అన్వేషించండి

Crime News: ఆ బాలిక ఆచూకీ ఇంకా లభించలేదు - నంద్యాల జిల్లాలో మైనర్‌పై ఘోరం, తీవ్రంగా గాలిస్తోన్న పోలీసులు

Andhrapradesh News: నంద్యాల జిల్లాలో బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన రేపింది. బాలికను నదిలో పడేశామని నిందితులు చెప్పగా.. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Girl Killed By Three Minors In Nandyal District: నంద్యాల జిల్లాలో (Nandyal District) బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారం చేసి చంపేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బాలికపై దారుణానికి ఒడిగట్టడంతో చిన్నారి చనిపోగా.. మృతదేహాన్ని హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్‌ కాలువలో పడేశారు. ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారు చెప్పిన వివరాల ప్రకారం నదిలో గాలింపు చేపట్టారు. నిందితులు మంగళవారం నేరాన్ని అంగీకరించారని.. అదే రోజు సాయంత్రం వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు కొంతదూరంలో కాలువలో బాలిక మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని చూపించారని చెప్పారు.

తీవ్ర గాలింపు

పోలీసుల సూచనతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక మత్స్యకారులు వలలతో తీవ్రంగా గాలించారు. మరోవైపు గజ ఈతగాళ్లను సైతం రప్పించి గాలింపు చేపట్టారు. ఎంతకీ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు మరోసారి నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్‌ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. 30 అడుగుల నీటిలో గాలింపు చేపడుతున్నారు. నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

ఆట పేరుతో తీసుకెళ్లి..

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండలం మచ్చుమర్రి గ్రామానికి చెందిన ఎనిమిదేళ్ల బాలిక అందరి పిల్లలతో పాటు ఆదివారం గ్రామ వీధుల్లో ఆడుకుంటోంది. అదే గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు బాలికను ఆడుకుందామని మాయమాటలు చెప్పి జన సంచారం లేని ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర నిర్మానుష్య ప్రాంతంలో దారుణానికి ఒడిగట్టారు. వారి అఘాయిత్యాన్ని భరించలేక పాప మృతి చెందింది. అనంతరం మృతదేహాన్ని నదిలో పడేసి ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయారు. 

బాలిక ఆచూకీ తెలియక ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ బాలిక తల్లిదండ్రులు ఎంపీ బైరెడ్డి శబరిని ఆశ్రయించారు. పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడగా.. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆదివారం బాలిక ఎక్కడికి వెళ్లిందనే కోణంలో విచారించారు. డాగ్ స్క్వాడ్‌తో గాలింపు చేపట్టగా.. బాలికపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాన్ని గుర్తించి పలు ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురు బాలురును అదుపులోకి తీసుకుని విచారించగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. బాలికను తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు వారు పోలీసుల ఎదుట ఒప్పుకొన్నారు. ఆమె చనిపోవడంతో ఏం చేయాలో తెలియక నదిలో పడేశామని చెప్పారు. దీంతో పోలీసులు నిందితులు చెప్పిన చోట గాలింపు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఆందోళన నెలకొంది. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు.

Also Read: Anakapalli: అనకాపల్లి జిల్లాలో బాలికను హత్య చేసిన ప్రేమోన్మాది ఆత్మహత్య

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget