అన్వేషించండి

Aadhar: ప్రైవేట్ పార్టీలు కూడా ఆధార్‌ ఉపయోగించుకోవచ్చు, నిబంధనలలో మార్పులు!

వచ్చే నెల 5వ తేదీలోగా సూచనలు పంపాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది.

Aadhar Authentication: కేంద్ర ప్రభుత్వంలోనైనా, రాష్ట్ర ప్రభుత్వంలోనైనా ఏదైనా ప్రభుత్వ పథకం ఒక వ్యక్తికి అందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి. ఇప్పుడు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ సంస్థలు (Non Government Organisations) కూడా వ్యక్తుల ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చన్నట్లుగా నిబంధనలు మారబోతున్నాయి.

సలహాల కోసం ప్రకటన జారీ
ప్రమాణీకరణ (Authentication) కోసం ప్రైవేటు సంస్థలు ఆధార్‌ను ఉపయోగించుకనే నియమాలకు తుది రూపునిచ్చే పనిలో ఉంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రతిపాదనపై సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది. వచ్చే నెల 5వ తేదీలోగా సూచనలు పంపాలని సంబంధిత వర్గాలకు విజ్ఞప్తి చేసింది. 

ప్రస్తుతం ఆధార్ అథెంటికేషన్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఉపయోగిస్తుండగా, నిబంధనల మార్పు తర్వాత ప్రైవేట్ సంస్థలు కూడా ఆధార్‌ను ప్రామాణీకరణ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ఆధార్‌ ప్రామాణీకరణ కోసం ప్రైవేట్‌ సంస్థలను కూడా అనుమతించడం వల్ల ప్రజల జీవనం సులభతరం అవుతుందన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. దేశంలోని ప్రతి వ్యక్తికి సేవలు అందుబాటులోకి రావాలని, ప్రజల జీవితం బాగుండాలనేది ఈ నిర్ణయం వెనుకున్న లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆధార్ ప్రామాణీకరణను ఉపయోగించాలనుకునే అన్ని ప్రభుత్వేతర సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఈ ముసాయిదాను పంపింది. దీనిపై వారి నుంచి సూచనలు కోరింది. సంబంధిత వర్గాలు తమ సలహాలు, సూచనలను తిరిగి సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖకు పంపుతాయి.

సామాన్య ప్రజలు కూడా సలహా ఇవ్వవచ్చు
ఆధార్‌ ప్రామాణీకరణ నిబంధనల్లో ప్రతిపాదిత మార్పులను కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ప్రభుత్వేతర సంస్థలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఈ విషయంలో సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. అన్ని వర్గాల నుంచి 2023 మే 5వ తేదీ వరకు అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఆ సలహాలు, సూచనలు ఆధారంగా ప్రతిపాదిత ముసాయిదాలో మార్పులు చేసి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు (UDAI) పంపుతారు.

కేవలం రూ. 50 కే PVC ఆధార్ కార్డు పొందండి
ఒకవేళ మీ కార్డ్‌ కనిపించకుండా పోతే PVC ఆధార్‌ కార్డ్‌ను తెప్పించుకోవచ్చు. ఆధార్ జారీ చేసే సంస్థ ఉడాయ్‌ (UIDAI), PVC ఆధార్‌ కార్డ్‌ను ప్రజలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడానికి (PVC Aadhaar Card Online Order) అనుమతిస్తుంది. UIDAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ కార్డ్‌ను ఆర్డర్ చేయవచ్చు. పాలీవినైల్ క్లోరైడ్ కార్డ్‌, అంటే PVC ఆధార్ కార్డును (PVC Aadhaar Card Order Online Fees) కేవలం రూ. 50 చెల్లించి పొందవచ్చు. ఈ కార్డ్‌లో సురక్షితమైన QR కోడ్, హోలోగ్రామ్, పేరు, ఫోటో, పుట్టిన తేదీ మొదలైన సమాచారం నమోదై ఉంటాయి. 

PVC ఆధార్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా https://uidai.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఆ తర్వాత, హోమ్‌ పేజీలో కనిపించే My Aadhaar ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఇందులో Order Aadhaar PVC Card మీద క్లిక్ చేయండి.
ఇక్కడ మీరు 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీరు 16 అంకెల వర్చువల్ ఐడీని కూడా ఇవ్వవచ్చు. దీని తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చా ఎంటర్ చేయండి.
ఇప్పుడు, ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
OTPని సంబంధిత గడిలో పూరించి సబ్మిట్‌ చేయండి
ఆ తర్వాత, PVC ఆధార్ కార్డ్ ప్రివ్యూ మీకు కనిపిస్తుంది.
దీని తర్వాత మీరు రూ. 50 రుసుము చెల్లించాలి.
నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఈ చెల్లింపు చేయవచ్చు.
డబ్బులు చెల్లించిన తర్వాత, మీ PVC కార్డ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి చిరునామాకు వస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget