అన్వేషించండి

Mahindra Electric SUVs: మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు - మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

పెట్రో ధరలు రోజు రోజుకు భారీగా పెరగడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే మహీంద్ర సరికొత్త ఎలక్ట్రిక్ SUVలను అందుబాటులోకి తెస్తోంది.

కొత్తదనం ఎక్కడున్నా ఇట్టే పట్టుకోవడంలో ముందుంటారు మంహీద్రా కంపెనీ అధిపతి ఆనంద్ మహీంద్రా. అందులో భాగంగానే.. రానున్న కాలం అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే హవా అని భావిస్తున్నారు. తన కంపెనీ నుంచి సరికొత్త వాహనాలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు మహీంద్రా ప్రయత్నిస్తున్నారు. తాజాగా నేషనల్, ఇంటర్నేషనల్ మార్కెట్లకు అనుగుణంగా 5 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్లను ఎక్స్ యూవీ, బీఈ బ్రాండ్లుగా రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. వీటిలో తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2024 చివరి నెలలోగా జనాలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు  వెల్లడించారు. మిగతా నాలుగు వెహికల్స్ ను 2026 వరకు మార్కెట్లోకి విడుదల చేస్తామని చెప్పారు.  

పెట్రో ధరలు రోజు రోజుకు భారీగా పెరగడంతో పాటు పర్యావరణానికి హాని కలుగుతున్న నేపథ్యంలో జనాలు సైతం పర్యావరణహితమైన వాహనాలనే వాడేలా ప్రయత్నిస్తున్నారు. అటు ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు వాహన తయారీ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. సమీప భవిష్యత్ లో మార్కెట్ అంతా విద్యుత్ వాహనాలతోనే నిండిపోయే అవకాశం ఉంది. ఆ దిశగానే ఆలోచనలు చేస్తున్న ఆనంద్ మహీంద్రా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి ఇదే సరైన సమయంగా ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే ఐదు ఎలక్ట్రిక్ SUVలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు.

మహీంద్రా కంపెనీలో బీఐఐ భారీగా పెట్టుబడులు: వాస్తవానికి మహీంద్రా కంపెనీ..  తన ఎలక్ట్రిక్ విభాగాన్ని మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు చేస్తుంది. ఇందుకోసం విదేశీ కంపెనీలతో కలిసి పని చేసేందుకు సిద్ధం అవుతుంది. మహీంద్రా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఈవీ కోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ సుముఖంగా ఉందట. తమ కంపెనీలో 250 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 1,925 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేందుకు బీఐఐ రెడీగా ఉందని ఆనంద్ మహీంద్రా ఇప్పటికే వెల్లడించారు. ఈ కంపెనీలో మొత్తం బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 7,900 కోట్ల రూపాయలను మహీంద్రా కంపెనీ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ కంపెనీలు సంయుక్తంగా పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ మొత్తాన్ని 2024-27  మధ్యలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు కంపెనీలు కలిసి సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాలను ఇంగ్లో ఫ్లాట్ ఫామ్ మీద మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది 2.25 లక్షల ఎస్ యూ వీలను అమ్మినట్లు తెలిపిన మహీంద్రా కంపెనీ.. 2027 నాటి ఎస్ యూ వీ విభాగంలో 25 శాతం వరకు ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయని అభిప్రాయపడింది.
Mahindra Electric SUVs: మహీంద్రా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ SUVలు - మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!
మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్ యూ వీలకు ఫోక్స్‌వ్యాగన్‌ సహకారం: మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీలో మహీంద్రా కంపెనీకి సహకారం అందించేందుకు ఇంటర్నేషనల్ కంపెనీ ఫోక్స్ వ్యాగన్ ముందుకు వచ్చింది. ఇందుకోసం ఓ  ఒప్పందం చేసుకుంది.  మహీంద్రా కంపెనీ, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ కంపెనీలు సంయుక్తంగా ఇంగ్లో ఫ్లాట్ ఫామ్ మీద తయారు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన మాడ్యులర్‌ ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ మ్యాట్రిక్స్‌(ఎంఈబీ) ఎలక్ట్రిక్ ఎక్యుప్ మెంట్స్ ను ఫోక్స్ వ్యాగన్ అందించనుంది. ప్రధానంగా 2026 వరకు మార్కెట్లోకి రానున్న 5 ఎలక్ట్రిక్ SUVలకు ఈ కంపెనీ ఎంఈబీ ఎక్యుప్ మెంట్స్ ను సమకూర్చనుంది. 

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

టాప్ హెడ్ లైన్స్

E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
E85 ఇంధనంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్‌ Yamaha FZ Blue వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే
సీరియస్‌ రైడర్లకు బెస్ట్ బడ్జెట్ ఆప్షన్‌! రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ పూర్తి రివ్యూ
రైడా రోవర్ రైడింగ్ ప్యాంట్స్ - డైలీ జర్నీ, లాంగ్‌ టూరింగ్‌ కోసం ప్రత్యేకంగా డిజైనింగ్‌, ధర ఎంతంటే?
రెనాల్ట్ డస్టర్ 1.0 Vs 1.3 టర్బో పెట్రోల్ - పవర్‌ ఎంత, టార్క్‌ ఎంత, మైలేజ్‌లో ఏది బెస్ట్?
పవర్ ఎక్కువైతే మైలేజ్ తగ్గుతుందా? రెనాల్ట్ డస్టర్ 1.0 - 1.3 రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవే!
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget