అన్వేషించండి

Basar IIIT News: బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్ సూసైడ్, విద్యార్థుల ఆందోళన!

ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అప్పట్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.

బాసర ట్రిపుల్ ఐటీలో మరో వివాదం రాజుకుంది. ఇటీవలే మంత్రి కేటీఆర్ క్యాంపస్‌లో రెండు సార్లు పర్యటించి సమస్యలను కాస్త చక్కదిద్దారని ఊరట చెందే లోపే ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పీయూసీ 2 చదువుతున్న భాను ప్రసాద్ అనే విద్యార్థి సూసైట్‌ నోట్ రాసి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విద్యార్థి గతంలోనూ ఓసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అప్పట్లో కౌన్సెలింగ్ ఇచ్చారు. 

మళ్లీ ఇప్పుడు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి మృతి నేపథ్యంలో అధికారులు బాసర ట్రిపుల్ ఐటీలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ, విద్యార్థులంతా కలిసి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు నిరసనకు దిగారు. ఫ్యాకల్టీ ఒత్తిడి వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. విద్యార్థి రాసిన సూసైడ్ నోట్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్థి ఆత్మహత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ ప్రొఫెసర్ సతీష్ కుమార్ తెలిపారు. ఇలాంటి ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బాసర ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. భాను ప్రసాద్ స్వస్థలం  రంగారెడ్డి జిల్లా మంచెల్‌ మండలం రంగాపూర్ గ్రామం.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని నిర్మల్ జిల్లా ఆసుపత్రిలోకి బీజేపీ, ఏబీవీపీ నాయకులు చొచ్చుకెళ్ళారు. భాను ప్రసాద్ మరణం పట్ల ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రిలోకి చొచ్చుకెళ్ళిన బీజేపీ నాయకులను, ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రి వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆత్మహత్య కాదు - కుటుంబ సభ్యుల ఆందోళన, ఎస్పీకి ఫిర్యాదు

భాను ప్రసాద్ ది ముమ్మాటికి ఆత్మహత్య కాదని, బలవంతంగా జరిపిన హత్య అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని భాను ప్రసాద్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాసర ట్రిబుల్ ఐటీ యాజమాన్యం సూసైడ్ నోట్ ను ఫోర్జరీ చేసి చూయిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భాను ప్రసాద్ చదువులో చురుకైన వ్యక్తి అని, అతనికి ఇంటి వద్ద ఎలాంటి ఒత్తిడి గాని ఆర్థిక భారంగాని లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమ బాబుది ఆత్మహత్య కాదు.. బలవన్మరణానికి పాల్పడేలా చేసిన బాసర ట్రిబుల్ ఐటీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.

పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు

ఆత్మహత్య చేసుకున్న భాను ప్రసాద్ మృత దేహానికి నిర్మల్ జిల్లాలో పోస్టుమార్టం పూర్తిచేశారు వైద్యులు. త్వరలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుందని, దాని తదుపరి వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Fire Accident: బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
బహదూర్‌పురాలోని టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, హైదరాబాద్ వాసులను వణికిస్తున్న వరుస ఘటనలు
AP Crime News: చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
చాట్‌జీపీటీ హెల్ప్‌తో మంత్రి సంతకం ఫోర్జరీ! తండ్రీ కొడుకుల మాస్టర్ ప్లాన్ తెలిసి పోలీసులే షాక్!  
Chennai influencer killed: సిల్క్ చీరల వెనుక దాగి ఉన్న విషాదం - ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి దారుణ హత్య!
సిల్క్ చీరల వెనుక దాగి ఉన్న విషాదం - ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి దారుణ హత్య!
Husband Sitaram: భార్య వివాహేతర బంధాలు - చంపలేదు..చచ్చిపోయాడు భర్త సీతారాం - కన్నీరు పెట్టించే సూసైడ్ లెటర్!
భార్య వివాహేతర బంధాలు - చంపలేదు..చచ్చిపోయాడు భర్త సీతారాం - కన్నీరు పెట్టించే సూసైడ్ లెటర్!

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tata Docomo: కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
కోర్టు తీర్పు అమలు చేస్తే జీఎస్టీ కట్టాలన్న అధికారులు - కోర్టు ఇచ్చిన తీర్పు ఇదే
JPMorgan Case: పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
పైఆఫీసర్ లైంగికంగా వేధించింది - అమెరికాలో భారతీయ ఉద్యోగి కేసు - పాపం రాణా !
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
ఆ గుంటూరు లెక్చరర్‌ గూబ పగులగొట్టాడు.. ఇంటర్ అనుభవాలు పంచుకున్న కేటీఆర్. 
New Online Gaming Rules: కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కొత్త ఆన్‌లైన్ గేమింగ్ రూల్స్.. మీరు కూడా గేమర్ అయితే ఈ విషయాలు తెలుసుకోండి
Viral Video: టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
టికెట్ లేదని 20,000 లంచం డిమాండ్.. చెప్పుతో కొట్టిన ప్రయాణికులు, కండక్టర్ !
US Kurnool Youth: అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
అమెరికాలో కర్నూలు విద్యార్థి విషాదాంతం - ఉద్యోగం దొరక్క యువకుడు ఆత్మహత్య.. కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం
Car Care Tips: వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
వేసవిలో పొరపాటున కూడా ఈ వస్తువులను కారు ఉంచొద్దు.. చిన్న తేడావచ్చినా అంతా బూడిదే
Gayapadda Simham OTT : ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget