అన్వేషించండి

Stock Market News: ఇన్వెస్టర్ల మూడ్‌ ఐటీ నుంచి బ్యాంకుల వైపు మారుతోంది, గమనించారా?

2022లో ఇప్పటివరకు (YTD) నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 28 శాతం క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ 16 శాతం లాభపడింది, గురువారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది.

Stock Market News: స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల మూడ్‌, ట్రెండ్‌ మారుతోంది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో ఉంది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. క్యాపిటల్‌ గూడ్స్‌, ఆటో, ఆటో అనుబంధ రంగాలు, పెయింట్స్‌, స్టీల్‌, అల్యూమినియం నుంచి ప్రతి సెక్టార్‌కూ పని పెరుగుతోంది. ఆయా కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. ఇందుకోసం అవసరమయ్యే డబ్బుల కోసం ఆయా పరిశ్రమలన్నీ బ్యాంకుల గడప తొక్కాల్సిందే. అంటే, ఈ పరిస్థితి నుంచి ఫైనల్‌గా లాభపడేది బ్యాంకులే. వివిధ పరిశ్రమలకు బ్యాంకులు అప్పులిచ్చి వాటి వ్యాపారాన్ని, ఆదాయాన్ని పెంచుకుంటున్నాయి. గత త్రైమాసికాలుగా బ్యాంకింగ్‌ ఫలితాలను గమనిస్తే, ఎప్పటికప్పుడు నంబర్లలో మంచి వృద్ధి కనిపిస్తోంది. దీనిని బట్టి, దేశ ఆర్థిక వృద్ధి నుంచి బ్యాంకులు బాగా లాభపడుతున్నాయని అర్ధం చేసుకోవచ్చు.

వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేసే సంపన్న పెట్టుబడిదారుల నుంచి వేల రూపాయల్లో మాత్రమే వెచ్చించగల రిటైల్‌ ఇన్వెస్టర్ల వరకు ఈ పరిస్థితిని ఒంట బట్టించుకుంటున్నారు. పెట్టుబడుల విషయంలో బ్యాంకుల వైపు మారిపోతున్నారు.

ఇంకో విషయం ఏంటంటే, పేలవమైన ప్రదర్శన చేస్తున్న ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (IT) కౌంటర్ల నుంచి ఇన్వెస్టర్లు బయటకు వచ్చేస్తున్నారు. ఇలా బయటకు తెచ్చే డబ్బులను బ్యాంకింగ్ స్టాక్స్‌ మీద బెట్స్‌గా మారుస్తున్నారు. 

మాద్యం భయంతో అమెరికన్‌ నాస్‌డాక్‌ ఇటీవల విపరీతంగా పతనమవుతోంది. దానికి తగ్గట్లే మన ఐటీ రంగం స్టెప్పులు వేస్తోంది. అందువల్ల, మన భారత ఐటీ కంపెనీల మార్జిన్లు ఒత్తిడికి గురవుతాయని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్‌లు భావిస్తున్నారు. ఐటీ స్టాక్స్‌ డీ రేటింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని చెబుతూ, వాటి మీద వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నారు. 

ఐటీ డౌన్-బ్యాంక్‌ అప్‌
2022లో ఇప్పటివరకు (YTD) నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 28 శాతం క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ 16 శాతం లాభపడింది, గురువారం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. ఇదే కాలంలో నిఫ్టీ50 ఇండెక్స్‌ 3 శాతం పెరిగింది, రికార్డు గరిష్ట స్థాయికి దాదాపు 4 శాతం దూరంలో ఉంది.

కరోనా సమయం నాటి చేదు అనుభవాల కారణంగా గత 2-3 సంవత్సరాలు చెత్త పనితీరులో ఉన్న బ్యాంకింగ్ రంగం ఇప్పుడు మంచి స్థానంలో ఉంది, ఇన్వెస్టర్ల ఆసక్తిని ఆకర్షిస్తోంది. పటిష్టమైన ఆదాయాల వృద్ధి, క్రెడిట్ వృద్ధిని పెంచుకోవడం, సమంజసమైన విలువలతో పాటు ఆస్తుల నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటివి ఈ రంగానికి సహాయపడుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Motilal Oswal Financial Services) చెబుతోంది. అమెరికన్‌ మాంద్య భయం, నిరంతర వడ్డీ రేట్ల పెంపుపై ఆందోళనలు IT రంగంలో సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయని వివరించింది.

2021లో రివర్స్‌ సీన్‌
2021లో (కరోనా ఫస్ట్‌ వేవ్‌ అనుభవంతో ప్రపంచమంతా డిజిటలైజేషన్‌ వైపు మారుతున్న సమయం) నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 60 శాతం పెరగ్గా, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 13 శాతం మాత్రమే లాభపడింది. నిఫ్టీ50 ఇండె‌క్స్‌ 24 శాతం ఎగసింది.

ఐటీ రంగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 26 శాతం క్షీణించాయి, ₹6.90 లక్షల కోట్ల నుంచి ₹5.11 లక్షల కోట్లకు దిగి వచ్చాయి. దీనికి విరుద్ధంగా, ఇదే కాలంలో ఆర్థిక సేవల రంగంలో వాళ్ల ఆస్తులు 11 శాతం పెరిగి రూ.15.19 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇన్వెస్టర్ల మూడ్‌ మారిందనడానికి ఇదే సులభమైన ఉదాహరణ.

టాప్‌-5 లూజర్స్‌, గెయినర్స్‌
2022లో ఇప్పటివరకు టాప్ -5 ఐటీ స్టాక్స్‌- టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్ర - 16-42 శాతం వరకు కింద పడ్డాయి. ఇదే కాలంలో టాప్ - 5 బ్యాంక్‌ స్టాక్స్‌ 3-24 శాతం లాభపడ్డాయి. ట్రెండ్‌ మారిందనడానికి ఇది మరో ఉదాహరణ.

ప్రస్తుతానికి ఐటీ రంగ స్టాక్స్‌ వెనుకబడినా, భవిష్యత్తులో మళ్లీ పుంజుకోవచ్చు. దీనికి 24 నుంచి 30 నెలల వరకు పట్టవచ్చని బ్రోకింగ్‌ హౌస్‌ షేర్‌ఖాన్‌ షేర్‌ చేసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
Vaibhav Sooryavanshi News: ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
ఏషియన్ గేమ్స్ ప్రాబబుల్స్ లిస్టులో వైభవ్ సూర్యవంశీ: సూర్య, గిల్‌కు దక్కని చోటు.. 
Embed widget