అన్వేషించండి

Praneet Rao: ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో కీలక అడుగు.. మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్

Telangana News: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Former DSP Praneet Rao Arrest: తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యహారంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి కీలక ఆధారాలను సేకరించిన ప్రభుత్వం.. ఈ మేరకు చర్యలకు సిద్ధమైంది. ప్రణీత్‌రావు పాత్రపై ఆధారాలను సేకరించిన తరువాతే అరెస్ట్‌కు సిద్ధపడినట్టు చెబుతున్నారు. మంగళవారం రాత్రి సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్‌కు తరలించారు. ఎస్‌ఐబీ లాగర్‌ రూమ్‌లో హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేసిన తరువాత నుంచి ప్రణీత్‌రావు పక్కా ప్లాన్‌తో వ్యవహరించినట్టు చెబుతున్నారు. గడిచిన నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీసీఆర్‌బీలో రిపోర్ట్‌ చేసిన ఆయన.. అక్కడ జాయిన్‌ అయిన రెండు రోజులకే సిక్‌ లీవ్‌ పెట్టినట్టు చెబుతున్నారు. సస్పెన్షన్‌కు వారం రోజులు ముందు నుంచే డీసీఆర్‌బీకి వెళ్లలేదని సమాచారం. సిరిసిల్ల హెడ్‌క్వార్టర్‌ విడిచి వెళ్లరాదని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్టు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్‌రావు కోసం శ్రీ నగర్‌ కాలనీలోని ఇంటి వద్ద పోలీసులు నిఘా ఉంచారు. 

రాత్రి అరెస్ట్‌

ప్రణీత్‌రావు మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన విషయం గుర్తించి పోలీసులు దాడి చేసి అరెస్ట్‌ చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్‌ ఫోన్లను సీజ్‌ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్‌రావును హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో స్టేట్‌మెంట్‌ రికార్డు చేసిన అనంతరం బుధవారం ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశముంది తెలుస్తోంది. ఎస్‌ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనో ఆరోపణలపై.. ఎస్‌ఐబీ అడిషినల్‌ ఎస్పీ రమేష్‌ ఫిర్యాదు మేరకు పంజాగుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అంతకుముందు పోలీసులు అదుపులోనే రహస్య ప్రదేశంలోనే ఉన్నారన్న ప్రచారం నడిచింది. కానీ, ప్రణీత్‌రావు కోసం రెండు రోజులు నుంచి సిరిసిల్లలోనే పంజాగుట్ట పోలీసులు మకాం వేసి అరెస్ట్‌ చేశారు. ప్రణీత్‌రావుతోపాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారులను సైతం విచారణ చేయనున్నారు. 

డాక్యుమెంట్లు ధ్వంసం

ఎస్‌ఐబీలోని ఎస్‌వోటీ ఆపరేషన్‌ హెడ్‌గా ఉన్న ప్రణీత్‌రావు.. రాజకీయ నాయకులు, ఎన్జీవోలు, పౌర హక్కుల నేతల వ్యవహారాలతోపాటు మావోయిస్టులు, ఉగ్రవాద కార్యకలాపాలను పర్యవేక్షించారు. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఫోన్ల ట్యాప్‌ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. తెలంగాణ ఎన్నికల ఫలితాల రోజు రాత్రి 9 గటల సమయంలో ఆయన లాగర్‌ రూమ్‌కు వెళ్లారు. సుమారు 45 హార్డ్‌ డిస్క్‌లతోపాటు వందలాది డాక్యుమెంట్లను ధ్వంసం చేసిన ప్రణీత్‌రావు.. ఆ సమయంలో ఎస్‌వోటీ లాగర్‌ రూమ్‌ సీసీ కెమెరాలను ఆఫ్‌ చేయించారు. లాగర్‌ రూమ్‌ కరెంట్‌ సప్లైను నిలిపేసి మరీ లోపలకు వెళ్లినట్టు తేలింది. వేల సంఖ్యలో కాల్‌ డేటా రికార్డులతోపాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి.. ఎస్‌ఐబీ ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్‌ డిస్క్‌లను కాల్చేసి.. లాగర్‌ రూమ్‌లో ఆనవాళ్లు లేకుండా చేసి వెళ్లిపోయారు. ప్రణీత్‌రావు ఎటువంటి సమాచారాన్ని ద్వంసం చేశాడో నిర్దారణకు రాలేకపోతున్న అధికారులు.. ఆయనపై క్రిమినల్‌ చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆధారాలు ద్వంసం చేయాలనే ఆదేశాలను ఎవురు ఇచ్చారన్న దానిపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ ప్రభాకర్‌ రావు బంధువే ఈ ప్రణీత్‌రావు కావడంతో ఆ దిశగానూ పోలీసులు విచారణకు సిద్ధమవుతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget