అన్వేషించండి

E20 పెట్రోల్‌ను చవగ్గా ఇవ్వడం సర్కారు లక్ష్యం కాదట - ఇంకా ఏం చెప్పిందంటే?

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమలులోకి వచ్చినా ధర ఎందుకు తగ్గలేదనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇథనాల్ కొనుగోలు ధర, ముడి చమురు దిగుమతులు లాంటి లెక్కలు చెప్పింది.

E20 Petrol Price: దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో E20 పెట్రోల్ సరఫరా లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే ప్రతి లీటర్ పెట్రోల్‌లో ఐదో వంతు ఇథనాల్ ఉంటే, పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'తరచుగా అడిగే ప్రశ్నలు' (FAQ)లో... E20 పెట్రోల్ లక్ష్యం ధర తగ్గించడం కాదని, దేశాన్ని దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడకుండా చేయడం & అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని వినియోగదారులపై తగ్గించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ప్రస్తుతం ప్రభుత్వం ఇథనాల్‌ను రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు చేస్తోందని తెలిపింది. మొక్కజొన్న ఆధారిత ఇథనాల్‌ను లీటరుకు సుమారు రూ.71.86 ధరకు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి GST, రవాణా, నిల్వ & డిపో నిర్వహణ ఖర్చులు అదనంగా ఉంటాయని వివరించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి ఇన్విక్టో ఆన్-రోడ్ ధర ఎంత? వేరియంట్లు, మైలేజ్ ఫీచర్ల పూర్తి వివరాలు!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్నప్పుడు E20 పెట్రోల్ తయారీ ఖర్చు సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువగానే ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 నుంచి 130 డాలర్లకు చేరితే పరిస్థితి పూర్తిగా మారుతుందని, అప్పుడు ఇథనాల్ మిశ్రమ ఇంధనం మరింత ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుతుందని పేర్కొంది.

కాబట్టి E20 పెట్రోల్ ధర E10 లేదా సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఎందుకు లేదనే దానికంటే, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా భారతదేశ వినియోగదారులను ఎలా రక్షించగలిగిందన్నదే అసలు ప్రశ్న అని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

ప్రస్తుతం దేశంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్‌లో దాదాపు 20 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లోని బ్రెంట్ క్రూడ్ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు లేదా రవాణా అంతరాయాలతో ప్రతిరోజూ మారదని కేంద్రం తెలిపింది. దీంతో ఇంధన ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఆడవాళ్లు కాళ్లను సులభంగా నేలపై ఉంచగల టూవీలర్లు - తక్కువ సీట్ హైట్‌ ఉన్న 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు విదేశీ మారక ద్రవ్య వ్యయం కూడా గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు దేశ ఇంధన భద్రత కూడా బలోపేతమైందని వివరించింది.

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశారు. అలాగే 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతిని భర్తీ చేయడంతో పాటు సుమారు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించారు. రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని తెలిపింది.

ఇంధన ధరల పోలికను కూడా కేంద్రం వెల్లడించింది. జూన్ 2022 నుంచి జూన్ 2026 వరకు ఢిల్లీలో పెట్రోల్ ధర కేవలం 5.58 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది. ఇదే కాలంలో పాకిస్థాన్‌లో 39.77 శాతం, శ్రీలంకలో 36.66 శాతం, నేపాల్‌లో 20.35 శాతం, బంగ్లాదేశ్‌లో 42.69 శాతం పెరిగినట్లు పేర్కొంది. డీజిల్ ధరలు కూడా పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా పెరిగాయని వెల్లడించింది.

ఇటీవల పశ్చిమ ఆసియా సంక్షోభం సమయంలో కూడా భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని కేంద్రం తెలిపింది. మార్చి నుంచి జూన్ 2026 మధ్య ఢిల్లీలో పెట్రోల్ ధర 7.76 శాతం మాత్రమే పెరిగిందని, ఇదే సమయంలో పాకిస్థాన్‌, శ్రీలంక‌, నేపాల్‌ & బంగ్లాదేశ్‌లలో ధరలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది.

E20 పెట్రోల్‌ వల్ల వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఖండించిన విషయం తెలిసిందే. మైలేజ్ 3-5% వరకు తగ్గే అవకాశం ఉందని మాత్రం సర్కారు ఒప్పుకుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
ముగ్గురు కుటుంబ సభ్యులు, ఒక పెట్‌కు హ్యాపీగా సరిపోయే బెస్ట్ ఫ్యామిలీ కారు ఏది?
సిటీ ట్రాఫిక్‌కూ, హైవే ట్రిప్‌లకూ బెస్ట్ ఫ్యామిలీ కారు ఇదే.. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ భద్రత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget