By: ABP Desam | Updated at : 11 Oct 2021 06:58 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
కొంత కాలంగా రోజూ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరింతగా పెరిగాయి. హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.108.833 అయింది. రూ.100.51 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.101.27కి చేరింది. ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.49 పైసలు పెరిగి రూ.108.02గా ఉంది. డీజిల్ ధర రూ.0.55 పైసలు పెరిగి రూ.100.98 గా ఉంది. వరంగల్లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.02 పైసలు పెరిగి.. రూ.108.21గా ఉంది. డీజిల్ ధర రూ.0.11 పైసలు పెరిగి రూ.101.15 కు చేరింది. నిజామాబాద్లోనూ ఇంధన ధరలు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.34 పైసలు పెరిగి రూ.110.05 గా ఉంది. డీజిల్ ధర రూ.0.41 పైసలు పెరిగి రూ.102.87 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
Also Read: అమెజాన్లో బడ్జెట్ 5జీ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ఫీచర్లు కూడా అదుర్స్!
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు తాజాగా కాస్త ఎక్కువగానే పెరిగాయి. ప్రస్తుతం రూ.110.39 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.8 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.13 పైసలు పెరిగి రూ.102.74కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.110.24గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.54 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.102.57గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.36 పైసలు పెరిగి.. రూ.110.60 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.102.91గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.39 పైసలు పెరిగింది.
Also Read: Reliance: చైనా అధీనంలోని కంపెనీని కొన్న రిలయన్స్
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 11 నాటి ధరల ప్రకారం 80.18 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Chocolates in AC Coaches: తొలిసారి ఏసీ కోచ్లలో చాక్లెట్లు తరలింపు.. ఎన్ని టన్నులో తెలుసా?
Santro Stopped: ఆ బడ్జెట్ కారును ఆపేసిన హ్యుండాయ్ - ఉత్పత్తి నిలిపివేసిన కంపెనీ!
28 Per Cent GST: ఆ సేవలపై 28% జీఎస్టీ! ఇక ఆ సేవలు ఖరీదే
Cryptocurrency Prices Today: నష్టాల్లో బిట్కాయిన్.. ఎంత నష్టపోయిందంటే?
Stock Market News: ఆరంభంలో అదుర్స్! ఎండింగ్లో ఒడుదొడుకులు - సెన్సెక్స్, నిఫ్టీ డౌన్!
Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా
Bojjala Brother Dies: మాజీ మంత్రి బొజ్జల కర్మక్రియల రోజే మరో విషాదం - ఆయన సోదరుడు కన్నుమూత
LSG vs KKR: తొలి వికెట్కు 210*! ఐపీఎల్ చరిత్రలో తొలిసారి 20 ఓవర్లు ఆడేసిన రాహుల్, డికాక్
IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
Liquor Price Telangana: మందుబాబులకు తెలంగాణ సర్కారు భారీ షాక్ - ఓ రేంజ్లో పెరిగిన బీర్లు, మద్యం ధరలు