![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gold-Silver Price: బంగారం ధరలో అతి స్వల్ప పెరుగుదల.. నిలకడగా వెండి ట్రేడింగ్.. ఇవాల్టి ధరలివే..
హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,010 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,010 గా ఉంది.
![Gold-Silver Price: బంగారం ధరలో అతి స్వల్ప పెరుగుదల.. నిలకడగా వెండి ట్రేడింగ్.. ఇవాల్టి ధరలివే.. Gold Silver Price Today 16 August 2021 know rates in your city Andhra Pradesh Amaravati Telangana Hyderabad Gold-Silver Price: బంగారం ధరలో అతి స్వల్ప పెరుగుదల.. నిలకడగా వెండి ట్రేడింగ్.. ఇవాల్టి ధరలివే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/02/dae523874ef3a59ef9b3dda373b2e518_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్లో సోమవారం నాడు (ఆగస్టు 16) పసిడి ధర అత్యంత స్వల్పంగా పెరిగింది. ఆగస్టు 16న బంగారం ధరలో గ్రాముకు రూ.1 చొప్పున పెరిగింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ రూ.46,160 గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.47,160గా ఉంది. మొత్తానికి గత వారం రోజులతో పోలిస్తే బంగారం ధర కాస్త పెరిగింది.
భారత మార్కెట్లో బంగారం ధరలు పెరగ్గా వెండి ధర మాత్రం నిలకడగా ఉంది. ఏ మార్పూ లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. తాజాగా భారత్లో కిలో వెండి ధర రూ.63,200 గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర కాస్త ఎక్కువగా రూ.68,200గా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో ఆగస్టు 16న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి తాజా ధరలివీ..
హైదరాబాద్లో 24 క్యారెట్ల మేలిమి బంగారం (99.99 స్వచ్ఛత) ధర ప్రస్తుతం రూ.48,010 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6 స్వచ్ఛత) ధర రూ.44,010 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.68,200గా పలికింది.
ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ఆగస్టు 16న రూ.44,010 కు పెరిగింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,010గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.68,200గా స్థిరంగానే ఉంది. ఇక విశాఖపట్నం పసిడి మార్కెట్లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,010 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,010గా ఉంది. ఇక్కడ వెండి ధర కిలో రూ.68,200 గానే కొనసాగుతోంది.
Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు ఆగస్టు 16న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,160ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,160గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,360 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,390గా ఉంది.
ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర మాత్రం ఆగస్టు 16న స్థిరంగా ఉండిపోయింది. దీంతో ధర రూ.2,445గా ఉంది. హైదరాబాద్లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,450 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అంతే ఉంది.
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: Telangana News: వీళ్లందరికీ కేసీఆర్ శుభవార్త, ఉద్యమంలా తీసుకుపోదామని గోల్కొండ వేదికగా సీఎం వెల్లడి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)