అన్వేషించండి

Budget 2024: బడ్జెట్ తర్వాత మందుల రేట్లు పెరుగుతాయా?, మోదీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది?

Union Budget 2024: ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి నిత్యావసర మందుల ధరల్లో మార్పులు వచ్చాయి. మరికొన్ని రోజుల్లో రాబోయే బడ్జెట్‌ మందుల ధరలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?.

Union Budget 2024-25 Expectations: ఆర్థిక సంవత్సరం 2024-25 కోసం కేంద్ర బడ్జెట్‌ ప్రకటనకు సమయం దగ్గర పడుతోంది. మరో 10 రోజుల తర్వాత, ఈ నెల 23న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman) కొత్త బడ్జెట్‌ను పార్లమెంట్‌లో సమర్పిస్తారు. మోదీ 3.0 ప్రభుత్వంలో మొదటి బడ్జెట్ ఇదే. 2024-25 బడ్జెట్‌ మీద ఆరోగ్య సంరక్షణ రంగానికి (Healthcare Sector) చాలా అంచనాలు ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఇదీ
బడ్జెట్‌కు సంబంధించి, ఔషధాల ధరల గురించి భారీ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హెల్త్‌కేర్ సెక్టార్‌తో పాటు సామాన్య ప్రజల జేబులపై నేరుగా ప్రభావం చూపే విషయం ఇది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర మందుల ధరలను పెంచబోమని ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ గత ఏప్రిల్‌లో హామీ ఇచ్చారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరగడమే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి అప్పట్లో చెప్పారు.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో మార్పులు
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కొన్ని ఔషధాల ధరలు పెరిగాయి. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA), తన నియంత్రణలో ఉన్న కొన్ని మందుల ధరల్లో మార్పులు ప్రకటించింది, అవి ఈ ఏడాది ఏప్రిల్ 01వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. NPPA చేసిన సరవణ తర్వాత... డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, మెఫెనామిక్ యాసిడ్, పారాసెటమాల్, మార్ఫిన్ వంటి నొప్పి నివారణ మందులు, అమికాసిన్, బెడాక్విలిన్, క్లారిథ్రోమైసిన్ వంటి TB మందులు, క్లోబాజామ్, డయాజెపామ్, లోరాజెపామ్ వంటి యాంటీ కన్వల్సెంట్ ఔషధాలు మరింత ఖరీదయ్యాయి. మరోవైపు... మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌, అలర్జీలకు సంబంధించిన మందుల ధరలు తగ్గాయి.

మందుల రేట్లను పెంచబోమని కేంద్ర మంత్రి గతంలో హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే కొన్ని నిత్యావసర ఔషధాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతి చేసుకున్న యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్‌ (API) ఆధారంగా మందుల ధరలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. ఇటీవల అభివృద్ధి చేసిన & పేటెంట్ పొందిన మందుల ధరలు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. 

వివిధ వ్యాధుల చికిత్సలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి మందుల ధరలను నియంత్రించడంపై భారత ప్రభుత్వం దృష్టి పెడుతుందని కూడా పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఆరోగ్య సంరక్షణ రంగం కీలకమైనది. కాబట్టి, ఆరోగ్య సంరక్షణ రంగానికి నిధులు సమకూర్చడంపై ప్రభుత్వం దృష్టి ఉండాలి. దీనివల్ల, దేశంలోని ప్రజలందరికీ సమానంగా, అధిక నాణ్యత గల ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. దీనిని వదిలేసి ప్రజాకర్షక చర్యల కోసం పాకులాడకూడదు. ఆ చర్యలు స్వల్పకాలంలో ఆకర్షణీయంగా అనిపించవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. ఈ బడ్జెట్‌లో ప్రజల తక్షణ అవసరాలపైనే కాదు, భవిష్యత్ తరాల అవసరాల గురించి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Tirumala Alert: చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Deputy CM Pawan Kalyan Palani Temple | షష్ఠ షణ్ముఖ యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ | ABP DesamPM Modi Gifts to Elon Musk Children | మస్క్ పిల్లలకు మోదీ ఇచ్చిన గిఫ్టులేంటంటే | ABP DesamTrump Met PM Modi White House | వైట్ హౌస్ లో మోదీకి అదిరిపోయే స్వాగతం | ABP DesamCaste Census Re Survey in Telangana |  ఫిబ్రవరి 16నుంచి తెలంగాణలో కుల గణనకు మరో అవకాశం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Prayagraj Road Accident: మహా కుంభమేళా యాత్రలో విషాదం, బస్సును ఢీకొన్న బొలెరో - 10 మంది భక్తులు మృతి
Tirumala Alert: చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
Thala Movie Review: అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
అమ్మ రాజశేఖర్ కొడుకు హీరోగా పరిచయమైన 'తల' సినిమా ఎలా ఉందంటే?
AP CM Chandrababu: వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
వైసీపీ హయాంలో జరిగిన దారుణాలపై విచారణకు ప్రత్యేక కమిషన్ - ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Congress:  తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ -  దీపాదాస్ మున్షికి ఉద్వాసన
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మీనాక్షి నటరాజన్ - దీపాదాస్ మున్షికి ఉద్వాసన
Manchu Manoj: మంచు మనోజ్ కామెంట్స్‌తో హైలైట్ అయిన 'జగన్నాథ్' - అసలు ఆ సినిమా గురించి తెలుసా?
మంచు మనోజ్ కామెంట్స్‌తో హైలైట్ అయిన 'జగన్నాథ్' - అసలు ఆ సినిమా గురించి తెలుసా?
Telugu TV Movies Today: చిరంజీవి ‘అన్నయ్య’, నాగార్జున ‘శివమణి’ to పవన్ ‘బాలు’, విజయ్ ‘మాస్టర్’ వరకు - ఈ శనివారం (ఫిబ్రవరి 15) టీవీలలో వచ్చే సినిమాలివే
చిరంజీవి ‘అన్నయ్య’, నాగార్జున ‘శివమణి’ to పవన్ ‘బాలు’, విజయ్ ‘మాస్టర్’ వరకు - ఈ శనివారం (ఫిబ్రవరి 15) టీవీలలో వచ్చే సినిమాలివే
US Deportation: నేడు భారత్‌కు అమెరికా వలసదారుల రెండో విమానం, కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ సీఎం ఆగ్రహం
నేడు భారత్‌కు అమెరికా వలసదారుల రెండో విమానం, కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ సీఎం ఆగ్రహం
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.