అన్వేషించండి

CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం

AP CM Chandrababu Distributes pension at Narasaraopet | ఏపీలో జనవరి నెల పింఛన్ల పంపిణీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యల్లమందలో లబ్దిదారులకు పింఛన్ పంపిణీ చేశారు.

Chandrababu Distributes Pensions in Narasaraopet | నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇస్తోంది. ఇందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం నాడు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటిస్తున్నారు. ఉదయం 11.30కి ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు 12 గంటలకు యల్లమందకు చేరుకున్నారు. మండలంలోని యల్లమంద గ్రామంలో లబ్దిదారు శారమ్మ ఇంటికి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రూ.4 వేల పింఛన్ లబ్ధిదారుకు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. బాగా చదువుకోవాలని శారమ్మ పిల్లలకు చంద్రబాబు సూచించారు. చురుకుగా ఉన్నావని, బాగా చదివితే మంచి స్థాయికి వస్తాయని ఆశీర్వదించారు.

ఏపీలో జనవరి నెల పింఛన్ల పంపిణీ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పింఛన్‌దారుల ఇంటికి వెళ్లి సీఎం చంద్రబాబు పింఛన్ పంపిణీ చేశారు. వారి కుటుంబంతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకుని కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

రూ.5 లక్షలు అందించాలని సీఎం ఆదేశాలు

అనంతరం మరో పింఛన్ లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంట్లో సీఎం చంద్రబాబు టీ పెట్టారు. తనకు టీ షాప్ పెట్టుకునేందుకు రూ.5 లక్షల లోన్ ఇవ్వాలని ఏడుకొండలు కోరారు. స్పందించిన సీఎం చంద్రబాబు బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు లోన్ ఇవ్వాలని అధికారును చంద్రబాబు ఆదేశించారు. గ్రామంలోని  కోదండరామస్వామి దేవాలయాన్ని చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం హెలిప్యాడ్‌ ప్రాంతంలో సీఎం లంచ్ చేసి అనంతరం,  జిల్లా అధికారులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

కోటప్పకొండను దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు

జిల్లా అధికారులు, పార్టీ నేతలతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కోటప్పకొండకు చేరుకుంటారు. అక్కడ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకుని, ఆలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దర్శనం అనంతరం కోటప్పకొండ నుంచి యల్లమందలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. దాదాపు 3 నుంచి 4 గంటల మధ్య యల్లమంద నుంచి ఉండవల్లికి బయలుదేరతారని అధికారులు తెలిపారు. 

దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇంత ఎక్కువ పింఛన్లు ఇస్తున్న రాష్ట్రాన్ని దేశంలో చూపించగలరా? కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వారికి ఇదే నా సవాల్. పేదవారి బాధలు చూసి ఎన్టీఆర్ పింఛన్లు తీసుకొచ్చారు. తెలంగాణలో పింఛన్లకు రూ.8,179 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఏపీకి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. సూపర్ సిక్స్ ఏమైందని అడుగుతున్నారు. ఏపీలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. - ఏపీ సీఎం చంద్రబాబు

12 గంటల వరకే 91 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
నెలకు ముందు రోజే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, మొదలుపెట్టిన రోజే మధ్యాహ్నం 12 గంటల వరకే పింఛన్ల పంపిణీ 91 శాతం పూర్తయ్యింది. జనవరి నెలకు సంబంధించి 63,77,943 మంది లబ్దిదారులకు పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు వేగంగా పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. సాయంత్రానికల్లా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget