![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Petrol-Diesel Price, 3 January: వాహనదారులకు స్వల్ప ఊరట.. నేడు చాలా చోట్ల స్థిరంగా ధరలు, ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ..
తిరుపతిలో ఇంధన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.112.79 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
![Petrol-Diesel Price, 3 January: వాహనదారులకు స్వల్ప ఊరట.. నేడు చాలా చోట్ల స్థిరంగా ధరలు, ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ.. Petrol Diesel Price Today 3 January 2021 know rates fuel price in your city Telangana Andhra Pradesh Amaravati Hyderabad Petrol-Diesel Price, 3 January: వాహనదారులకు స్వల్ప ఊరట.. నేడు చాలా చోట్ల స్థిరంగా ధరలు, ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/02/329de95347833b23791b51ea146de0aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గత మూడు నెలల క్రితం వరకూ ఇంధన ధరలు మన దేశంలో క్రమంగా ఎగబాకుతూ వచ్చి జీవితకాల గరిష్ఠాన్ని చేరాయి. కానీ, కొద్ది రోజుల క్రితం కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త తగ్గాయి. ఈ తగ్గిన ధరలతో వాహనదారులు కొద్దిగా ఊరట చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు నేడు ఇలా ఉన్నాయి.
తెలంగాణలో..
హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్లో నేడు (జనవరి 3) పెట్రోల్ ధర రూ.0.14 పైసలు పెరిగి రూ.107.88 గా అయింది. డీజిల్ ధర రూ.0.13 పైసలు పెరిగి రూ.94.31 గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
నిజామాబాద్లో ఇంధన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.110.09 గా ఉంది. డీజిల్ ధర రూ.96.38 గా ఉంది. గత కొన్ని రోజులుగా నిజామాబాద్లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తుండగా తాజాగా స్థిరంగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.35గా ఉంది. పాత ధరతో పోలిస్తే ఏకంగా రూ.0.18 పైసలు పెరిగింది. డీజిల్ ధర బెజవాడలో రూ.96.44 గా ఉంది. ఇది రూ.0.15 పైసలు తగ్గింది.
ఇక విశాఖపట్నం మార్కెట్లో పెట్రోల్ ధర నేడు స్థిరంగా ఉంది. లీటరు ధర ప్రస్తుతం రూ.109.05 గా ఉంది. డీజిల్ ధర రూ.95.18గా ఉంది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి.
తిరుపతిలో స్థిరంగా ధరలు..
తిరుపతిలోనూ ఇంధన ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.112.79 కి చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.98.58 కి చేరింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా జనవరి 3 నాటి ధరల ప్రకారం 75.58 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా సుంకాన్ని స్వల్పంగా తగ్గించడం ద్వారా రూ.5 నుంచి రూ.10 మేర ఇంధన ధరలు తగ్గాయి.
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)