అన్వేషించండి

Crime News: ఆ బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు - నంద్యాల జిల్లాలో మైనర్‌పై ఘోరం, తీవ్రంగా గాలిస్తోన్న పోలీసులు

Andhrapradesh News: నంద్యాల జిల్లాలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. బాలికను నదిలో పడేశామని నిందితులు చెప్పగా.. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Girl Killed By Three Minors In Nandyal District: నంద్యాల జిల్లాలో (Nandyal District) బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బాలికపై దారుణానికి ఒడిగట్టడంతో చిన్నారి చనిపోగా.. మృతదేహాన్ని హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్‌ కాలువలో పడేశారు. ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు చెప్పిన వివరాల ప్రకారం నదిలో గాలింపు చేపట్టారు. నిందితులు మంగళవారం నేరాన్ని అంగీకరించారని.. అదే రోజు సాయంత్రం వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు కొంతదూరంలో కాలువలో బాలిక మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని చూపించారని చెప్పారు.

తీవ్ర గాలింపు

పోలీసుల సూచనతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక మత్స్యకారులు వలలతో తీవ్రంగా గాలించారు. మరోవైపు గజ ఈతగాళ్లను సైతం రప్పించి గాలింపు చేపట్టారు. ఎంతకీ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మరోసారి నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్‌ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. 30 అడుగుల నీటిలో గాలింపు చేపడుతున్నారు. నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

ఆట పేరుతో తీసుకెళ్లి..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక అందరి పిల్లలతో పాటు ఆదివారం గ్రామ వీధుల్లో ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు బాలికను ఆడుకుందామని మాయమాటలు చెప్పి జన సంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో దారుణానికి ఒడిగట్టారు. వారి అఘాయిత్యాన్ని భరించలేక పాప మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయారు. 

బాలిక ఆచూకీ తెలియక ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాలిక తల్లిదండ్రులు ఎంపీ బైరెడ్డి శబరిని ఆశ్రయించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడగా.. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలిక ఎక్కడికి వెళ్లిందనే కోణంలో విచారించారు. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టగా.. బాలికపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాన్ని గుర్తించి పలు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వారు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. ఆమె చనిపోవడంతో ఏం చేయాలో తెలియక నదిలో పడేశామని చెప్పారు. దీంతో పోలీసులు నిందితులు చెప్పిన చోట గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.

Also Read: Anakapalli: అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన ప్రేమోన్మాది ఆత్మహత్య

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget