అన్వేషించండి

Vizag Crime News: వీడియోలతో బెదిరించి లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచారం, హోం మంత్రి అనిత సీరియస్

Andhra Pradesh News | ఏపీలో మరో దారుణం జరిగింది. లా స్టూడెంట్ పై నలుగురు యువకులు గత కొన్ని నెలలుగా సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. వీడియోలు ఉన్నాయంటూ బెదిరించి ఆమెకు నరకం చూపించారు.

AP Home minister Vangalapudi Anitha | విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తాజాగా మరో దారుణం విశాఖపట్నంలో జరిగింది. తెలిసిన వాడే, అది కూడా మనసిచ్చిన వాడే కామాంధుడిగా మారాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, బలవంతంగా ప్రియురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరికి అది సామూహిక అత్యాచారానికి దారితీయడం, పదే పదే ఈ దారుణం జరగడం విశాఖలో కలకలం రేపుతోంది. నీ వీడియోలు మా వద్ద ఉన్నాయంటూ లా స్టూడెంట్ పై ప్రేమికుడు, అతడి స్నేహితులు కొన్ని నెలల నుంచి సామూహిక అత్యాచారానికి పాల్పడుతున్నారు. వేధింపులు భరించలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయడంతో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 

విశాఖపట్నంలో లా (Law Course) చదువుతోన్న విద్యార్థినిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఆమె ప్రియుడు కూడా ఉన్నాడు. యువతిపై అత్యాచారం చేస్తున్న సమయంలో ఆ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఆ ఫొటోలు వీడియోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెకు నరకం చూపించారు. చివరికి బాధితురాలి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఈ అమానుష ఘటన వెలుగు చూసింది.

అసలేం జరిగిందంటే..
బాధిత యువతి మధురవాడలో లా కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. వంశీతో కుదిరిన స్నేహం అనంతరం ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఆగస్టు 10వ తేదీన కంబాలకొండకు తీసుకువెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటాను ఏం ఇబ్బంది ఉండదంటూ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మరో మూడు రోజుల తరువాత తన ఫ్రెండ్‌ ఆనంద్‌ ఇంటికి తీసుకెళ్లి మరోసారి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతడి స్నేహితులు రాజేష్‌, ఆనంద్‌, జగదీష్‌ యువతిపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. యువతిపై దారుణానికి పాల్పడుతుండగా వీడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని బాధితురాలికి నరకం చూపిస్తున్నారు.

తమ కోరిక తీర్చాలని లేకపోతే ప్రైవేట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని భయపెట్టారు. ఈ విషయాన్ని బాధితురాలు వంశీకి చెప్పడంతో వారు చెప్పినట్లు చేయమని ఒత్తిడి చేసినట్లు బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులు భరించలేక నవంబర్ 18న ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మాహత్యాయత్నం చేయగా, ఇది గమనించిన తండ్రి ఆమెను అడ్డుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని, ఎదుర్కొన్న భయానక పరిస్థితులను తండ్రికి చెప్పి కన్నీటిపర్యంతమైంది. ఆమె ఫ్యామిలీ విశాఖ టూ టౌన్‌ పోలీసులకు జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. 

Also Read: China Crime: వాట్సాప్‌ గ్రూపుల్లో స్టాక్ మార్కెట్ స్కాములు - చైనీయుడి అరెస్ట్ - ఈ నెట్‌వర్క్‌లో మీరు కూడా చిక్కుకుని ఉండొచ్చు !

కఠినంగా శిక్షించాలని పోలీసులకు హోం మంత్రి ఆదేశాలు

విశాఖలో లా స్టూడెంట్ పై సామూహిక అత్యాచార ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం అన్నారు. విశాఖ పోలీస్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి, కేసుకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు హోం మంత్రి అనిత. విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ  యువకులను కఠినంగా శిక్షించాలని పోలీసులను హోం మంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాల కుటుంబానికి ప్రభుత్వం ఉండగా ఉంటుందని, తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తేలేదన్నారు వంగలపూడి అనిత.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget