అన్వేషించండి

Hindenburg Row: హిండన్‌బర్గ్ ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన సెబీ ఛైర్‌పర్సన్, వివాదంపై కీలక స్టేట్‌మెంట్‌

Hindenburg Issue: హిండన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురి తీవ్రంగా స్పందించారు. అవన్నీ నిరాధారమైనవే అని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

Hindenburg Report: సెబీ ఛైర్‌పర్సన్‌ మాధబి పురితో పాటు ఆయన భర్త ధావల్ బుచ్‌కి అదానీ గ్రూప్‌కి చెందిన సంస్థల్లో షేర్స్‌ ఉన్నాయంటూ అమెరికాకి చెందిన హిండర్‌బర్గ్‌ రిపోర్ట్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది. అదానీ గ్రూప్‌లో జరుగుతున్న అవకతవకల్ని బయటపెట్టకపోవడానికి ఇదే కారణమని కాంగ్రెస్ తీవ్రంగా మండి పడుతోంది. అయితే..ఈ వివాదంపై మాధవి పురి స్పందించారు. హిండన్‌ రిపోర్ట్‌లోని ఆరోపణల్ని కొట్టి పారేశారు. అవి నిరాధార ఆరోపణలు అని తేల్చి చెప్పారు. దీన్ని వ్యక్తిగత దాడిగానే చూస్తున్నట్టు అభివర్ణించారు. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేశారు. తమ జీవితాలు తెరిచిన పుస్తకం అని, సెబీకి అన్ని వివరాలూ తెలుసని వెల్లడించారు. తమ వ్యక్తిగత వివరాలు బయటపెట్టేందుకు ఎప్పుడూ వెనకడామని తేల్చి చెప్పారు. ఈ వివాదంపై మరోసారి పూర్తి స్థాయిలో స్టేట్‌మెంట్ ఇస్తామని వివరించారు. (Also Read: Bangladesh: బంగ్లాదేశ్‌లో లక్షలాది మంది హిందువుల ర్యాలీ, దాడులను నిరసిస్తూ రోడ్లపై నినాదాలు)

"హిండన్‌బర్గ్ రిపోర్ట్‌లో వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవే. అందులో ఏ ఒక్కటీ నిజం లేదు. మా జీవితం, మా ఆర్థిక వ్యవహారాలన్నీ తెరిచి పుస్తకం లాంటివే. అందులో దాచడానికి ఏమీ లేదు. SEBI కి అన్ని వివరాలూ తెలుసు. ఈ వివరాలు బయటపెట్టడంలో ఎప్పుడూ వెనకాడలేదు. పూర్తి పారదర్శకంగా ఉన్నాం. మరి కొద్ది రోజుల్లో ఈ వ్యవహారానికి సంబంధించి మరో స్టేట్‌మెంట్ కూడా ఇస్తాం"

- మాధబి పురి, సెబీ ఛైర్‌పర్సన్ 

అటు అదానీ గ్రూప్‌ కూడా ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ మేరకు ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఆరోపణలపై విచారణ జరిగిందని, అవన్నీ నిరాధారమేనని స్పష్టం చేసింది. పదేపదే అవే ఆరోపణలు చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని మండి పడింది. సుప్రీంకోర్టు విచారించి ఇన్నీ నిరాధారం అని ఇప్పటికే తేల్చి చెప్పినట్టు గుర్తు చేసింది అదానీ గ్రూప్. ఏ ఆర్థిక సంస్థతోనూ తమకు సంబంధాలు లేవని, కేవలం తమ సంస్థ ప్రతిష్ఠకు మచ్చ తేవాలనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నారని స్పష్టం చేసింది. తమ సంస్థ ఎప్పుడూ పారదర్శకంగా ఉంటుందని వెల్లడించింది. అన్ని వివరాలూ ఎప్పుడూ పబ్లిక్‌గానే ఉంటాయని వివరించింది. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు చేసినట్టు అసహనం వ్యక్తం చేసింది. ఏ ఆధారాలూ లేకుండా తమ సంస్థపై ఇలాంటి ప్రచారం ఎలా చేస్తున్నారంటూ మండి పడింది. 

Also Read: Viral Video: బుసలు కొడుతూ వచ్చి చెప్పు ఎత్తుకెళ్లిన పాము, ఏం చేసుకుంటుందో - వీడియో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu: తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
తమిళనాడు కేబినెట్‌లో మార్పులు- డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్, ప్రమాణానికి ముహూర్తం ఫిక్స్
Team India Squad: బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ, ఓ వేదికగా హైదరాబాద్
CM Chandrababu: రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి - స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు సహకరిస్తామన్న సీఎం చంద్రబాబు
Telangana Digital Cards: ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మ‌హిళే య‌జ‌మాని - అక్టోబ‌రు 3 నుంచి పైలెట్‌ ప్రాజెక్టు: రేవంత్ రెడ్డి
ATM Robbery: సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
సినిమా సీన్లను మించేలా ఛేజింగ్, ఆపై ఎన్‌కౌంటర్‌ - కేరళలో చోరీ చేసి తమిళనాడులో దొరికిన గ్యాంగ్
Dhoom 4: 'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
'ధూమ్ 4' నుంచి సాలిడ్ అప్డేట్ - విలన్ గా యానిమల్ స్టార్.. మరి హీరో సంగతేంటి? 
Vangalapudi Anitha : తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
తనలాగా హిందువునని చెప్పుకోవాలని జగన్‌కు హోంమంత్రి అనిత సవాల్ - వీడియో రిలీజ్ చేసిన వైఎస్ఆర్‌సీపీ
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Embed widget