అన్వేషించండి

RBI Governor: ₹2000 నోట్ల డిపాజిట్లకు పాత రూల్‌ - పరిమితి దాటితే PAN ఇవ్వాల్సిందే

నోట్ల మార్పిడికి, జమకు నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి బ్యాంకులకు రావడానికి తొందరపడవద్దని, మార్కెట్‌లో ఇతర నోట్ల కొరత లేదని స్పష్టం చేశారు.

RBI Governor on 2000 Rupees Notes: ₹2000 నోటు ఉపసంహణపై తొలిసారి స్పందించారు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das). మీడియా సమావేశం నిర్వహించిన దాస్‌, 2000 రూపాయల నోట్ల ఉపసంహరణపై మాట్లాడారు. ఆ నోట్లను ఎందుకు తీసుకువచ్చామో ఆ ఉద్దేశ్యం నెరవేరిందని చెప్పారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత రాకుండా చూసేందుకు, వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడం కోసం రూ. 2,000 నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. ఇప్పుడు వ్యవస్థలో నగదు కొరత లేకపోవడం & పెద్ద డినామినేషన్ నోట్ల వాడకం తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. 

సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూ. 2000 నోట్లను మార్పిడి, ఖాతాల్లో జమ జరుగుతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు సెప్టెంబరు 30వ తేదీ వరకు సమయం ఇచ్చాం కాబట్టి, ఆ గడువు నాటికి చాలా వరకు రూ. 2,000 నోట్లు తిరిగి ఖజానాకు చేరతాయని తాము భావిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ చెప్పారు.

₹2000k నోట్ల డిపాజిట్లకు పాత రూల్‌
రూ. 2000 నోట్ల జమకు కొత్త రూల్స్‌ ఏమీ పెట్టలేదన్న గవర్నర్‌, ఒక ఖాతాలో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు గుర్తు చేశారు. అదే నిబంధన రూ. 2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోట్లను తీసుకుని, ఇతర డినామినేషన్ల నోట్లను ఇచ్చే విధంగా సన్నద్ధం కావాలని బ్యాంకులను ఇప్పటికే ఆదేశినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. 

నోట్ల మార్పిడి, జమ కోసం బ్యాంకుల వద్ద బారులు తీరి ఇబ్బంది పడవద్దని దాస్‌ ప్రజలకు సూచించారు. నోట్ల మార్పిడికి, జమకు నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి బ్యాంకులకు రావడానికి తొందరపడవద్దని, మార్కెట్‌లో ఇతర నోట్ల కొరత లేదని స్పష్టం చేశారు. RBI నిర్ణయాన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకుని, పెద్ద నోట్లన్నీ వాపస్‌ చేస్తారనే ఉద్దేశంతోనే అంత సమయం ఇచ్చామని శక్తికాంత దాస్‌ చెప్పారు. దేశంలోని కొందరు వ్యాపారులు చాలా కాలం క్రితం నుంచే రూ. 2,000 నోట్లను తీసుకోవడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రకటన తర్వాత అలాంటి వ్యాపారుల సంఖ్య పెరిగిందని అన్నారు. 

రూ.1,000 నోట్లను మళ్లీ తీసుకొస్తారా?
రూ. 2000 నోటు తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయని, విధాన నిర్ణయం ప్రకారం ఆ చర్య తీసుకున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం క్లీన్ నోట్ పాలసీలో భాగమని, దీన్ని ఆర్‌బీఐ కరెన్సీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో భాగంగా పరిగణించాలని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. భారత కరెన్సీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉందన్న ఆర్‌బీఐ గవర్నర్, మరిన్ని రూ. 500 నోట్లను ప్రవేశపెట్టాలనే నిర్ణయం ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని వివరించారు. రూ. 2000 రూపాయల లోటును భర్తీ చేయడానికి రూ. 1,000 నోట్లను మళ్లీ తీసుకొస్తారా అన్న ప్రశ్నకు, అలాంటి  వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

మార్కెట్‌లో చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.18% మాత్రమేనన్న గవర్నర్‌, వాటి ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై చాలా తక్కువ ప్రభావం ఉంటుందని అన్నారు.

ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా రూ.2000 నోట్ల డిపాజిట్లను అనుమతిస్తే నల్లధనాన్ని ఎలా గుర్తిస్తారని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా... పెద్ద మొత్తంలో జరిగే డిపాజిట్ల తనిఖీ విషయాన్ని ఆదాయ పన్ను విభాగం చూసుకుంటుందని చెప్పారు. నగదు జమ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలనే రూ. 2000 నోట్ల జమ సందర్భంలోనూ అమలు చేస్తాయని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బ్యాంక్‌ల వెంటబడ్డ ఎఫ్‌పీఐలు, షాపింగ్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ పేరు అదే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్

వీడియోలు

అసెంబ్లీకి కేసీఆర్? టీ-పాలిటిక్స్‌లో ఉత్కంఠ?
World Test Championship Points Table | Aus vs Eng | టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్
Virat Kohli Surprises to Bowler | బౌలర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన విరాట్
Team India New Test Coach | గంభీర్ ను కోచ్ గా తప్పించే ఆలోచనలో బీసీసీఐ
Shubman Gill to Play in Vijay Hazare Trophy | పంజాబ్ తరపున ఆడనున్న గిల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indw vs Slw 4th t20 highlights: ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
ముందు రికార్డు స్కోరు, ఆపై బౌలింగ్‌లో జోరు.. శ్రీలంకపై టీమిండియాకు మరో విజయం
MLC Nagababu: గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
గత అనవాయితీకి భిన్నంగా పవన్ కళ్యాణ్ ఆలోచన.. జనసేనాని నిర్ణయానికి కట్టుబడిన పార్టీ
iBomma Case: ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
ఐబొమ్మ కేసులో కొత్త కోణం.. ఐడెంటిటీ చోరీకి పాల్పడిన రవి- విచారణలో షాకింగ్ విషయాలు!
Nirmala Sitharaman AP Tour: విద్య, క్రీడలతోనే అంతర్జాతీయ గుర్తింపు.. తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: నిర్మలా సీతారామన్
నరసాపురం తీరప్రాంతానికి ఏం కావాలన్నా చేస్తాం: ఏపీ పర్యటనలో నిర్మలా సీతారామన్
Telugu Film Chamber : తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన కార్యవర్గం - అధ్యక్షుడిగా నిర్మాత సురేష్ బాబు, ఉపాధ్యక్షుడిగా నాగవంశీ
Prakash Raj Vs BJP Vishnu: ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
ప్రకాష్ రాజ్, విష్ణువర్ధన్ రెడ్డి మధ్య మాటల మంటలు - జస్ట్ ఆస్కింగ్‌కు జస్ట్ సేయింగ్ కౌంటర్ !
Telugu TV Movies Today: ఈ సోమవారం (డిసెంబర్ 29) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
ఈ సోమవారం (డిసెంబర్ 29) స్మాల్ స్క్రీన్‌‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Tension in Nuzvid: నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. న్యాయం కోసం యువతి రోడ్డుపై బైఠాయింపు - నూజివీడులో ఘటన
నమ్మించి మోసం చేసిన ప్రియుడు.. న్యాయం కోసం యువతి రోడ్డుపై బైఠాయింపు - నూజివీడులో ఘటన
Embed widget