By: ABP Desam | Updated at : 14 Aug 2021 07:32 AM (IST)
Petrol diesel price
దేశంలో చెన్నై, ముంబయి, హైదరాబాద్, బెంగళూరు సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో గత 20 రోజులుగా ఇంధన ధరలు నిలకడగానే ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ధరలు నిలకడగానే ఉంటున్నాయి. హైదరాబాద్లోని ఇంధన మార్కెట్లో మూడు రోజుల క్రితం పెట్రోల్ లీటరుకు రూ.0.15 పైసలు పెరగ్గా.. మళ్లీ యథాతథ స్థితికి ధర చేరింది.
తెలంగాణలో ఆగస్టు 14న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.83 గానే కొనసాగుతుండగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. కరీంనగర్లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే నిలకడగా ఉంది. తాజాగా రూ.105.99గా ఉంది. డీజిల్ ధరలో కూడా మార్పు లేకుండా రూ.98.09 గా ఉంది.
ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.53 గా స్థిరంగానే కొనసాగుతూ ఉంది. కొద్దిరోజులుగా వరంగల్లో కూడా మెట్రో నగరాల తరహాలోనే ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్లో పెట్రోల్ ధరలో లీటరుకు సుమారు రూ.0.07 పైసల అతి స్వల్ప తగ్గుదల నమోదైంది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.08 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.36 గా ఉంది. డీజిల్ ధర రూ.99.37గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. తాజా ధరలివే..
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.25 పైసలు తగ్గి ప్రస్తుతం రూ.107.92 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.26 పైసలు తగ్గి రూ.99.49కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.107.02గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఏకంగా రూ.0.02 పైసలు మాత్రమే తగ్గింది. డీజిల్ ధర కూడా విశాఖపట్నంలో రూ.0.02 పైసలు తగ్గి రూ.98.63గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటుండగా.. తాజాగా స్వల్ప తగ్గుదల నమోదైంది.
తిరుపతిలో భారీగా పెరుగుదల
తిరుపతిలో ఇంధన ధరల్లో రోజూ భారీ మార్పులే చోటు చేసుకుంటున్నాయి. పెట్రోల్ లీటరుకు రూ.1.05 పైసలు తగ్గగా.. డీజిల్ రూ.0.94 పైసలు ఎగబాకింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.12 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. ఇక డీజిల్ ధర రూ.99.65గా ఉంది.
Also Read: ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి.. ఇదో కొత్త ట్రెండ్ బాస్..
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 13 నాటి ధరల ప్రకారం 68.44 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
Gold-Silver Prices Today: జాబ్స్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్ చేతిలో ఉంటే చాలు, టాప్ క్లాస్ రిటర్న్స్తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి
Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్ మార్క్ దాటిన ఫారెక్స్ నిల్వలు
Latest Gold-Silver Prices Today: ఒక్కసారిగా పడిపోయిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>