అన్వేషించండి

Special Recharge For Voice Calls : డేటా అవసరం లేని వాళ్లకు గుడ్ న్యూస్ -త్వరలోనే వాయిస్ కాల్స్‌ కోసం ప్రత్యేక ప్లాన్‌లు

Special Recharge For Voice Calls : డేటా అవసరం లేని వాళ్ల కోసం ప్రత్యేక ప్లాన్ తీసుకురావాలని టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశించింది. అదే టైంలో స్పెషల్ రీచార్జ్ గడువును కూడా ఏడాదికి పెంచింది.

Special Recharge For Voice Calls : దేశంలో వాయిస్ కాల్స్ కోసం రిచార్జ్ చేసే పని లేకుండా పోయింది. అన్నింటినీ కలిపి డేటా ప్లాన్‌లో కలిపేశారు. ఈ డేటా తీసుకుంటే చాలా వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీ అని చెబుతున్నారు. మరి డేటా ఉపయోగించని వారి పరిస్థితి ఏంటీ. అలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్త ప్లాన్‌లు తీసుకురావాలని ట్రాయ్‌ టెలికాం కంపెనీలను ఆదేశించింది. 

చాలా మంది రెండు మూడు సిమ్‌లు వాడుతుంటారు. అందులో డేటా అవసరం లేకపోయినా వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం ఆ సిమ్‌లు ఉంచాల్సిన పరిస్థితి వస్తోంది. కానీ వాటికే చెల్లిస్తామంటే టెలికాం కంపెనీలు ఊరుకోవు. మీరు ఏం చేసినా ఆ నెంబర్ మెంటైన్ చేయాలంటే కచ్చితంగా 200రూపాయలతో రీచార్జ్ చేసుకోవాల్సిందే అంటూ దోచేస్తున్నాయి. 

ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు ట్రాయ్‌ టెలికాం కంపెనీలకు గట్టిగానే ఆదేశాలు జారీ చేసింది. డేటా అవసరం లేని గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం కచ్చితంగా వాయిస్, మెసేజ్‌ల కోసం ప్రత్యేక ప్లాన్‌లు అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. దీని వల్ల డేటా అవసరం లేని వృద్ధులు, ఫీచర్ ఫోన్లు వాడే వ్యక్తులు, రెండు మూడు సిమ్‌లు కలిగి ఉన్న వాళ్లకు ఇది బాగా యూజ్ అవుతుంది. 

Also Read: సైబర్ నేరాల కట్టడికి కొత్త టెక్నిక్.. ఎలా సేవ్ కావాలో కాలర్ ట్యూన్ చెప్తుందట

డేటా లేకుంటే తక్కువ ధరకే రీచార్జ్‌ ప్లాన్‌లు అందుబాటులోకి వస్తాయని వినియోగదారులు ఆశపడుతున్నారు. డేటా అవసరం లేని వాళ్లంతా ప్రతి నెల తిట్టుకొని రీచార్జ్ చేస్తున్నారు. అలాంటి వాళ్లకు ఇది నిజంగానే గుడ్ న్యూస్. మరోవైపు ఇప్పటి వరకు స్పెషల్ రీచార్జ్ కూపన్‌లను 90 రోజులకు మాత్రమే పరిమితం చేసింది. దాన్ని ఏడాదికి పొడిగించింది. దీంతో పదే పదే రీఛార్జ్ చేసే ఇబ్బంది తప్పుతుందని కూడా వినియోగదారులు సంబరపడిపోతున్నారు.  

సైబర్ నేరాగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కూడా ట్రాయ్ సిద్ధమైంది. దీని కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. గతంలో కరోనా వ్యాప్తి చెందుతున్న టైంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసినట్టుగానే మరో ప్రయత్నం చేస్తోంది. సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ ఓ ప్రత్యేక కాలర్ ట్యూన్‌ను రెడీ చేసింది. సెలెక్టెడ్ మోడ్‌లో దీన్ని అవతలి వాళ్లకు వినిపించనుంది. ఇందులో ఎలాంటి నేరాలు జరగవచ్చో చెప్పడమే కాకుండా వాటిని నుంచి తప్పించుకునే మార్గాలను కూడా తెలియజేయనుంది. 

దీన్ని వీలైనంత త్వరగా ఆచరణలోకి తీసుకురావాలని ట్రాయ్ యోచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే టెలికాం కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి. ఒకట్రెండు రోజుల్లో ఇది అమల్లోకి రానుంది.  కరోనా టైంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుక అమితాబ్‌ బచ్చన్‌ వాయిస్‌తో వ్యాది తీవ్రతను తెలియజేశారు. ఏం చేయాలో వివరించారు. ప్రజలకు ధైర్యం చెబుతూనే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల్లో భయం కలిగించకుండా అవగాహన కల్పించేందుకు ట్రై చేస్తున్నారు. 

Also Read: తెలుగు రాష్ట్రాల్లో జియో దూకుడు.. ఆ కేటగిరీలో తగ్గేదేలే, మరి ఎయిర్‌టెల్‌ పరిస్థితి ఏంటీ?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?

వీడియోలు

Ind vs NZ Abhishek Sharma Records | అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్
Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య
Sanju Samson Catch in Ind vs NZ | సూపర్ క్యాచ్ పట్టిన సంజూ
India vs New Zealand First T20 | న్యూజిలాండ్ పై భారత్ విజయం
Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Reaction: కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
కేసీఆర్‌తో హరీష్ చర్చలు - కేటీఆర్ విచారణకు హాజరుపై సస్పెన్స్ - కుట్రేనంటున్న బీఆర్ఎస్
Davos Meetings: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల నేతల సమావేశాలు - లోకేష్, రేవంత్ ఆత్మీయ భేటీ
Kondapur Land: కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
కొండాపూర్‌ భూవివాదం - రూ. 4,000 కోట్ల భూమి మాదే- హైకోర్టులో ఏపీ సంచలన కౌంటర్
Singareni investigation: నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై కేంద్రం విచారణ - అక్రమాలు బయటపడతాయా?
TVK Vijay: తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
తమిళనాడు రాజకీయాల్లో మోగనున్న విజిల్ - విజయ్ పార్టీకి ఈల గుర్తు కేటాయింపు!
Chandrababu in Tamilnadu: చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
చంద్రబాబుపై తమిళనాడులో ఆగ్రహం - హోసూర్ విమనాశ్రయాన్ని అడ్డుకున్నారట!
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్- హైదరాబాద్‌- తిరువనంతపురం మధ్య అమృత్‌ భారత్ ఎక్స్‌ప్రెస్‌
Pawan Kalyan Kotappakonda Visit: కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
కోటప్పకొండకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్- శివరాత్రి లోపే పనులు పూర్తి ప్రారంభోత్సవం!
Embed widget