అన్వేషించండి

Anantapur Honor Killing : అనంతపురంలో పరువు హత్య, అల్లుడ్ని హత్య చేయించిన అత్త!

Anantapur Honor Killing : అనంతపురం జిల్లాలో వరుస పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. కనగానపల్లిలో కూతురు వేరే సామాజిక వర్గం యువకుడ్ని పెళ్లి చేసుకుందని అత్త అల్లుడ్ని హత్య చేయించింది.

Anantapur Honor Killing : అనంతపురం జిల్లాలో పరువు హత్యలు కలకలం రేపుతున్నాయి. ఉరవకొండలో పరువు హత్య ఘటన మరువక ముందే కనగానపల్లిలో మరో ఘటన చోటుచేసుకుంది. తమ కూతురు వేరే కులం అబ్బాయిని పెళ్లి చేసుకుందనే కారణంతో యువతి తల్లి దారుణానికి పాల్పడింది. యువకుడ్ని కిడ్నాప్ చేసి గ్రామ శివారుకు తీసుకెళ్లి గొంతుకోసి హత్యచేశారు. ఈ హత్యకు యువతి తల్లి ముగ్గురు యువకులను పురమాయించినట్లు తెలుస్తోంది. 

అసలేం జరిగింది? 

కనగానపల్లికి చెందిన మురళి అదే ప్రాంతానికి చెందిన వీణలు ప్రేమించుకున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు కావడంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల్లోని పెద్దలు అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని ఒప్పుకోని వీణ తల్లి బెదిరింపులకు పాల్పడింది. పనిమీద బయటకు వెళ్లిన మురళీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో వీణ పోలీసుల్ని ఆశ్రయించింది. మురళీ కోసం పోలీసుల గాలిస్తున్న సమయంలోనే అతడు దారుణ హత్యకు గురయ్యాడు. విగతజీవిగా పడి ఉన్న భర్త మృతదేహాన్ని చూసి వీణ గుండెలు పగిలేలా రోధించింది. తల్లి యశోదమ్మ తన భర్తను  చంపించిందని ఆరోపించింది. 

ఏడాది క్రితం ప్రేమ పెళ్లి 

రాప్తాడు మండలం లింగనపల్లి గ్రామ పొలాల్లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అతడు కనగానపల్లికి చెందిన చిట్రా మురళిగా పోలీసులు గుర్తించారు. కనగానపల్లికి చెందిన చిట్రా మురళి ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గం యువతి ములుగూరి వీణను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ 8 నెలల నుంచి రాప్తాడులో నివాసం ఉంటున్నారు. వీణ కనగానపల్లి మండలం ఎలకుంట్ల సచివాలయంలో మహిళా సచివాలయ పోలీస్ గా పనిచేస్తుంది. మురళి కియా అనుబంధ సంస్థలో పనిచేస్తున్నాడు. మురళి గురువారం కియా సంస్థకు వెళ్లేందుకు రాప్తాడు వై జంక్షన్ వద్ద బస్ కోసం వేచి ఉండగా కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి  అపహరించినట్లు తెలుస్తోంది. తన తల్లి, కుటుంబీకులు మురళిని గొంతు కోసి హత్య చేసినట్లు వీణ ఆరోపిస్తున్నారు. 

దోషులను కఠినంగా శిక్షించాలి- ఎంపీ గోరంట్ల మాధవ్ 

మురళి హత్య గురించి తెలుసుకున్న అతని తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. తమ ఒక్కగానొక్క కొడుకు అతి దారుణంగా హత్య చేశారని రోధించారు. ఈ హత్యను ఎంపీ గోరంట్ల మాధవ్ తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి పరిటాల సునీతపై విమర్శలు చేశారు. మురళి హత్యకు పరిటాల సునీత, బాలకృష్ణ, పయ్యావుల కేశవ్ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పరువు హత్యపై కురుబ సామాజిక వర్గం నేతలు ఆందోళనకు దిగారు. మురళి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ పరువు హత్యపై పోలీసులు రంగంలోకి దిగారు. అన్ని కోణాల్లో ఆరాతీస్తున్నామన్నారు కొద్దిరోజుల వ్యవధిలోనే అనంతపురం జిల్లాలో రెండు పరువు హత్యలు జరగడంతో తీవ్ర కలకలం రేపుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TDP MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా ఆరుగురికి పాజిటివ్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Farmhouse Drug Party: రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, పార్టీకి హాజరైన టీడీపీ ఎంపీ.. పోలీసులపై కాల్పులతో కలకలం!
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Embed widget