అన్వేషించండి

RBI Repo Rate: వడ్డీ రేట్లు యథాతథం.. పండుగ సమయంలో దేశ ప్రజలను నిరాశపరిచిన ఆర్బీఐ

RBI MPC Meeting | ద్రవ్య విధాన కమిటీ ఈసారి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదు. కీలకమైన రెపో రెట్లు యథాతథంగా ఉంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

RBI Governor Sanjay Malhotra | ముంబై: దసరా, దీపావళి పండుగల సమయంలో వడ్డీ రేట్లు తగ్గించి ఆర్బీఐ శుభవార్త చెబుతుందని ఆశించిన దేశ ప్రజలకు నిరాశే ఎదురైంది. కీలక రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం ఉదయం మాట్లాడుతూ.. భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) కీలక రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని వెల్లడించారు. ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) నిర్ణయాన్ని బుధవారం ఉదయం వెల్లడించారు. ప్యానెల్ ఏకగ్రీవంగా కీలక రేట్లను మార్చకుండా ఉంచాలని నిర్ణయించిందని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు.

రెపో రేటు 5.5 శాతంగా కొనసాగింపు

ఈ ఎంపీసీ ప్యానెల్ రెపో రెట్లను యథాతథంగా కొనసాగించింది. ప్రస్తుతం, రెపో రేటు 5.5 శాతం వద్ద ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా, RBI  సోమవారం నాడు మూడు రోజుల సమీక్షను ప్రారంభించింది. మార్కెట్లు బెంచ్ మార్క్ లోన్ రేట్లపై ఆర్బీఐ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూశాయి. రెపో రేటు ఇప్పుడు 5.50 శాతం వద్ద ఉండగా, అందులో ఏ మార్పు చేయలేదు. వరుసగా రెండో సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5.25 శాతంగా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 5.75 శాతం వద్ద ఉన్నాయి.

ఆర్థిక వ్యవస్థ ఊపందుకునేలా ఫిబ్రవరి 2025 నుంచి RBI ఇప్పటికే 100 బేసిస్ పాయింట్లు రేటు తగ్గించింది. ఆగస్టు పాలసీ సమావేశంలో, MPC గతంలో చేసిన కోతల తర్వాత వడ్డీ రేట్లను మార్చలేదు. పండుగల సీజన్లో వడ్డీ రేట్లు తగ్గిస్తుందని దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినా నిరాశ తప్పలేదు. జీఎస్టీ తగ్గింపుతో పాటు వడ్డీ రేట్లు దిగొస్తే ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని మార్కెట్లు సైతం భావించాయి.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Key Comments: ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
ఓట్లు తగ్గినా, పెరిగినా డేంజరే -స్థానికల్లో పోటీ చేసి తీరాలి - పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం
Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?
ED Raids Kerala: కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
కేరళలో ఈడీ అధికారులపై సీపీఎం కార్యకర్తల దాడి - మాజీ సీఎం విజయన్ ఇంట్లో సోదాలు చేశారని ఆగ్రహం
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Nara lokesh Big Announcement మహిళలకు 33 శాతం సీట్లు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Embed widget