అన్వేషించండి

CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం

AP CM Chandrababu Distributes pension at Narasaraopet | ఏపీలో జనవరి నెల పింఛన్ల పంపిణీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమందలో లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.

Chandrababu Distributes Pensions in Narasaraopet | నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటిస్తున్నారు. ఉదయం 11.30కి ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు 12 గంటలకు యల్లమందకు చేరుకున్నారు. మండలంలోని యల్లమంద గ్రామంలో లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూ.4 వేల పింఛన్ లబ్ధిదారుకు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. బాగా చదువుకోవాలని శారమ్మ పిల్లలకు చంద్రబాబు సూచించారు. చురుకుగా ఉన్నావని, బాగా చదివితే మంచి స్థాయికి వస్తాయని ఆశీర్వదించారు.

ఏపీలో జనవరి నెల పింఛన్ల పంపిణీ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ చేశారు. వారి కుటుంబంతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

రూ.5 లక్షలు అందించాలని సీఎం ఆదేశాలు

అనంతరం మరో పింఛన్ లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంట్లో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. తనకు టీ షాప్ పెట్టుకునేందుకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని ఏడుకొండలు కోరారు. స్పందించిన సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు లోన్ ఇవ్వాలని అధికారును చంద్రబాబు ఆదేశించారు. గ్రామంలోని  కోదండరామస్వామి దేవాలయాన్ని చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం హెలిప్యాడ్‌ ప్రాంతంలో సీఎం లంచ్ చేసి అనంతరం,  జిల్లా అధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

కోటప్పకొండను దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

జిల్లా అధికారులు, పార్టీ నేతలతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని, ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దర్శనం అనంతరం కోటప్పకొండ నుంచి యల్లమందలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. దాదాపు 3 నుంచి 4 గంటల మధ్య యల్లమంద నుంచి ఉండవల్లికి బయలుదేరతారని అధికారులు తెలిపారు. 

దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంత ఎక్కువ పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాన్ని దేశంలో చూపించగలరా? కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇదే నా సవాల్. పేదవారి బాధలు చూసి ఎన్టీఆర్ పింఛన్లు తీసుకొచ్చారు. తెలంగాణలో పింఛన్లకు రూ.8,179 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఏపీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సూపర్ సిక్స్ ఏమైందని అడుగుతున్నారు. ఏపీలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. - ఏపీ సీఎం చంద్రబాబు

12 గంటల వరకే 91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
నెలకు ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, మొదలుపెట్టిన రోజే మధ్యాహ్నం 12 గంటల వరకే పింఛన్ల పంపిణీ 91 శాతం పూర్తయ్యింది. జనవరి నెలకు సంబంధించి 63,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు వేగంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికల్లా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
AP Governance Progress Report: విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏపీ - రెండేళ్ల పాలనపై ఆర్థిక ప్రగతి నివేదిక విడుదల చేసిన సీఎం చంద్రబాబు!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Borugadda Anil Protest Outside YS Jagan Residence: తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!
తాడేపల్లిలో వైఎస్ జగన్ నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ నిరసన - సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Utnoor Gond Fort: ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ఎకో టూరిజం కేంద్రంగా గోండు రాజుల చారిత్రాత్మక కోట అభివృద్ధి
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
Embed widget