అన్వేషించండి

WFH vs WFO: హైబ్రీడ్‌ అందరికీ బెస్ట్‌! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!

WFH vs WFO: హైబ్రీడ్‌ వర్క్‌ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది.

WFH vs WFO: 

కంపెనీలేమో ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఉద్యోగులేమో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) కావాలంటున్నారు. అటు యాజమాన్యాలు ఇటు ఉద్యోగుల మధ్య ఇది ఘర్షణకు దారితీస్తోంది. అయితే హైబ్రీడ్‌ వర్క్‌ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని (Flexibility) కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌కు ఇదెంతగానో ఉపయోగపడుతోందని వెల్లడించింది. రెండు వర్గాలకూ ఇది విన్‌ విన్‌ సిచ్యువేషన్‌గా తెలిపింది.

సీల్‌ హెచ్‌ఆర్‌, ఎకనామిక్‌ టైమ్స్‌ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. వివిధ రంగాల్లోని 3800 పైగా ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వారిలో 76 శాతం మందికి పైగా ఉద్యోగులు హైబ్రీడ్‌ లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ కంపెనీలు ఆఫీసులకు రమ్మని ఒత్తిడి చేస్తే, ఫ్లెక్సిబిలిటీకి అంగీకరించకపోతే ఇతర అవకాశాలను అన్వేషిస్తామని 73 శాతం మంది కుండ బద్దలు కొట్టారు. ఇక 35 శాత మంది కార్యాలయాల్లో ఎక్కువ రోజులు పనిచేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు.

జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, గోల్డ్‌మన్‌ సాచెస్‌, మెటా, టీసీఎస్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ప్రోత్సహిస్తున్నాయి. కరోన సమయంలో విపరీతంగా క్రేజ్‌ పొందిన జూమ్‌ సైతం 50 మైళ్ల దూరంలోని ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చింది. అయితే అనుభవజ్ఞులు మాత్రం హైబ్రీడ్‌ విధానం ఇద్దరికీ మంచిదని చెబుతున్నారు. 'నూతన పని వాతావరణం, పద్దతులు, ఉద్యోగులు ఇష్టాలకు మధ్య కంపెనీలు సమతూకం తీసుకురావాలి. వేగంగా మారుతున్న ప్రపంచంలో ఉత్పత్తి పెరగాలన్నా, ప్రతిభావంతులు తమవద్దే ఉండాలంటే ఇది తప్పదు' అని సీఎల్‌ హెచ్‌ సీఈవో ఆదిత్య నారాయణ అన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత హైబ్రీడ్‌ పని విధానానికే ఉద్యోగులు ఎక్కువగా ప్రధాన్యం ఇస్తున్నారని డెలాయిట్‌ ఇండియా డైరెక్టర్ నీలేశ్‌ గుప్తా అన్నారు. 'ఇప్పుడు ఉద్యోగులు ఎంత పనిచేస్తున్నారో  కొలిచే పద్ధతులు మారిపోయాయి. ఎన్ని గంటలు పనిచేశారన్నది కాకుండా ఎంత పని చేస్తున్నారన్నదే ముఖ్యం. అందుకే పని పూర్తయ్యేంత వరకు ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. అప్పుడే వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలు బాగుంటాయని నమ్ముతున్నారు' అని ఆయన అన్నారు. ఉద్యోగుల కోసం కంపెనీలూ మారుతున్నాయి. 88 శాతం కంపెనీలు ఏదో ఒక రకంగా ఫ్లెక్సిబిలిటీని ఆఫర్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

ఐటీసీ ఆఫీసుల నుంచే పని చేయాలని ఆదేశించింది. అయితే వైట్‌కాలర్‌ ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. కొన్ని సర్వేల ఫలితాలు సమీక్షించాక డీబీఎస్‌ బ్యాంకు హైబ్రీడ్‌ పని విధానానికి ఏర్పాట్లు చేసింది. ఫ్రంట్‌లైన్‌ స్టాఫ్‌ బ్రాంచుల్లో పనిచేస్తుండగా మిగతా ఉద్యోగుల్లో 60-40 నిష్పత్తిలో హైబ్రీడ్‌ విధానంలో కొనసాగుతున్నారు. ఉద్యోగులు ఈ విధానాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని అంతర్గత సర్వేల్లో తేలింది. తమ కోసం కంపెనీ ఇలాంటి ఏర్పాటు చేయడంతో 83 శాతం మంది ఆనందంగా ఉన్నారు. ఈ విధానం అటు సమాజం, వాతావరణం, ప్రకృతి ఇటు ఉద్యోగులకూ మంచిదేనని వివిధ సర్వేలు తెలిపాయి.

Also Read: ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేయొచ్చా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?

వీడియోలు

Medaram Jathara Pagididda Raju History | పడిగిద్ద రాజు దేవాలయం కథేంటి.? | ABP Desam
Medaram Jatara Day 1 Speciality | మేడారం జాతర మొదటి రోజు ప్రత్యేకత ఇదే | ABP Desam
MI vs DC WPL 2026 | ముంబై ఢిల్లీ విజయం
Rohit, Virat BCCI Contracts Changes | విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్?
Ishan Kishan Ind vs NZ T20 | ఇషాన్ కిషన్ పై సూర్య సంచలన ప్రకటన

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
మేడారంలో భక్తులకు హెలికాప్టర్‌ సేవలు, 7 నిముషాలు ఏరియల్‌ వ్యూ చూసేందుకు ఛార్జీ ఎంతో తెలుసా?
Disqualification of YSRCP MLAs: వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హతకు స్పీకర్ రోడ్ మ్యాప్ - జగన్ ఎలా కాపాడుకుంటారు?
Kamareddy Crime News:కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
కామారెడ్డిలో మూగ జీవాలపై ఘాతుకం- కోతులకు విషం! 15 వానరాలు మృతి!
Gold Investment: లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
లక్షా యాభై వేలు దాటిన 10 గ్రాముల బంగారం!ఇప్పుడు బంగారం కొనడం మంచిదేనా?
Nandyala Crime News:నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
నంద్యాలలో ఘోర ప్రమాదం- ట్రావెల్ బస్‌ టైరు పేలి అంటుకున్న మంటలు- ముగ్గురు మృతి
Mana Shankara Vara Prasad Garu BO Day 10: బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
బాక్సాఫీస్‌లో వరప్రసాద్ గారు కుమ్ముడు... పది రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ అదిరిందిగా
Guntur Crime News: గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
గుంటూరులో దారుణం! ప్రియుడి కోసం భర్తను చంపిన ఇల్లాలు, రాత్రంతా శవం పక్కన పోర్న్‌ వీడియోలు చూస్తూ కాలక్షేపం
Rithu Chowdhary Marriage : రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
రిలేషన్ షిప్ ఓ టార్చర్ - సీక్రెట్ మ్యారేజ్‌పై రీతూ చౌదరి రియాక్షన్... బిగ్ బాస్ తర్వాత ఒంటరిగానేనా...
Embed widget