అన్వేషించండి

Pension Scheme: NPSలో భారీ మార్పులకు సర్వం సిద్ధం!, మీకు ఎంత పెన్షన్‌ వస్తుందంటే?

Guaranteed Pension Scheme: పింఛను విషయంలో పాత విధానాన్నే మళ్లీ అమలు చేయాలన్న డిమాండ్‌ దేశంలోని చాలా ప్రాంతాల నుంచి వినిపిస్తోంది.

Old Pension Scheme: ఈ మధ్య కాలంలో కొన్ని రాష్ట్రాలు 'పాత పెన్షన్ విధానం' తిరిగి అమలు చేయడంతో 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' ‍‌(National Pension System) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. 'ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌'ను తిరిగి అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, పాత పెన్షన్ విధానం (OPS) వెనక్కు తీసుకురాకుండా, జాతీయ పింఛను విధానాన్నే (NPS) మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం, వివిధ రాష్ట్రాలు, దేశాల్లో ప్రస్తుతం అమలవుతున్న పింఛను విధానాలను ఇప్పటికే పరిశీలించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చివరి జీతంలో కనీసం సగం మొత్తాన్ని (50 శాతానికి తగ్గకుండా) పెన్షన్‌గా ఇవ్వాలని భారత ప్రభుత్వం అతి త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని ఊహిస్తున్నారు. ఇటీవల, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) కూడా దీనిపై మాట్లాడారు. అంతేకాదు, 2023 మార్చిలోనే, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఈ ఏడాది మే నెలలో కేంద్ర ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేసింది. NPSను ఆకర్షణీయంగా మార్చడానికి కొన్ని సిఫార్సులు చేసింది.

పాత పింఛను విధానం అమలు చేయరు!
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ ప్రకారం.. జీతానికి, పెన్షన్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా, పాత పెన్షన్‌ "తరహా" విధానాన్ని తిరిగి తీసుకురాబోతోంది. OPS కింద, ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత, తమ చివరి జీతంలో సగం మొత్తాన్ని పెన్షన్‌గా పొందుతారు. NPSలో, ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) నుంచి 10 శాతం కట్‌ అవుతుంది. ప్రభుత్వం కూడా 14 శాతం డబ్బు కాంట్రిబ్యూట్‌ చేస్తుంది. వీటన్నింటినీ మిక్స్‌ చేసి, NPSలోనే OPS లాంటి ప్రయోజనాలను అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

కార్పొరేట్ రిటైర్‌మెంట్ బెనిఫిట్ ఫండ్‌పైనా పరిశీలన
దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను తిరిగి ప్రారంభించడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళనగా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్‌ చేసింది. OPS డిమాండ్లను తగ్గించడానికి, NPS కింద, 25 నుంచి 30 సంవత్సరాలు పని చేసిన ఉద్యోగులకు గ్యారెంటీగా 50 శాతం జీతాన్ని పెన్షన్‌గా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించొచ్చు. ఇది కాకుండా, కార్పొరేట్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదనను కూడా కేంద్రం పరిశీలిస్తోంది. ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనాలను పొందే సంస్థలు ఈ ఫండ్‌ను నిర్వహిస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌ పెన్షన్ మోడల్
సోమనాథన్ కమిటీ, ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పెన్షన్ వ్యవస్థలను అధ్యయనం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, వైఎస్‌ జగన్‌ హయాంలో ప్రతిపాదించిన 'గ్యారెంటీడ్‌ పెన్షన్ స్కీమ్‌'ను (GPS) కేంద్ర ప్రభుత్వంలోనూ అమలు చేస్తే ఉద్యోగులు OPS డిమాండ్‌ను మర్చిపోతారని సూచించింది. పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రారంభించడానికి మోదీ ప్రభుత్వం మొగ్గు చూపడం లేదు కాబట్టి, NPSలోనే మార్పులు చేసి ప్రకటించే ఛాన్స్‌ ఉంది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో వేడి పెంచిన పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
Mrunal Thakur’s Pilgrimage Tour: ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
Atal Pension Yojana: ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
Embed widget