అన్వేషించండి

Anil Ambani Loan Fraud Case: అనిల్ అంబానీ 3000 కోట్ల లోన్ ఫ్రాడ్ కేసులో ఈడీ దూకుడు, తొలి అరెస్టు

Loan Fraud Case | అనిల్ అంబానీ కంపెనీలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో బిశ్వాల్ ట్రేడ్లింక్ కు చెందిన పార్థసారథి బిశ్వాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు.

Reliance Group chairman Anil Ambani summoned by ED | ముంబై: రిలయన్స్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన వ్యాపార సంస్థలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు (Money laundering Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తొలి అరెస్టు చేసింది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ (బిటిపిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA), 2002 నిబంధనల ప్రకారం ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని బిటిపిఎల్ కార్యాలయాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన మరుసటి రోజే ఈడీ పార్థసారథి బిస్వాల్‌ను అరెస్టు చేసింది.

ఆగస్టు 5న విచారణకు రావాలని అనిల్ అంబానీకి సమన్లు

 ఆగస్టు 5న విచారణకు హాజరుకావాలని రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు ​​జారీ చేసింది. ఆయన గ్రూప్ కంపెనీలు కోట్లాది రూపాయల బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని తమ ఆపీసులో విచారణకు రావాలని నోటీసులలో పేర్కొంది అని అధికారిక వర్గాలు శుక్రవారం తెలిపాయి. విదేశాలకు వెళ్లకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా 66 ఏళ్ల వ్యాపారవేత్త అనిల్ అంబానీపై లుక్ అవుట్ సర్క్యులర్ (Lookout Notice) కూడా జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసు ఇక్కడే నమోదైంది కనుక ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరుకావాలని అనిల్ అంబానీకి జారీ చేసిన సమన్లలో ఈడీ ఆదేశించింది. 

విచారణకు హాజరైన తర్వాత మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని ఈడీ నివేదించింది. అంబానీ గ్రూప్ కంపెనీల కొంతమంది ఎగ్జిక్యూటివ్‌లకు కూడా త్వరలో సమన్లు ​​అందనున్నాయని పిటిఐ వార్తా సంస్థ వర్గాలను ఉటంకించింది.

మూడు రోజులపాటు ఈడీ సోదాలు

గత వారం అనిల్ అంబానీ వ్యాపార గ్రూప్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌లతో సహా 50 కంపెనీలు, 25 మంది వ్యక్తుల 35 కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన తర్వాత ఈ సమన్లు ​​జారీ చేసింది. జూలై 24న ప్రారంభమైన ఈడీ సోదాలు దాదాపు మూడు రోజుల పాటు కొనసాగాయి. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (R Infra)తో సహా బహుళ గ్రూప్ కంపెనీలు రూ.17,000 కోట్లకు పైగా నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి.

సెబి నివేదిక ఆధారంగా, ఆర్ ఇన్‌ఫ్రా సిఎల్ఇ అనే కంపెనీ ద్వారా ఇంటర్-కార్పొరేట్ డిపాజిట్లు (ICDs)గా మళ్లించినట్లు ఏజెన్సీ గుర్తించింది. వాటాదారులు, ఆడిట్ ప్యానెల్ నుంచి పర్మిషన్ లేకుండా ఉండటానికి సిఎల్ఇని తన సంబంధిత పార్టీగా ఆర్ ఇన్‌ఫ్రా వెల్లడించలేదని ఆరోపణలున్నాయి. మంగళవారం నాడు అనిల్ అంబానీ ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు కానుండటంపై రిలయన్స్ సంస్థలతో పాటు ఇతర వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. కేవలం విచారణకు పరిమితం కానున్నారా, ఏమైనా భారీ అవకతవకలు గుర్తించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా అనే చర్చలతో కంపెనీకి చెందిన షేర్లు శుక్రవారం మార్కెట్లో భారీగా పతనమయ్యాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Delhi Crime: ఢిల్లీ జాతి రత్నాలు-  దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
ఢిల్లీ జాతి రత్నాలు- దిష్టిబొమ్మకు అంత్యక్రియలు చేసి ఇన్సూరెన్స్ కొట్టేద్దామనుకున్నారు - ఏం తెలివితేటలు రా అయ్యా !
Telangana Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. స్టే విధించేందుకు నిరాకరణ
తెలంగాణ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
Embed widget