Tirumala Alert: చిరుత సంచారంతో టీటీటీ అలర్ట్, అలిపిరి నడకదారిలో ఈ మార్పులు గమనించారా!
Tirumala Devotees News | తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. మరోవైపు చిరుతల సంచారంతో టీటీడీ అప్రమత్తమైంది. నడకదారిలో భక్తులకు అనుమతిలో మార్పులు చేసింది.

Cheetah in Tirumala | తిరుపతి: తిరుమల, తిరుపతిలో చిరుతల సంచారం కలకం రేపుతోంది. దర్శనానికి వెళ్లే భక్తుల భద్రత కోసం టీటీడీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఓ వైపు విజిలెన్స్ సిబ్బంది గస్తీ ముమ్మరం చేయగా, మరోవైపు అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వెళ్లే భక్తులను సాధారణంగానే అనుమతిస్తున్నారు. ఆ తరువాత మాత్రం శ్రీవారి భక్తులను గుంపులుగా దర్శనానికి అనుమతిస్తున్నారు.
గతంలో చిరుత సంచారం సమయంలో భక్తులకు మనోధైర్యాన్ని ఇచ్చేందుకు చేతి కర్రలు సైతం పంచడం తెలిసిందే. ఆ సమయంలోనూ సాయంత్రం వేళ భక్తులను గుంపులు గుంపులుగా శ్రీవారి దర్శనానికి అనుమతించారు. ప్రస్తుతం సైతం ఒక్కోసారి 70 నుంచి 100 మంది భక్తులను శ్రీవారి దర్శనానికి కాలి నడక భక్తులను పంపుతున్నారు. గతంలో లాగే 12 సంవత్సరాలలోపు చిన్నారులను మధ్యాహ్నం 2 గంటల తరువాత నుంచి దర్శనానికి అనుమతించడం లేదని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది సూచించారు. అలిపిరి నడక మార్గాన్ని రాత్రి 9:30 గంటల తరువాత మూసివేస్తున్నామని టీటీడీ స్పష్టం చేసింది.
Also Read: నవగ్రహాలను ఎలా పూజించాలి.. ఏ రాశివారు ఎన్ని వత్తులతో దీపం వెలిగించాలి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

