అన్వేషించండి

Chief Election Commissioner: భారత ఎన్నికల సారథిగా జ్ఞానేష్ కుమార్‌, ఈసీగా వివేక్ జోషి నియామకం - గెజిట్ నోటిఫికేషన్లు విడుదల

Election commission Of India | భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు రెండు వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

CEC Gyanesh Kumar | న్యూఢిల్లీ: భారత్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్‌, ఎన్నికల కమిషనర్‌గా వివేక్ జోషి నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ (త్రిసభ్య కమిటీ) సోమవారం నాడు ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను  ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా, ఎన్నికల కమిషనర్‌గా జోషి పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు రెండు వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు సైతం విడుదలయ్యాయి.

కొత్త చట్టం ప్రకారం తాజాగా నియామకాలు

కొత్త చట్టం ప్రకారం నియమితులైన మొదటి CEC జ్ఞానేష్ కుమార్ కానున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషనన్ ప్రకటించే ముందు, అంటే జనవరి 26, 2029 వరకు ఆయన భారత ఎన్నికల సంఘం సారథిగా సేవలు అందించనున్నారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుుమార్ గడువు మంగళవారం ముగియనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ సీఈసీ, ఈసీ పదవులకు కొత్త వ్యక్తులను ఎంపిక చేసి రాష్ట్రపతి ముర్ముకు సిఫార్సు చేశారు. త్రిసభ్య కమిటీ సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. అనంతరం గెజిట్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. సుఖ్‌బీర్ సింగ్ సంధుతో పాటు వివేక్ జోషి మరో ఎన్నికల కమిషనర్‌గా సేవలు అందించనున్నారు.

కమిటీ సిఫార్సుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం
"ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, పదవీకాలం) చట్టం, 2023 లోని సెక్షన్ 4 ద్వారా ఈ నియామకం జరిగింది. ఫిబ్రవరి 19, 2025 నుంచి ఈ గెటిజ్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకం జరిగిందని న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


ఎవరీ జ్ఞానేష్ కుమార్..
మార్చి 2024 నుండి ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్నారు జ్ఞానేష్ కుమార్. ఆయన కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. గత ఏడాది మార్చి (2024)లో ఎన్నికల కమిషనర్‌ గా నియమితులయ్యారు. 2019లో కేంద్రం జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక హక్కులు కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంశాఖలో కశ్మీర్‌ డివిజన్‌ కు అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శిగ ఉన్నారు. 2024 జనవరిలో సహకార శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సన్నిహిత సంబంధాలు, పని గుర్తింపుతో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన 2029 జనవరి 26వ తేదీ వరకు భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే బిహార్ ఎన్నికలతో పాటు వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం అంటే అంత ఆషామాషీ కాదు.

ఈసీగా వివేక్‌ జోషి..
ఎన్నికల కమిషనర్‌గా నియమితులైన వివేక్‌ జోషి హరియాణా క్యాడర్‌కు చెందిన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Also Read: US Deportation: అమెరికాలోని భారతీయులకు బ్రహ్మాస్త్రం- ట్రంప్‌తో మాట్లాడా, అంతా సెట్ అవుతుందన్న కేఏ పాల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Telangana Weather Update: తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు- అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు 
Hari Hara Veera Mallu: పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
పవన్ 'హరిహర వీరమల్లు' టీం నుంచి బిగ్ అప్ డేట్ - ఈ డేట్ మార్క్ చేసుకోండి అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారుగా..
Uttar Pradesh Crime News: భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు
భర్త మొండెంపైనే నిద్రపోయిన భార్య- తల తీసుకెళ్లిన ప్రియుడు- మీరట్ హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు 
Embed widget