అన్వేషించండి

PSBs: ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు అదరహో, తొలిసారి అలాంటి అద్భుతం

2017-18లో రూ. 85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన PSBలు, క్రమంగా పుంజుకుని 2022-23లో రూ.1,04,649 కోట్ల లాభానికి చేరుకున్నాయి.

Public Sector Banks Profit: గత ముగిసిన ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23) ప్రభుత్వ రంగ బ్యాంకులు అద్భుతం చేశాయి. మన దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం (cumulative profit) లక్ష కోట్ల రూపాయల మార్కును అధిగమించింది. ఈ ఫీట్‌ సాధించడం ఇదే తొలిసారి. 

ఏడాదిలో 57 శాతం పెరిగిన లాభాలు
మన దేశంలో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs) ఉన్నాయి. 2017-18లో రూ. 85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసిన PSBలు, క్రమంగా పుంజుకుని 2022-23లో రూ.1,04,649 కోట్ల లాభానికి చేరుకున్నాయి. 2021-22లో ఆర్జించిన సంచిత లాభం రూ. 66,539.98 కోట్ల లాభంతో పోలిస్తే, 2022-23లో ఏకంగా 57 శాతం పెరిగింది.

లక్ష కోట్ల రూపాయల లాభం ఘనతలో సగం వాటా మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది (SBI). ఆ ఆర్థిక సంవత్సరంలో, SBI, రూ. 50,232 కోట్ల వార్షిక లాభాన్ని నివేదించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం కంటే 59 శాతం వృద్ధిని సాధించింది.

శాతం పరంగా చూస్తే, నికర లాభంలో 126% వృద్ధితో రూ. 2,602 కోట్లను సాధించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BoM) తొలిస్థానంలో ఉంది. 100% పెరుగుదలతో రూ. 1,862 కోట్ల లాభానికి చేసిన యూకో (UCO) బ్యాంక్‌ రెండో స్థానంలో, 94% వృద్ధితో రూ. 14,110 కోట్ల లాభం సాధించిన బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) మూడో స్థానంలో ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మినహా, మిగిలిన PSBలన్నీ ఆకర్షణీయమైన లాభాన్ని ఆర్జించాయి. దిల్లీ ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న PNB వార్షిక నికర లాభం 2021-22లో రూ. 3,457 కోట్లుగా ఉండగా, 2022-23లో 27% శాతం క్షీణించి రూ. 2,507 కోట్లకు పరిమితమైంది.

రూ.10,000 కోట్ల లాభం దాటిన బ్యాంక్‌లు
SBI కాకుండా, రూ.10,000 కోట్ల కంటే ఎక్కువ వార్షిక లాభాన్ని నివేదించిన ఇతర PSBలు.. బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 14,110 కోట్లు), కెనరా బ్యాంక్ (రూ. 10,604 కోట్లు).

పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్ వార్షిక లాభం 26 శాతం (రూ. 1,313 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 51 శాతం (రూ. 1,582 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 23 శాతం (రూ. 2,099 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా 18 శాతం (రూ. 4,023 కోట్లు), ఇండియన్ బ్యాంక్ 34 శాతం (రూ. 5,282 కోట్లు), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 61 శాతం (రూ. 8,433 కోట్లు) లాభాలను సాధించాయి.

2023 మార్చి త్రైమాసికం/2022-23 నాలుగో త్రైమాసికంలో, 12 PSBల సంచిత లాభం 95% పైగా పెరిగి రూ. 34,483 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ. 17,666 కోట్లుగా ఉంది.

అధిక వడ్డీ ఆదాయం, నిరర్థక ఆస్తుల నిర్వహణలో మెరుగుదల, మొండి బకాయిలు తగ్గడం, పీఎస్‌బీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి మూలధనం, RBI చేపట్టిన సంస్కరణలే ఈ స్థాయి లాభాలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: ICICI బ్యాంక్‌ వడ్డీ రేట్లు మారాయ్‌, మీ FDపై ఎంత ఆదాయం వస్తుందో తెలుసుకోండి

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna Padma Bhushan | నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ | ABP DesamRing Nets Issue in Srikakulam | శ్రీకాకుళం జిల్లాలో పెరుగుతున్న రింగువలల వివాదం | ABP DesamKCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP DesamSS Rajamouli Post on Mahesh Babu | ఒక్క పోస్ట్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
Raghurama Custodial Torture case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం, నిందితుల్ని గుర్తించానని వెల్లడి
Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం
Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Hyderabad News: 'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
'ఈ కోడిని కోయనంటే కోయను' - ఏ చేస్తానో తెలుసా?, కోడి పుంజుకు వ్యక్తి ఘన సన్మానం
Karnataka News: బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా? - తెగిపడిన మహిళ తల, కర్ణాటకలో షాకింగ్ ఘటన
బస్సు కిటికీలోంచి తల బయటకు పెట్టడం ఎంత ప్రమాదమో తెలుసా? - తెగిపడిన మహిళ తల, కర్ణాటకలో షాకింగ్ ఘటన
Embed widget