అన్వేషించండి

Women Entrepreneur: థింక్‌ డిఫరెంట్‌- ఇదే నేటి మహిళ ఆలోచన

ఈ మధ్య చాలా మంది వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకరి కింద పని చేయకూడదనే ఉద్దేశంతోపాటు తమ కాళ్ల మీద తాము నిలబడాలనే తపన కూడా ఉంది.

ఒకప్పుడు మహిళలు వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారు. కానీ కాలానుగుణంగా కొద్ది కొద్దిగా ఈ పరిస్థితి మెరుగు పడుతూ వస్తోంది. పూర్తిగా చదువులేని స్థితి నుంచి చదువుకోవడం, ఉన్నత చదువులకు వెళ్లడం, ఆపై మెల్లిగా ఉద్యోగాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం తమంతట తాము సొంతంగా వ్యాపారాలు కూడా పెడ్తున్నారు. పెద్ద పెద్ద కొలువుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అందులోనూ ఒకరి కింద పని చేయకూడదనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు వ్యాపారం వైపే మొగ్గు చూపుతున్నారు. 2021, 2022 నుంచి వ్యాపారం చేసే మహిళల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని లింక్డ్ ఇన్ చెప్తోంది. ఇందుకు సంబంధించిన డాటాను కూడా రివీల్ చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను బుధవారం విడుదల చేసింది. 

రెండేళ్ల నుంచి పెరుగుతున్న మహిళా వ్యాపారులు..

గత రెండేళ్లుగా అంటే 2020, 21, 22లో మహిళా వ్యవస్థాపక వృద్ధి రేటు అత్యధికంగా ఉందని లింక్డ్ ఇన్ ఇచ్చిన నివేదిక ద్వారా తెలుస్తోంది. 2016తో పోలిస్తే 20.68 శాతం ఈ వాటా పెరిగినట్లు అర్థం అవుతోంది. అలాగే పురుష వ్యవస్థాపకు వాటాతో పోలిస్తే ఇది దాదాపు 1.79 రెట్లు ఎక్కువగా ఉంది. 2022 వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన లింగ సమానత్వం, లింగ అవాంతరాల నివేదికలో ఉన్న డేటాను బట్టి ఈ వివరాలను తెలిపారు. మన దేశ నాయకత్వంలో మహిళలకు అసమానమైన ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ... పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు వ్యాపార రంగం వైపే మొగ్గు చూపుతున్నారు. 

2020 నుంచి మహిళా వ్యాపారులు పెరుగుతున్నప్పటికీ.. 2021లో ఈ రేటు అత్యధికంగా ఉందని లింక్డ్ ఇన్ నివేదిక వివరిస్తోంది. ఇది చెప్పుకోదగ్గ విషయమే అయినప్పటికీ మరో బాధాకరమైన విషయాన్ని కూడా ఈ నివేదిక చెప్తోంది. పురుషులతో పోలిస్తే అంతర్గతంగా మహిళలకు నాయకత్వం ఇవ్వడం లేదని తెలుస్తోంది. మహిళల కంటే పురుషుల్లో నాయకత్వ స్థానాల్లో పదోన్నతి పొందే అవకాశం 42 శాతం ఉందని నివేదిక వెల్లడిస్తోంది.

అందుకే మహిళలు వ్యాపారం వైపు..!

 అలాగే పని ప్రదేశాల్లో మహిళలు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారని.. లింక్డ్ ఇన్ లోని ఇండియా టాలెంట్ అండ్ లర్నింగ్ సొల్యూషన్స్ సీనియర్ డైరెక్టర్ రుచీ ఆనంద్ తెలిపారు. అందువల్లే మహిళలు ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పారు. వ్యాపారం చేస్తున్న మహిళలు.. ఎక్కువగా సాటి ఆడవాళ్లకు పని ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తున్నారని కూడా రుచీ ఆనంద్ వివరించారు. ఎనిమిది ఏళ్ల డాటాను పరిశీలిస్తూ వస్తే.. గతంలో కంటే కూడా నాయకత్వ స్థానాల్లో మహిళలను ఎక్కువగా నియమించుకుంటున్నారని చెప్పారు.

2015లో నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళల సంఖ్య 1.36గా ఉంటే ఈ ఏడు 24 శాతానికి చేరిందని వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే మహిళల సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఉన్నత స్థానాల్లో, నాయకత్వం వహించే స్థానాల్లో కూడా మహిళలు ఉంటారని రుచీ ఆనంద్ స్పష్టం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Delhi Blast Case Update: సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
Advertisement

వీడియోలు

Hombale Films to Buy RCB ? | RCB ఓనర్లుగా హోంబలే ఫిల్మ్స్ ?
Pujara on South Africa vs India Test Match | ప్లేయర్స్ కు సలహా ఇచ్చిన పుజారా
India vs South Africa First Test Match | భారత్ ఓటమికి కారణాలివే
Shubman Gill Injury India vs South Africa | పంత్ సారధ్యంలో రెండో టెస్ట్ ?
విశ్వం మూలం వారణాసి నగరమే! అందుకే డైరెక్టర్ల డ్రీమ్ ప్రాజెక్ట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hasina death sentence: మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష- బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ సంచలన తీర్పు
Nitish Kumar To Take Oath As Bihar CM: బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా.. నవంబర్ 20న గాంధీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Telangana MLAs Disqualification: తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. స్పీకర్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం, 4 వారాలు గడువు
Delhi Blast Case Update: సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
సిసిటీవీలో 2 ఫోన్లు, పేలుడు తరువాత మాయం! ఢిల్లీ పేలుడు సీక్రెట్ తెలిపే ఆధారాలివే
Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
మెగా ఫ్యామిలీ నుంచి మరో గుడ్ న్యూస్ - పెళ్లిపై సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ అనౌన్స్‌మెంట్
Kia Syros తో 9000 కిలోమీటర్లు జర్నీ: కంఫర్ట్‌, స్పేస్‌, పెర్ఫార్మెన్స్‌పై పూర్తి అనుభవం
Kia Syros లాంగ్ టర్మ్ రివ్యూ: 9000 km డ్రైవింగ్‌లో ఏం తేలింది?
Bison OTT : ఓటీటీలోకి విక్రమ్ కుమారుడి 'బైసన్' మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి విక్రమ్ కుమారుడి 'బైసన్' మూవీ - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Varanasi : 'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
'వారణాసి' ఈ పేరెలా వచ్చింది? అక్కడ ప్రత్యేకతలు , వింతలు ఏంటి? రాజమౌళి - మహేష్ సినిమాకు ఈ టైటిల్ ఎందుకు?
Embed widget