Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. తాజా ధరలివే..
హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.47,680 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.43,700 గా ఉంది. ఇక వెండి హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.67,300 అయింది.
![Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. తాజా ధరలివే.. Gold Silver Price Today 14 August 2021 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. తాజా ధరలివే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/10/b76a050255e0538507802eeed95a9a50_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్లో గత రెండు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఆగస్టు 14న బంగారం ధరలో గ్రాముకు రూ.32 చొప్పున ఎగబాకింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ (ఆగస్టు 14)న రూ.45,860 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా తాజాగా రూ.46,860గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర కాస్త పెరిగింది.
భారత మార్కెట్లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధర కూడా అతి స్వల్పంగా పెరిగింది. కేవలం గ్రాముకు రూ.0.20 పైసలు పెరిగి.. కేజీ వెండికి రూ.200 వరకూ వ్యత్యాసం ఏర్పడింది. తాజాగా భారత్లో కిలో వెండి ధర రూ.62,500 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.67,300 ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 14న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రా, తెలంగాణలో పసిడి, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.47,680 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.43,700 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.67,300గా పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 14న రూ.43,700 కు పెరిగింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.47,680గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.67,300గా ఉంది. ఇక విశాఖపట్నం బంగారం మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,700 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,680గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.67,300 పలుకుతోంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 14న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,680ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,860గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,950 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,950గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 14న కాస్త పెరిగింది. గ్రాముకు రూ.12 వరకూ పెరిగింది. దీంతో తాజా ధర.. రూ.2,420గా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,200 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అలాగే ఉంది.
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)