అన్వేషించండి

Anantapuram Crime News: ఉరి వేసుకొని తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య-అనంతలో విషాదం

Anantapuram Crime News: అనంతపురంలో పాఠశాల కరస్పాండెంట్ వేధింపులు భరించలేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  

Anantapuram Crime News: అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల కరస్పాండెంట్ పెట్టిన చిత్ర హింసలు భరించలేకే తమ కుమారుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి చావుకు కారణం అయిన కరస్పాండెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

అసలేం జరిగిందంటే..?

అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామానికి చెందిన గొల్ల రమేష్ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమాడురు 13  ఏళ్ల హరికృష్ణ అనంతపురంలోని రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే నాలుగేళ్ల నుంచి హరికృష్ణ అదే పాఠశాలలోని హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే బుధవారం రోజు ముద్దలాపురంలోని ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న హరికృష్ణ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి తలుపులు వేసి ఉన్నాయి. హరికృష్ణను ఎంత పిలిచినా తలుపులు తెరవకపోవడంతో వాళ్లే పగులగొట్టి చూశారు. అయితే లోపలికి వెళ్లిన తల్లిదండ్రులకు ఉరికి వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. వారు ఏడుపు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన కూడేరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. 

కరస్పాండెంట్ రామాంజనేయులు వల్లే మా కుమారుడు చనిపోయాడు..

అయితే తమ కుమారుడు హరికృష్ణ మృతికి రామన్ స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులే కారణం అని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే రామాంజనేయులు తమ కుమారుడిపై దాడి చేశాడని, చిత్ర హింసలు పెట్టి ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని పోలీసులకు తెలిపారు. అయితే బుధవారం రోజు పాఠశాల నుంచి తమకు ఫోన్ చేసి మీ కుమారుడు మా పాఠశాలలో ఉండాల్సిన అవసరం లేదు, వచ్చి తీసుకుపోండని చెప్పినట్లు తెలిపారు. తాము బడికి వెళ్లకపోవడంతో తమ కుమారుడినే ఇంటికి పంపించారని చెప్పారు. అయితే ఇంటికి వచ్చినప్పటి నుంచి తమ కుమారుడు దిగాలుగా ఉన్నాడని, కరస్పాండెంట్ తనను అందరి ముందు కొట్టి అవమానించాడని పదే పదే వేదన చెందాడని చెప్పారు. నీకు నచ్చకపోతే వద్దు ఇంట్లోనే ఉండి చదువుకోమని చెప్పి తాము గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లామని తండ్రి రమేష్ వివరించాడు. 

పొలం పనులు ముగించుకొని వచ్చే సరికే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడంటూ శోక సంద్రంలో నిండిపోయారు. తమ కుమారుడి మృతికి కారణం అయిన స్కూల్ కరస్పాండెంట్ రామాంజనేయులను కఠినంగా శిక్షించాలని కోరారు. మరోవైపు విద్యార్థి సంఘాల నాయకులు కూడా హరికృష్ణ మృతికి కారణం అయిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే కాసేపు పాఠశాల భవనం ముందు ఆందోళన చేపట్టారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget