అన్వేషించండి

Nifty: హిస్టారికల్‌ మూమెంట్‌ చూద్దామనుకుంటే హిస్టీరియా తెప్పించింది, స్టాక్‌ మార్కెట్‌తో ఇట్లుంటది

అందరి ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి, టపాసుల పెట్టెలు అటకెక్కాయి.

Nifty@20,000: కోట్లాది మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లను ఊరించి, ఉసూరుమనిపించింది నిఫ్టీ. 21 పాయింట్లేగా, ఓపెనింగ్‌లోనే అందుకుంటుందిలే అనుకున్నారంతా. చరిత్రలో మిగిలిపోయే రోజువుతుందంటూ ఇవాళ్టి డేట్‌ రాసి పెట్టుకున్నారు. టాపాసులు సిద్ధం చేశారు. కానీ... అందరి ఆశలు, అంచనాలు తలకిందులయ్యాయి, టపాసుల పెట్టెలు అటకెక్కాయి.

గురువారం నాడు 19,779 పాయింట్ల దగ్గర నిఫ్టీ50 ఇండెక్స్‌ క్లోజ్‌ అయింది. హిస్టారికల్‌ మూమెంట్‌ అయిన 20,000 (20k) పాయింట్లకు జస్ట్‌ 21 పాయింట్ల దూరంలో ఆగింది. నిన్న, ఒక దశలో, 19,991.85 వరకు వెళ్లి కొత్త జీవిత కాల గరిష్టాన్ని క్రియేట్‌ చేసిన ఈ ఇండెక్స్‌, 20k శిఖరానికి కేవలం 9 పాయింట్ల దూరంలో ఆగింది. 

20,000 మైలురాయిని చేరుకునేందుకు బాకీ ఉన్న 21 పాయింట్లను ఇవాళ ఓపెనింగ్‌ సెషన్‌లోనే నిఫ్టీ అందుకుంటుందని అనుకుంటే, అందరి అంచనాలు గల్లంతయ్యాయి. దీనికి కారణం.. ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌.

ఇన్ఫోసిస్ షేర్లు 10% క్రాష్‌ కావడంతో హెడ్‌లైన్‌ ఇండెక్స్‌లు 1% పైగా పతనమయ్యాయి. నిఫ్టీ 19,800 స్థాయిని, సెన్సెక్స్ 67,000 మార్కును కోల్పోయాయి.

ఇవాళ ఇండెక్స్‌ను కిందకు లాగిన కీలక కారణాలు:

1) IT భయాలు
ఇన్ఫోసిస్, జూన్ త్రైమాసికంలో CC (స్థిరమైన కరెన్సీ) పరంగా 1% QoQ వృద్ధితో స్ట్రీట్ అంచనాలను అందుకోగలిగింది. అయితే, FY24 ఆదాయ వృద్ధి గైడెన్స్‌ను 4-7% నుంచి భారీగా 1-3.5% YoYకి తగ్గించింది. గ్లోబల్‌గా అనిశ్చిత పరిస్థితులు ఇంకా కంటిన్యూ కావచ్చని ఈ ఐటీ కంపెనీ గైడెన్స్‌ గుర్తు చేసింది. 

నిఫ్టీలో ఇన్ఫోసిస్‌కు 5.9% వెయిటేజీ ఉంది. ఈ రోజు ఇండెక్స్‌ను డ్రాగ్‌ చేసిన అతి పెద్ద ప్లేయర్‌ ఈ కంపెనీ. ఇన్ఫోసిస్‌ గైడెన్స్‌ ఇతర IT స్టాక్స్‌ మీద కూడా ప్రభావం చూపింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 4 శాతానికి పైగా పతనమైంది. TCS 2.4%, విప్రో 4%, HCL టెక్ 5% పడిపోయాయి.

2) మూడ్‌ పాడు చేసిన నాస్‌డాక్‌
నెట్‌ఫ్లిక్స్, టెస్లా షేర్లలో విపరీతమైన అమ్మకాలతో, టెక్-హెవీ ఇండెక్స్‌ నాస్‌డాక్ నిన్న 2% పడిపోయింది. ఆ ఎఫెక్ట్ కూడా ఇండియన్‌ మార్కెట్‌ మీద, ముఖ్యంగా ఐటీ స్టాక్స్‌ మీద పడింది. ఎలక్ట్రిక్ కార్ల రేట్లు తగ్గింపు ఫలితంగా టెస్లా షేర్లు దాదాపు 10% పడిపోయాయి. ఆదాయ అంచనాలు మిస్‌ కావడంతో నెట్‌ఫ్లిక్స్ స్టాక్‌ 8.4% దిగొచ్చింది.

3) రిలయన్స్ షేర్లలో అమ్మకాలు
మాతృ సంస్థ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విడదీసిన తర్వాత, ఇండెక్స్ హెవీవెయిట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2% పడిపోయాయి. గురువారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌లో JFSL షేర్ల విలువ రూ. 261.85 గా ఖరారైంది.

4) వాల్యుయేషన్స్‌
గత కొన్ని వారాలుగా దలాల్ స్ట్రీట్‌లో వన్-వే ర్యాలీ కారణంగా వాల్యుయేషన్లు హై రేంజ్‌కు చేరాయి. FY24 ఆదాయాల అంచనాల ఆధారంగా, ప్రస్తుతం నిఫ్టీ PE 20 పైనే ఉంది. యుఎస్ మినహా, భారతదేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మార్కెట్. హయ్యర్‌ వాల్యుయేషన్స్‌ కారణంగా, చిన్నపాటి నెగెటివ్‌ ట్రిగ్గర్‌ కూడా అతి పెద్ద కరెక్షన్‌కు దారి తీయవచ్చు. ఇదే భయం ఇన్వెస్టర్లు, ట్రేడర్లను ఇప్పుడు వెంటాడుతోంది.

5) టెక్నికల్‌ వర్రీస్‌
మొమెంటం ఇండికేటర్స్‌ బుల్లిష్‌గా ఉన్నప్పటికీ, గురువారం, మార్కెట్ షార్ట్‌-టర్మ్‌ టెక్చర్‌ ఓవర్‌బాట్‌ జోన్‌లోకి వెళ్లింది. అందువల్ల ట్రేడర్లు లాభాలు బుక్ చేసుకున్నారు. 

నిఫ్టీ ఓవర్‌బాట్‌ జోన్‌లో ఉంది కాబట్టి, 20k మార్క్‌ను చేరడానికి కొంత కష్టపడాలి. ఈ ఇండెక్స్‌కు 19,759 వద్ద సపోర్ట్‌ కనిపిస్తోంది.

మరో ఆసక్తికర కథనం: రిలయన్స్‌ ఫలితాలు నేడే విడుదల - 36 లక్షల మంది షేర్‌హోల్డర్లు ఏం ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు?

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget