అన్వేషించండి

Electric vehicles: 2030 నాటికి ఇండియాలో 5 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు, ఈ బిజినెస్ చేస్తే కోటీశ్వరులైపోతారు

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్నది. 2030 వరకు భారత్ లో సుమారు 5 కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది..

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలకు తోడు.. పర్యావరణ పరిపరక్షణ మీద జనాల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ వాహనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పి.. ఎలక్ట్రిక్ వాహనాలకు హాయ్ చెప్తున్నారు. ఆయా వాహన తయారీ కంపెనీలు సైతం విద్యుత్ వాహనాల తయారీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. రానున్న కాలం అంతా విద్యుత్ వాహనాల హవా కొనసాగుతుందనే అంచనా మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూల వాతావరణం

ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి భారత్ లో సుమారు 5 కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఛార్జింగ్‌ మౌలిక వసతుల రంగంలో భారీ సంఖ్యలో అవకాశాలు ఉంటాయని ప్రటించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు దేశంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని తెలిపింది. కేవలం ఒక సంవత్సర కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా మూడింతలు పెరిగినట్లు కేపీఎంజీ ప్రకటించింది. బస్సులు, టూ, త్రి వీలర్ వాహనాల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగినట్లు తెలిపింది.మార్చి 2022 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 10 లక్షలు దాటినట్లు వెల్లడించింది. 2030 నాటికి  విద్యుత్ వాహనాల సంఖ్య 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేసింది.

పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లకు భారీ డిమాండ్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,700 పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లు ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఛార్జింగ్ సెంటర్లు ఏమాత్రం సరిపోవని ప్రకటించింది. ఛార్జింగ్‌ సెంటర్లు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఇప్పటికే ఛార్జింగ్ మౌలిక వసతుల్ని పెంచడం కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేపీఎంజీ వెల్లడించింది. ప్రజలు, ప్రైవేటు రంగాల నుంచి సైతం విద్యుత్ వాహనాల మీద ఆసక్తి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో  ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులకు అవకాశం కలుగుతున్నట్లు తెలిపింది. ఛార్జింగ్‌ వ్యాపారం ద్విచక్ర వాహన విభాగంలో 2025 నాటికి 15 నుంచి 20 శాతం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  2030 వరకు 50 నుంచి 60 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత ప్రయాణికుల వాహన విభాగంలో 2025 నాటికి 8 నుంచి 10 శాతం, 2030కల్లా 35 నుంచి 40 శాతం పెరుగుతుందని వెల్లడించింది. అటు  వాణిజ్య వాహన విభాగంలో ఛార్జింగ్‌ వ్యాపారం 2030 నాటికి 90 నుంచి 95 శాతం వృద్ధి నమోదవుతుందని ప్రకటించింది.

భారత్ లో పరిస్థితులు వేరు

విదేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వాణిజ్య వాహనాల ఛార్జింగ్‌కు డిమాండ్‌ అధికంగా ఉందని ప్రకటించింది.  భారత్‌లో మాత్రం టూ, త్రీ వీలర్ వాహనాలకు ఛార్జింగ్‌ ఎక్కువ అవసరమని తెలిపింది. పెద్ద పెద్ద పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల కంటే ముందు.. తక్కువ సమయంలో ఇళ్లు, కార్యాలయాల సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nimmala RamaNaidu: భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
Jubilee Hills Politics: కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
Pawan Kalyan Visits Kumki Elephants: పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
Jana Nayagan : దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
Advertisement

వీడియోలు

మహిళను ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోతారా?  డిప్యూటీ సీఎంపై మండిపడుతున్న జనాలు
రియల్ లైఫ్ OG.. షూటింగ్ రేంజ్‌లో గన్ ఫైర్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Narmada Human: భారతదేశ చరిత్రని మార్చిన ఆ పుర్రె ఎవరిది?
Dhruv Jurel Century for India A | సెంచరీలతో చెలరేగిన ధ్రువ్ జురెల్
Abhishek Sharma World Record in T20 | అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డు !
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala RamaNaidu: భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
భవన నిర్మాణ కూలీ అవతారమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎందుకిలా..
Jubilee Hills Politics: కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
కాంగ్రెస్ ఓటుకు 10వేలు ఇస్తోంది! బీఆర్ఎస్ సానుభూతి వర్కవుట్ కాదు: లంకల దీపక్ రెడ్డి
Pawan Kalyan Visits Kumki Elephants: పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్ చేసిన కుంకీ ఏనుగులు, కుంకీలకు ఆహారం అందించిన డిప్యూటీ సీఎం
Jana Nayagan : దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
దళపతి విజయ్ లాస్ట్ మూవీ 'జన నాయగన్' - బాలయ్య 'భగవంత్ కేసరి'కి రీమేకా!... ఫస్ట్ సాంగ్‌తో...
Sleep Quality Tips : రాత్రుళ్లు పదే పదే నిద్ర లేస్తున్నారా? వెంటనే పడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
రాత్రుళ్లు పదే పదే నిద్ర లేస్తున్నారా? వెంటనే పడుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Nara Lokesh: ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
ఒక్కఛాన్స్ పేరుతో ఏపీ నష్టపోయింది, బిహార్‌లో ఆ పరిస్థితి రావద్దు: నారా లోకేష్
Congress candidate Naveen Yadav: రౌడీ అనే ముద్రవేస్తారా..? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 40వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్
రౌడీ అనే ముద్రవేస్తారా..? జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 40వేల మెజారిటీతో గెలుస్తా: నవీన్ యాదవ్
AR Rahman Concert : రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
రెహమాన్ కాన్సెర్ట్‌లో 'పెద్ది' టీం సందడి - 'చికిరి చికిరి' జోష్ వేరే లెవల్
Embed widget