అన్వేషించండి

KTR on IT Industry: దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20% మంది హైదరాబాద్‌లోనే - కేటీఆర్‌

KTR on IT Industry: హైదరాబాద్: దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాత మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని తెలంగాణ మంత్రి కే తారక రామారావ్‌ అన్నారు.

KTR on IT Industry:

హైదరాబాద్: దేశంలోని ఐటీ  ఉద్యోగుల్లో 20 శాత మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారని తెలంగాణ మంత్రి కే తారక రామారావ్‌ అన్నారు. ఇది తెలంగాణకే గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని 2014 లోనే చెప్పామని గుర్తు చేశారు. ఎనిమిదేళ్లుగా పరిశ్రమ అభివృద్ధి పాటు పడుతున్నామని వివరించారు.

'తొలినాళ్ల లోనే ఐటీ పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడంపై దృష్టి సారించాం. అందుకే ప్రణాళికాబద్దంగా హైదరాదులో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేశాం. శాంతి భద్రతల బలోపేతంతో  పాటు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను మరింత అభివృద్ధి చేశాం. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేశాం. ఆపై హైదరాబాద్ ఇన్నోవేషన్ ఈకో సిస్టంలో అనేక మార్పులు వచ్చాయి' అని కేటీఆర్‌ అన్నారు.

'మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్ ని ఏర్పాటు చేశాం. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ని ఏర్పాటు చేశాం. తెలంగాణ లో ప్రత్యేకంగా శానిటేషన్ హబ్ కూడా ఏర్పాటు చేశాము. త్వరలో దేశం లోనే అతి పెద్ద ప్రోటో టైప్ సెంటర్ టి వర్క్స్ ప్రారంభం చేయబోతున్నాం. దేశానికే గర్వకారణమైన అంతరిక్ష పరిశోధనలలో పని చేస్తున్న స్కైరూట్, ధ్రువ వంటి స్టార్ట్ అప్ లు భాగ్యనగరం నుంచే మొదలయ్యాయి. విజయవంతంగా వృద్ది పదంలో దూసుకెళ్తున్నాయి' అని కేటీఆర్‌ తెలిపారు.

హైదరాబాదులో ఇన్నోవేషన్ సిస్టం బలంగా ఉందని కేటీఆర్‌ అన్నారు. త్వరలో మరిన్ని అంకుర సంస్థలు విజయం సాధిస్తాయన్న నమ్మకం ఉందన్నారు. తొలిసారి ఐటీ ఉద్యోగాల్లో బెంగళూరును హైదరాబాద్‌ దాటేసిందని పేర్కొన్నారు. ఈ ఘనత తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఆఫీస్ స్పేస్  వినియోగంలో బెంగళూరును అనేకసార్లు అధిగమించినా ఎక్కువ ఉద్యోగాలు కల్పించినందుకే తనకు గర్వంగా అనిపించిందన్నారు.

'ఎనిమిదేళ్ల క్రితం ఆరంభించిన టాస్క్ (TASK)తో ఏడు లక్షల మందికి పైగా యువకులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ అందించాం. ఐటీ రంగంలోనే కాకుండా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ ఈ శిక్షణ కొనసాగింది. రాష్ట్రం లోని పది లక్షల గృహాలకు ఇంటర్నెట్ అందించే టి- ఫైబర్ ఈ ఏడాది పూర్తవుతుంది. నగరంలో3000 కు పైగా హాట్‌స్పాట్‌ల మాదిరిగా వైఫై విజయవంతం అయింది. సమాజ హితం కోసం పనికి రాని సాంకేతిక పరిజ్ఞానం వృథా అనే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన మేరకు పని చేస్తున్నాము.' అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

పౌరులకు సేవలు అందించే విషయంలో దేశం లోనే తెలంగాణ మీ-సేవా అత్యుత్తమం అని కేటీఆర్‌ అన్నారు. పెన్షన్లు, డ్రైవింగ్ లైసెన్సుల రెన్యువల్‌, ఈ -ఓటింగ్ వంటి అనేక ప్రభుత్వ సేవలలో పెద్ద ఎత్తున నూతన టెక్నాలజీ లను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలో మౌలిక వసతులతో పాటు సోషల్ ఇన్ఫ్రా బాగా బలోపేతమైందని అన్నారు. ఎనిమిదేళ్లలో ఒక నగరంలో అత్యధికంగా మౌలిక వసతులు కల్పించిన నగరంగా హైదరాబాద్ దేశం లోనే మొదటి స్థానంలో  ఉంటుందన్నారు.

ఎస్ఆర్డీపీ ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని కేటీఆర్‌ తెలిపారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో సంపూర్ణ మురుగు నీటి శుద్ధి వంద శాతం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి ఘనత దేశంలో మరే నగరానికి లేదన్నారు. 2050 వరకు హైదరాబాద్ నగర తాగు నీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతుల నిర్మాణం చేపట్టామన్నారు. మెట్రో తో పాటు ఎయిర్పోర్ట్ మెట్రో వంటి మరిన్ని ఇతర ప్రజా రవాణా వ్యవస్థ లను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. 

హైదరాబాద్ ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరించాలని కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ లోని ఇతర నగరాలకు విస్తరించేలా ఐటీ సంస్థలు ఆలోచించాలన్నారు.  ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పించామని, ఐటీ టవర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఆదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఆఫీసులు అందుబాటులో వస్తున్నాయని, వరంగల్ విజయవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా వచ్చే ఉద్యోగాల విషయంలో కంపెనీలు ప్రభుత్వాలతో కలిసి పని చేయాలన్నారు.

తెలంగాణ లోని బాసర ట్రిపుల్ ఐటి వంటి విద్యా సంస్థ, అక్కడున్న విద్యార్థులతో ఐటి కంపెనీలు పని చేయాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ అభివృద్ధి చేయాలో తమకు తెలుసన్నారు. ఐటీ పరిశ్రమ ఉన్న ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామన్న మాట సరి కాదన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగానే అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని, 300 కిలో మీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget