అన్వేషించండి

బిహార్‌ ఎన్నికల ఎగ్జిట్‌ పోల్‌ 2025

(Source:  Poll of Polls)

WFH vs WFO: హైబ్రీడ్‌ అందరికీ బెస్ట్‌! పూర్తిగా ఆఫీసులకు వద్దంటున్న నిపుణులు!

WFH vs WFO: హైబ్రీడ్‌ వర్క్‌ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది.

WFH vs WFO: 

కంపెనీలేమో ఆఫీసులకు రమ్మంటున్నాయి. ఉద్యోగులేమో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) కావాలంటున్నారు. అటు యాజమాన్యాలు ఇటు ఉద్యోగుల మధ్య ఇది ఘర్షణకు దారితీస్తోంది. అయితే హైబ్రీడ్‌ వర్క్‌ కల్చర్‌ను కొనసాగించడమే మంచిదని విశ్లేషకులు అంటున్నారు. ఎక్కువ శాతం మంది ఫ్లెక్సిబిలిటీని (Flexibility) కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేలింది. వర్క్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌కు ఇదెంతగానో ఉపయోగపడుతోందని వెల్లడించింది. రెండు వర్గాలకూ ఇది విన్‌ విన్‌ సిచ్యువేషన్‌గా తెలిపింది.

సీల్‌ హెచ్‌ఆర్‌, ఎకనామిక్‌ టైమ్స్‌ సంయుక్తంగా ఓ సర్వే నిర్వహించాయి. వివిధ రంగాల్లోని 3800 పైగా ఉద్యోగులు ఇందులో పాల్గొన్నారు. వారిలో 76 శాతం మందికి పైగా ఉద్యోగులు హైబ్రీడ్‌ లేదా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ కంపెనీలు ఆఫీసులకు రమ్మని ఒత్తిడి చేస్తే, ఫ్లెక్సిబిలిటీకి అంగీకరించకపోతే ఇతర అవకాశాలను అన్వేషిస్తామని 73 శాతం మంది కుండ బద్దలు కొట్టారు. ఇక 35 శాత మంది కార్యాలయాల్లో ఎక్కువ రోజులు పనిచేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు.

జేపీ మోర్గాన్‌ ఛేజ్‌, గోల్డ్‌మన్‌ సాచెస్‌, మెటా, టీసీఎస్‌ వంటి కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ప్రోత్సహిస్తున్నాయి. కరోన సమయంలో విపరీతంగా క్రేజ్‌ పొందిన జూమ్‌ సైతం 50 మైళ్ల దూరంలోని ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఆఫీసులకు రావాలని పిలుపునిచ్చింది. అయితే అనుభవజ్ఞులు మాత్రం హైబ్రీడ్‌ విధానం ఇద్దరికీ మంచిదని చెబుతున్నారు. 'నూతన పని వాతావరణం, పద్దతులు, ఉద్యోగులు ఇష్టాలకు మధ్య కంపెనీలు సమతూకం తీసుకురావాలి. వేగంగా మారుతున్న ప్రపంచంలో ఉత్పత్తి పెరగాలన్నా, ప్రతిభావంతులు తమవద్దే ఉండాలంటే ఇది తప్పదు' అని సీఎల్‌ హెచ్‌ సీఈవో ఆదిత్య నారాయణ అన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత హైబ్రీడ్‌ పని విధానానికే ఉద్యోగులు ఎక్కువగా ప్రధాన్యం ఇస్తున్నారని డెలాయిట్‌ ఇండియా డైరెక్టర్ నీలేశ్‌ గుప్తా అన్నారు. 'ఇప్పుడు ఉద్యోగులు ఎంత పనిచేస్తున్నారో  కొలిచే పద్ధతులు మారిపోయాయి. ఎన్ని గంటలు పనిచేశారన్నది కాకుండా ఎంత పని చేస్తున్నారన్నదే ముఖ్యం. అందుకే పని పూర్తయ్యేంత వరకు ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. అప్పుడే వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలు బాగుంటాయని నమ్ముతున్నారు' అని ఆయన అన్నారు. ఉద్యోగుల కోసం కంపెనీలూ మారుతున్నాయి. 88 శాతం కంపెనీలు ఏదో ఒక రకంగా ఫ్లెక్సిబిలిటీని ఆఫర్‌ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

ఐటీసీ ఆఫీసుల నుంచే పని చేయాలని ఆదేశించింది. అయితే వైట్‌కాలర్‌ ఉద్యోగులు వారానికి రెండు రోజులు ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతిస్తోంది. కొన్ని సర్వేల ఫలితాలు సమీక్షించాక డీబీఎస్‌ బ్యాంకు హైబ్రీడ్‌ పని విధానానికి ఏర్పాట్లు చేసింది. ఫ్రంట్‌లైన్‌ స్టాఫ్‌ బ్రాంచుల్లో పనిచేస్తుండగా మిగతా ఉద్యోగుల్లో 60-40 నిష్పత్తిలో హైబ్రీడ్‌ విధానంలో కొనసాగుతున్నారు. ఉద్యోగులు ఈ విధానాన్ని ఎంతగానో ఇష్టపడుతున్నారని అంతర్గత సర్వేల్లో తేలింది. తమ కోసం కంపెనీ ఇలాంటి ఏర్పాటు చేయడంతో 83 శాతం మంది ఆనందంగా ఉన్నారు. ఈ విధానం అటు సమాజం, వాతావరణం, ప్రకృతి ఇటు ఉద్యోగులకూ మంచిదేనని వివిధ సర్వేలు తెలిపాయి.

Also Read: ఆధార్‌తో బ్యాంక్‌ అకౌంట్‌ హ్యాక్‌ చేయొచ్చా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
Gopi Galla Goa Trip: నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
Advertisement

వీడియోలు

PM Modi First Reaction on Delhi Blast | ఢిల్లీ బ్లాస్ట్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్
Drone in Jubilee Hills Bypoll | ఎన్నికల్లో ఇదే మొదటిసారి డ్రోన్ ప్రయోగం
White Collar Terror Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
White Collar Terror Attack Delhi Car Blast | దేశంలో నాలుగు ఘటనలు..నాలుగు చోట్లా వైద్యులే..భారీ కుట్రకు ప్లాన్ చేస్తోంది ఎవరు.?
Jubilee Hills Polling Updates | పోలింగ్ బూత్ ల వద్ద ప్రధాన పార్టీల ప్రలోభాల గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bihar News: బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
బిహార్‌లో ఎగ్జిట్‌ ఫలితాలతోనే కాంగ్రెస్‌కు షాక్‌- పార్టీకి రాజీనామా చేసిన షకీల్‌ అహ్మద్‌
Delhi Blasts Case: షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
షషీనా బయటకు ప్రాణాలు పోసే డాక్టర్ - కానీ లోపలి క్యారెక్టర్ మాత్రం భయంకరమైన టెర్రరిస్టు !
Ande Sri Last Rites: అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న  సీఎం
అందెశ్రీ పాడె మోసిన రేవంత్‌ రెడ్డి.. పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్న సీఎం
Gopi Galla Goa Trip: నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
నిరుద్యోగ నటులు నుంచి గోవాకు... పర్మిషన్స్ లేకుండా అవుట్‌ డోర్‌లో... సినిమా ఎలా చేశారంటే?
Surendra Koli: ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
ఉరిశిక్ష పడినా నిర్దోషిగా బయటకు వస్తున్న కోలీ - మరో సారి హాట్ టాపిక్ గా మారిన నిథారీ హత్యల కేసు
Rajasthan IAS Couple: ఇద్దరూ ఐఏఎస్‌లే - పెళ్లి చేసుకున్నారు కూడా - కానీ ఇప్పుడు వాళ్ల రచ్చ వైరల్ !
ఇద్దరూ ఐఏఎస్‌లే - పెళ్లి చేసుకున్నారు కూడా - కానీ ఇప్పుడు వాళ్ల రచ్చ వైరల్ !
PM Modi on Delhi Blast: ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక
ఢిల్లీ పేలుడు కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. ప్రధాని మోదీ హెచ్చరిక
Upcoming Cars in November: నవంబర్ 15న 5 కార్లు విడుదల కానున్నాయి! వాటి ఫీచర్స్‌, ధరలు గురించి తెలుసా?
నవంబర్ 15న 5 కార్లు విడుదల కానున్నాయి! వాటి ఫీచర్స్‌, ధరలు గురించి తెలుసా?
Embed widget