబాకిన పసిడి ధర.. స్వల్పంగా పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలివే..

రెండు రోజుల క్రితం కోళ్ల ఫారంలో పెరిగిన కోళ్లను కాంట్రాక్టర్ తీసుకెళ్లాడు. అనారోగ్యంతో బాగా లేని కోళ్లను అక్కడే వదిలేశాడు. దీంతో బాలామణి ఆ కోళ్లను ఇంటికి తీసుకొచ్చింది. సోమవారం రాత్రి వాటిని కోసి కూర వండి పిల్లలకు పెట్టింది. అనంతరం తాను కూడా తిన్నది. అదే రోజు ఆమె భర్త మల్లేశ్‌ ఇంట్లో భోజనం చేయలేదు. ఆ రాత్రి భోజనం చేసి అందరూ పడుకున్నారు. మంగళవారం ఉదయం నిద్ర లేచేసరికి ఇద్దరు పిల్లలు మనీష, కుమార్‌లు కడుపులో నొప్పిగా ఉందని ఏడ్చారు. కొద్దిసేపటికే వాంతులు కూడా చేసుకున్నారు. 

Also Read: Case On Punch Prabhakr : ఉపరాష్ట్రపతి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. పంచ్ ప్రభాకర్‌రెడ్డిపై ఢిల్లీలో కేసులు..!

దీంతో తండ్రి మల్లేశ్‌ వారిని తూప్రాన్‌‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మేడ్చల్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వారు చికిత్సకు నిరాకరించారు. దీంతో మళ్లీ తిరిగి తూప్రాన్‌ ప్రభుత్వ ఆసుపత్రికే తీసుకొచ్చారు. అయితే, పిల్లలిద్దరూ అప్పటికే వారు చనిపోయారని అక్కడి డాక్టర్లు ధ్రువీకరించారు. మరోవైపు, ఇంటివద్ద భార్య బాలామణి కూడా అస్వస్థతకు గురైంది. విషయం తెలుసుకున్న భర్త ఆమెను తూప్రాన్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి, అనంతరం కొంపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో వారు తిన్న ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. తండ్రి మల్లేశ్‌ను పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Also Read: Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'

Also Read: Weather Updates: ఈ జిల్లాలకు అలర్ట్.. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీలో ఈ ప్రాంతాల్లో కుంభవృష్టి

టాప్ హెడ్ లైన్స్

Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget