అన్వేషించండి

Fact Check: టాటా కంపెనీ కేవలం రూ.18 వేలకే హైబ్రిడ్ బైక్‌ తెచ్చిందా?, వైరల్ వార్తల వెనుకున్న నిజాలు బయటకు

Tata Hybrid Bike Facts: కేవలం 18 వేల రూపాయలకు టాటా హైబ్రిడ్ బైక్‌ వచ్చింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలో ఎంత నిజం ఉంది? టాటా కంపెనీ అసలు స్పందన ఏమిటి?.

Tata Hybrid Bike News Update: టాటా అనే పేరు భారతదేశంలో నమ్మకం, బలం, భద్రతకు ప్రతీక. కార్ల నుంచి స్టీల్‌ వరకు, నానో వంటి సామాన్యుడి కారు నుంచి లగ్జరీ ప్రొడక్ట్స్‌ వరకు - టాటా గ్రూప్‌ ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగింది. అందుకే టాటాకు సంబంధించిన ఏ చిన్న వార్తయినా ప్రజల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. ప్రస్తుతం అలాంటి వార్తే సోషల్ మీడియాను కుదిపేస్తోంది. “టాటా కంపెనీ కొత్త హైబ్రిడ్ బైక్‌ను విడుదల చేసింది... ధర కేవలం 18 వేల రూపాయలు మాత్రమే!” అనే పోస్టులు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి.

ఫోటోలు కూడా చక్కగా ఎడిట్ చేసి, టాటా లోగో పెట్టి షేర్‌ చేయడం వల్ల చాలామంది ఈ వార్తను నిజమని నమ్మేశారు. కొందరు అయితే బైక్ బుకింగ్‌ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటూ ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో... ఈ వైరల్ వార్తలో నిజం ఎంత? టాటా నిజంగా ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగు పెట్టిందా? ఇదిగో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

వైరల్ వార్త ఏమంటోంది?
సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్టుల ప్రకారం, టాటా కంపెనీ 125cc సామర్థ్యం గల ఒక కొత్త హైబ్రిడ్ బైక్‌ను తయారు చేసింది. ఈ బైక్ సామాన్య ప్రజల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు & దాని ధర కేవలం 18,000 రూపాయలు మాత్రమే అని వైరల్ పోస్టులు చెబుతున్నాయి. పైగా, బలంగా ఉన్నట్లుగా కనిపించే బైక్‌ ఫోటోల్నీ అవే పోస్టుల్లో జత చేశారు. 'టాటా నానో' తరహాలో తక్కువ ధరలో ఈ బైక్‌ను విడుదల చేసినట్లు చెప్పడంతో ప్రజలు పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ రూమర్ హైప్‌ పెరిగింది.

వైరల్ కథనాల వెనుక నిజం ఏమిటి?
ఈ వార్త పూర్తిగా తప్పుడు సమాచారం. టాటా కంపెనీ ఇలాంటి బైక్‌ను విడుదల చేయలేదు. ద్విచక్ర వాహన మార్కెట్లోకి ప్రవేశించే ప్రణాళిక కూడా కంపెనీ వద్ద లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, బైక్‌ ఇమేజ్‌లు అన్నీ ఎడిట్ చేసిన ఫేక్ పోస్టులు అని వెల్లడైంది.

టాటా మోటార్స్‌ కూడా దీనిపై స్పష్టంగా స్పందించింది. అధికారికంగా ఇచ్చిన క్లారిటీ ఏంటంటే:

  • టాటా ప్రస్తుతం ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి రావడం లేదు
  • వైరల్ బైక్ పోస్టులు అవాస్తవాలు
  • కంపెనీ ఏ హైబ్రిడ్ బైక్‌ను తయారు చేయలేదు

వైరల్ వార్తలన్నీ తప్పుడు ప్రచారం అని టాటా మోటార్స్‌ తన అధికారిక ప్రకటనతో ఖరారు చేసింది.

ఇలాంటి ఫేక్ వార్తలు ఎందుకు వస్తుంటాయి?
ప్రముఖ బ్రాండ్ల పేర్లను ఉపయోగించి తప్పుడు సమాచారం పంచడం కొత్త విషయం కాదు. సోషల్ మీడియాలో ఎవరైనా ఫోటో మార్చి, కొత్త డిజైన్ జత చేసి, ఆకర్షణీయమైన ధర చెబితే చాలామంది ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే షేర్ చేస్తారు. ఫేక్ న్యూస్ పెరగడానికి ఇదే ప్రధాన కారణం. టాటా వంటి నమ్మకమైన బ్రాండ్ పేరు ఉండటం ఈ రూమర్‌కి మరింత వేగం తీసుకొచ్చింది.

కేవలం 18 వేల రూపాయలకు టాటా హైబ్రిడ్ బైక్ వచ్చింది అనే వార్త పూర్తిగా అబద్ధం. సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, పోస్టులు నిజమైనవి కావు. టాటా కంపెనీ కూడా ఈ వార్తలను ఖండించింది. అందువల్ల ఇలాంటి వైరల్ పోస్టులను చూసినప్పుడు అధికారిక సమాచారం వచ్చిన తర్వాతనే నమ్మడం మంచిది.

మీ సేఫ్టీ, మీ డబ్బు, మీ సమాచారం - ఇవన్నీ ముఖ్యం. కాబట్టి ఫేక్ న్యూస్‌కి బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mahindra Hybrid SUVs: హైబ్రిడ్ టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్న మహీంద్రా.. మైలేజీ కోసం Mahindra XUV 7XOతో ప్రయోగం
హైబ్రిడ్ టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్న మహీంద్రా.. మైలేజీ కోసం Mahindra XUV 7XOతో ప్రయోగం
IPL 2026 Playoffs Scenario: రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
రసవత్తరంగా మారిన ఐపీఎల్ ఫ్లే ఆఫ్ రేసు.. 4 స్థానాల కోసం 8 జట్ల మధ్య పోటీ
Hybrid Car Types: మీకు ఏ హైబ్రిడ్ కారు బెస్ట్ ? ఫస్ట్ వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకుంటేనే బెనిఫిట్స్
మీకు ఏ హైబ్రిడ్ కారు బెస్ట్ ? ఫస్ట్ వీటి మధ్య వ్యత్యాసం తెలుసుకుంటేనే బెనిఫిట్స్
7 Seater Cars For Families: పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం
పెద్ద కుటుంబాలకు ఈ 7 సీటర్ కార్లు బెస్ట్.. జాబితాలో Ertiga, Bolero మరింత ప్రత్యేకం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్ఫీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
CM Revanth Reddy: తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
తెలంగాణలో ఇంటర్ బోర్డ్ రద్దు ? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులపై ప్రభుత్వం ఫోకస్
AP Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
ఏపీ ప్రజలకు చల్లని వార్త.. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు- ఎండల నుంచి బిగ్ రిలీఫ్
Gadwal Vijayalakshmi: తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల్ విజయలక్ష్మి.. ఆమె బ్యాగ్రౌండ్ తెలుసా !
IPL 2026 DC VS PBKS Result Updates: DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు నాలుగో ప‌రాజ‌యం
DC అద్భుత విజ‌యం.. ఫిఫ్టీల‌తో రాణించిన అక్ష‌ర్, మిల్ల‌ర్, ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌జీవం.. పంజాబ్ కు వరుసగా నాలుగో ప‌రాజ‌యం
Viral News: యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
యానాంలో యువకుడి హైడ్రామా.. లవర్ మెసేజ్‌లు చదివారంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Embed widget