అన్వేషించండి

Cyber Crime : సైబర్ నేరాల కట్టడికి కొత్త టెక్నిక్.. ఎలా సేవ్ కావాలో కాలర్ ట్యూన్ చెప్తుందట

Cyber Crime : దేశంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన పెంచేందుకు టెలికాం కంపెనీలు కొత్త ప్రయత్నం చేస్తున్నాయి. సైబర్ నేరాలను ఎలా నివారించాలో కాలర్ ట్యూన్ తెలియజేస్తుంది.

Cyber Crime : దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రోజు రోజుకూ సైబర్ నేరాల సంఖ్య రెట్టింపవుతూనే ఉంది. ఈ నేరాలను అరికట్టేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజుకో కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తుండడం గమనార్హం. ఇప్పుడు కేంద్రం మరో కొత్త ఐడియాతో ముందుకొచ్చింది. సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ఓ కొత్త చొరవను ప్రారంభించింది. మొన్నటి వరకు కరోనా గురించి జాగ్రత్తలు చెబుతూ అమితాబ్‌ బచ్చన్‌ ప్రజలను అప్రమత్తం చేసే వాళ్లు ఇప్పుడు మరో కొత్త గొంతు సైబర్ నేరాలపై అవగాహన కల్పించనుంది. 

హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) టెలికమ్యూనికేషన్స్ విభాగానికి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు టెలికాం కంపెనీలు కాలర్-ట్యూన్, ప్రీ-కాలర్ ట్యూన్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ కాలర్ ట్యూన్‌లలో, సైబర్ నేరాలను నివారించే మార్గాలను ప్రజలకు తెలియజేస్తుంది. ఈ కాలర్ ట్యూన్ ప్రతిరోజూ 8 నుంచి 10 సార్లు ప్లే అవుతుంది.

ఈ ప్రచారం దేశంలోని ప్రతి ఒక్కరికీ తెలిసేందుకు టైం పడుతుంది. అందుకే దీన్ని 3 నెలల పాటు కొనసాగించనున్నారు. ఇందులో కాలర్ ట్యూన్ ద్వారా వివిధ మెసేజ్ లను సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తారు. పోలీసు అధికారి లేదా న్యాయమూర్తి పేరుతో ఎవరైనా మోసం చేస్తే ఏం చేయాలో ఇందులో చెప్తారు. మరోపక్క దేశంలో గత కొన్ని నెలలుగా దేశంలో డిజిటల్ అరెస్ట్ వంటి కేసులు పెరిగిపోవడం చూస్తూనే ఉన్నాం. అందులో మోసగాళ్లు, నకిలీ అధికారులుగా నటిస్తూ ప్రజలకు ఫోన్ చేసి కష్టపడి సంపాదించిన సొమ్మును కాజేస్తున్నారు. ఇది కాకుండా, KYC అప్డేట్స్, కొత్త ఆఫర్లు వంటి మొదలైన సాకులతో ప్రజలను సైబర్ సంక్షోభానికి బలిపశువులను చేస్తున్నారు.

ఈ నేరాలను అరికట్టాలని ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ప్రతిసారీ మోసగాళ్ళు ప్రజలను ట్రాప్ చేయడానికి కొత్త కొత్త పద్ధతులను రూపొందిస్తున్నారు. ఇటీవల ఇటువంటి సందర్భాలలో ఉపయోగించే 6 లక్షలకు పైగా సిమ్ కార్డులను ప్రభుత్వం బ్లాక్ చేసింది. సైబర్ నేరాలను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా నవంబర్ 15, 2024 వరకు 6.69 లక్షల సిమ్ కార్డులు, 1,32,000 IMEI నంబర్‌లను 'బ్లాక్' చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ 9.94 లక్షల ఫిర్యాదుల పరిష్కారం ద్వారా రూ. 3,431 కోట్లకు పైగా ఆదా చేయడంలో సహాయపడిందని కూడా తెలియజేసింది.

డిజిటల్ అరెస్ట్ అంటే..

డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ క్రైమ్ కు సంబంధించిన కొత్త తరహా మోసం. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ తదితర సంస్థల అధికారుల పేరుతో ప్రజలకు ఫోన్ చేసి, తప్పుడు కేసులు పెట్టి, బెదిరించి, ఆపై డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌తో సహా అనేక మార్గాల ద్వారా వారి నుంచి డబ్బును వసూలు చేస్తారు. అలా మోసగాళ్లు బాధితుల నుంచి లక్షలు, కోట్లలో డబ్బులు దండుకుంటారు.

Also Read : Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget