అన్వేషించండి

Electric vehicles: 2030 నాటికి ఇండియాలో 5 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు, ఈ బిజినెస్ చేస్తే కోటీశ్వరులైపోతారు

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్నది. 2030 వరకు భారత్ లో సుమారు 5 కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది..

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలకు తోడు.. పర్యావరణ పరిపరక్షణ మీద జనాల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ వాహనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పి.. ఎలక్ట్రిక్ వాహనాలకు హాయ్ చెప్తున్నారు. ఆయా వాహన తయారీ కంపెనీలు సైతం విద్యుత్ వాహనాల తయారీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. రానున్న కాలం అంతా విద్యుత్ వాహనాల హవా కొనసాగుతుందనే అంచనా మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూల వాతావరణం

ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి భారత్ లో సుమారు 5 కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఛార్జింగ్‌ మౌలిక వసతుల రంగంలో భారీ సంఖ్యలో అవకాశాలు ఉంటాయని ప్రటించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు దేశంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని తెలిపింది. కేవలం ఒక సంవత్సర కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా మూడింతలు పెరిగినట్లు కేపీఎంజీ ప్రకటించింది. బస్సులు, టూ, త్రి వీలర్ వాహనాల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగినట్లు తెలిపింది.మార్చి 2022 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 10 లక్షలు దాటినట్లు వెల్లడించింది. 2030 నాటికి  విద్యుత్ వాహనాల సంఖ్య 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేసింది.

పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లకు భారీ డిమాండ్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,700 పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లు ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఛార్జింగ్ సెంటర్లు ఏమాత్రం సరిపోవని ప్రకటించింది. ఛార్జింగ్‌ సెంటర్లు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఇప్పటికే ఛార్జింగ్ మౌలిక వసతుల్ని పెంచడం కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేపీఎంజీ వెల్లడించింది. ప్రజలు, ప్రైవేటు రంగాల నుంచి సైతం విద్యుత్ వాహనాల మీద ఆసక్తి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో  ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులకు అవకాశం కలుగుతున్నట్లు తెలిపింది. ఛార్జింగ్‌ వ్యాపారం ద్విచక్ర వాహన విభాగంలో 2025 నాటికి 15 నుంచి 20 శాతం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  2030 వరకు 50 నుంచి 60 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత ప్రయాణికుల వాహన విభాగంలో 2025 నాటికి 8 నుంచి 10 శాతం, 2030కల్లా 35 నుంచి 40 శాతం పెరుగుతుందని వెల్లడించింది. అటు  వాణిజ్య వాహన విభాగంలో ఛార్జింగ్‌ వ్యాపారం 2030 నాటికి 90 నుంచి 95 శాతం వృద్ధి నమోదవుతుందని ప్రకటించింది.

భారత్ లో పరిస్థితులు వేరు

విదేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వాణిజ్య వాహనాల ఛార్జింగ్‌కు డిమాండ్‌ అధికంగా ఉందని ప్రకటించింది.  భారత్‌లో మాత్రం టూ, త్రీ వీలర్ వాహనాలకు ఛార్జింగ్‌ ఎక్కువ అవసరమని తెలిపింది. పెద్ద పెద్ద పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల కంటే ముందు.. తక్కువ సమయంలో ఇళ్లు, కార్యాలయాల సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
ట్రయంఫ్‌ స్ట్రీట్‌ ట్రిపుల్‌ 765 RS vs డుకాటి మాన్‌స్టర్‌ V2 - రేటు రూ.1 లక్ష తక్కువైనా 'పవర్‌'లో అదరగొడుతోంది!
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
రూ.1 లక్ష బెనిఫిట్ అందిస్తున్న Hyundai Creta.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Embed widget