నాలుగేళ్ల చిన్నారి నిత్విక కనిపించకుండా పోయి, ఇంటి పక్కనే ఉన్న డ్రమ్ములో మృతదేహమై కనిపించింది. కుటుంబ సభ్యులు ఇది హత్య అని అనుమానిస్తున్నారు.
Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
కడప జల్లాల్లో దారుణం జరిగింది. కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారి మృతదేహం నీటి డ్రమ్ములో లభించింది. దీంతో ఎవరి పని అయ్యి ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- పులివెందుల నిత్విక మృతి కలకలం; డ్రమ్ములో మృతదేహం లభ్యం.
- పొరుగింటి మహిళపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసులు విచారణ.
- కుట్టుమిషన్ గొడవతో ఇరు కుటుంబాల మధ్య వైరం, గతంలో ఫిర్యాదులు.
- చిన్నారి హత్యతో పాత గొడవలు మళ్ళీ సంచలనమయ్యాయి.
Pulivendula Crime News : పులివెందులకు సమీపంలోని గ్రామంలో జరిగిన దారుణ ఘటన సంచలనంగా మారుతోంది. గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారి చివరికి ఇంటి పరిసరాల్లో ఉండే డ్రమ్ములో మృతదేహమై కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎక్కడికైనా వెళ్లి ఆడుకుంటుందేమో అన్న ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ చిన్నారి అలా చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇదంతా పొరుగింటి వారు చేసిన పనిగా అనుమానిస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారి డ్రమ్లోకి వెళ్లేంత హైట్ కాదని చంపేసి అందులో పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లింగాల మండలంం లోపట్నూతల గ్రామంలో ఆ దారుణం జరిగింది. చిన్నారి పేరు నిత్విక. నాగవేటి రామాచారి, సృజన దంపతుల కుమార్తె. ఇంటి ఆవరణంలో ఆడుకుంటూనే గురవారం సాయంత్రం కనిపించుండా పోయింది. చిన్నారి కోసం చాలా ప్రాంతాల్లో గాలించారు. చివరకు ఆ చిన్నారి నీళ్ల ట్యాంకులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రమ్ నాలుగు అడుగులు ఉంటుందని చిన్నారి అందులో ఎలా పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది గిట్టని వారు చేసిన పనిగానే చెబుతున్నారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్నారి నిత్వికది అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారు ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు. వీరిలో పొరుగింటి మహిళ పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా కాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కుట్టుమిషన్ విషయంలో వీరి మద్య రైవల్రీ నడుస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాలు పోలీసు స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.
గతంలో కూడా కొన్ని ఘోరాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి సంబంధించిన బైక్లు రాత్రిరాత్రే కాలిపోయాయి. ఇది పక్కంటి వారి పనేనని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కేసులో వీరిపై పొరుగింటి వారు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలోనే ఇప్పుడు చిన్నారి హత్య కలకలం రేపుతోంది.
Frequently Asked Questions
పులివెందుల దగ్గర జరిగిన దారుణ ఘటన ఏమిటి?
మృతి చెందిన చిన్నారి వివరాలు ఏమిటి?
ఆ చిన్నారి పేరు నిత్విక. నాగవేటి రామాచారి, సృజన దంపతుల కుమార్తె. ఆమె వయస్సు నాలుగేళ్లు.
ఈ దారుణం ఎక్కడ జరిగింది?
ఈ ఘటన పులివెందులకు సమీపంలోని లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నారి ఇంటి ఆవరణంలోనే డ్రమ్ములో మృతదేహమై కనిపించింది.
ఈ కేసులో పొరుగింటి వారిపై అనుమానం ఎందుకు?
చిన్నారి డ్రమ్లోకి పడటం అసాధ్యమని, హత్య చేసి పడేశారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పొరుగింటి మహిళతో కుట్టుమిషన్ విషయంలో పాత గొడవలు, ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















