అన్వేషించండి

Electric vehicles: 2030 నాటికి ఇండియాలో 5 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు, ఈ బిజినెస్ చేస్తే కోటీశ్వరులైపోతారు

భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకు పెరుగుతున్నది. 2030 వరకు భారత్ లో సుమారు 5 కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది..

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో ధరలకు తోడు.. పర్యావరణ పరిపరక్షణ మీద జనాల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు విద్యుత్ వాహనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ వాహనాలకు గుడ్ బై చెప్పి.. ఎలక్ట్రిక్ వాహనాలకు హాయ్ చెప్తున్నారు. ఆయా వాహన తయారీ కంపెనీలు సైతం విద్యుత్ వాహనాల తయారీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. రానున్న కాలం అంతా విద్యుత్ వాహనాల హవా కొనసాగుతుందనే అంచనా మేరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు అనుకూల వాతావరణం

ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ కీలక ప్రకటన చేసింది. 2030 నాటికి భారత్ లో సుమారు 5 కోట్ల విద్యుత్ వాహనాలు రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఛార్జింగ్‌ మౌలిక వసతుల రంగంలో భారీ సంఖ్యలో అవకాశాలు ఉంటాయని ప్రటించింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలకు దేశంలో అత్యంత అనుకూల వాతావరణం ఉందని తెలిపింది. కేవలం ఒక సంవత్సర కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా మూడింతలు పెరిగినట్లు కేపీఎంజీ ప్రకటించింది. బస్సులు, టూ, త్రి వీలర్ వాహనాల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో పెరిగినట్లు తెలిపింది.మార్చి 2022 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 10 లక్షలు దాటినట్లు వెల్లడించింది. 2030 నాటికి  విద్యుత్ వాహనాల సంఖ్య 4.5 కోట్ల నుంచి 5 కోట్ల వరకు చేరుతుందని అంచనా వేసింది.

పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లకు భారీ డిమాండ్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,700 పబ్లిక్‌ ఛార్జింగ్‌ సెంటర్లు ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఛార్జింగ్ సెంటర్లు ఏమాత్రం సరిపోవని ప్రకటించింది. ఛార్జింగ్‌ సెంటర్లు భారీగా పెరగాల్సిన అవసరం ఉందని వెల్లడించింది. ఇప్పటికే ఛార్జింగ్ మౌలిక వసతుల్ని పెంచడం కోసం ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు కేపీఎంజీ వెల్లడించింది. ప్రజలు, ప్రైవేటు రంగాల నుంచి సైతం విద్యుత్ వాహనాల మీద ఆసక్తి పెరుగుతున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో  ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్‌ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులకు అవకాశం కలుగుతున్నట్లు తెలిపింది. ఛార్జింగ్‌ వ్యాపారం ద్విచక్ర వాహన విభాగంలో 2025 నాటికి 15 నుంచి 20 శాతం అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  2030 వరకు 50 నుంచి 60 శాతానికి పెరగనున్నట్లు తెలిపింది. వ్యక్తిగత ప్రయాణికుల వాహన విభాగంలో 2025 నాటికి 8 నుంచి 10 శాతం, 2030కల్లా 35 నుంచి 40 శాతం పెరుగుతుందని వెల్లడించింది. అటు  వాణిజ్య వాహన విభాగంలో ఛార్జింగ్‌ వ్యాపారం 2030 నాటికి 90 నుంచి 95 శాతం వృద్ధి నమోదవుతుందని ప్రకటించింది.

భారత్ లో పరిస్థితులు వేరు

విదేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితులు వేరుగా ఉన్నాయని కేపీఎంజీ తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో వాణిజ్య వాహనాల ఛార్జింగ్‌కు డిమాండ్‌ అధికంగా ఉందని ప్రకటించింది.  భారత్‌లో మాత్రం టూ, త్రీ వీలర్ వాహనాలకు ఛార్జింగ్‌ ఎక్కువ అవసరమని తెలిపింది. పెద్ద పెద్ద పబ్లిక్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల కంటే ముందు.. తక్కువ సమయంలో ఇళ్లు, కార్యాలయాల సమీపంలో వీటిని ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bajaj Platina on EMI: ఫుల్ ట్యాంక్‌ చేస్తే 800 కి.మీ.లు నాన్‌స్టాప్ రైడింగ్! బజాజ్ ప్లాటినా కొనేందుకు 2,000తో EMI ప్లాన్ ఇదే!
ఫుల్ ట్యాంక్‌ చేస్తే 800 కి.మీ.లు నాన్‌స్టాప్ రైడింగ్! బజాజ్ ప్లాటినా కొనేందుకు 2,000తో EMI ప్లాన్ ఇదే!
Ola Roadster vs Yazdi Roadster: ఓలా రోడ్‌స్టర్‌ యాజ్డీ రోడ్‌స్టర్‌ల మధ్య తేడా ఏంటీ? ఎవరికి ఏ బైక్ సరిపోతుంది?
ఓలా రోడ్‌స్టర్‌ యాజ్డీ రోడ్‌స్టర్‌ల మధ్య తేడా ఏంటీ? ఎవరికి ఏ బైక్ సరిపోతుంది?
రూ.10 లక్షల లోపే టర్బో పవర్‌ కార్లు - మీ బడ్జెట్‌లోనే మోర్‌ పవర్‌ & పెర్ఫార్మెన్స్‌
టర్బో ఇంజిన్‌ ఉన్నా ఈ కార్ల రేటు రూ.10 లక్షల లోపే, ఇప్పుడు 'మోర్‌ పవర్‌' మీ చేతుల్లో!
Hero Destini 110 డైలీ యూజ్‌కు బాగానే ఉంటుందా? నిజ జీవిత మైలేజ్‌ వివరాలు ఇవే
హీరో డెస్టిని 110 మైలేజ్‌ టెస్ట్‌ - నిజంగా సిటీలో ఎంత ఇస్తుంది? హైవే ఎక్కితే ఎంత వస్తుంది?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget