అన్వేషించండి

E20 పెట్రోల్‌ను చవగ్గా ఇవ్వడం సర్కారు లక్ష్యం కాదట - ఇంకా ఏం చెప్పిందంటే?

దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ అమలులోకి వచ్చినా ధర ఎందుకు తగ్గలేదనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇథనాల్ కొనుగోలు ధర, ముడి చమురు దిగుమతులు లాంటి లెక్కలు చెప్పింది.

E20 Petrol Price: దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో E20 పెట్రోల్ సరఫరా లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా అమలు చేస్తోంది. అయితే ప్రతి లీటర్ పెట్రోల్‌లో ఐదో వంతు ఇథనాల్ ఉంటే, పెట్రోల్ ధర ఎందుకు తగ్గడం లేదనే సందేహం చాలా మందిలో ఉంది. ఈ ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది.

మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'తరచుగా అడిగే ప్రశ్నలు' (FAQ)లో... E20 పెట్రోల్ లక్ష్యం ధర తగ్గించడం కాదని, దేశాన్ని దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడకుండా చేయడం & అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావాన్ని వినియోగదారులపై తగ్గించడం ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.

ప్రస్తుతం ప్రభుత్వం ఇథనాల్‌ను రైతులకు గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు చేస్తోందని తెలిపింది. మొక్కజొన్న ఆధారిత ఇథనాల్‌ను లీటరుకు సుమారు రూ.71.86 ధరకు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనికి GST, రవాణా, నిల్వ & డిపో నిర్వహణ ఖర్చులు అదనంగా ఉంటాయని వివరించింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి ఇన్విక్టో ఆన్-రోడ్ ధర ఎంత? వేరియంట్లు, మైలేజ్ ఫీచర్ల పూర్తి వివరాలు!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 70 డాలర్ల వద్ద ఉన్నప్పుడు E20 పెట్రోల్ తయారీ ఖర్చు సాధారణ పెట్రోల్ కంటే ఎక్కువగానే ఉంటుందని కేంద్రం తెలిపింది. అయితే ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 120 నుంచి 130 డాలర్లకు చేరితే పరిస్థితి పూర్తిగా మారుతుందని, అప్పుడు ఇథనాల్ మిశ్రమ ఇంధనం మరింత ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుతుందని పేర్కొంది.

కాబట్టి E20 పెట్రోల్ ధర E10 లేదా సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఎందుకు లేదనే దానికంటే, ప్రపంచ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా భారతదేశ వినియోగదారులను ఎలా రక్షించగలిగిందన్నదే అసలు ప్రశ్న అని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

ప్రస్తుతం దేశంలో విక్రయించే ప్రతి లీటర్ పెట్రోల్‌లో దాదాపు 20 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్ ఉంటుంది. ఈ ఇథనాల్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లోని బ్రెంట్ క్రూడ్ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు లేదా రవాణా అంతరాయాలతో ప్రతిరోజూ మారదని కేంద్రం తెలిపింది. దీంతో ఇంధన ధరల్లో స్థిరత్వం కొనసాగుతోందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: ఆడవాళ్లు కాళ్లను సులభంగా నేలపై ఉంచగల టూవీలర్లు - తక్కువ సీట్ హైట్‌ ఉన్న 10 ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడంతో పాటు విదేశీ మారక ద్రవ్య వ్యయం కూడా గణనీయంగా తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు దేశ ఇంధన భద్రత కూడా బలోపేతమైందని వివరించింది.

కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేశారు. అలాగే 316 లక్షల మెట్రిక్ టన్నుల ముడి చమురు దిగుమతిని భర్తీ చేయడంతో పాటు సుమారు 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించారు. రైతులకు రూ.1.66 లక్షల కోట్లకు పైగా ఆదాయం చేరిందని తెలిపింది.

ఇంధన ధరల పోలికను కూడా కేంద్రం వెల్లడించింది. జూన్ 2022 నుంచి జూన్ 2026 వరకు ఢిల్లీలో పెట్రోల్ ధర కేవలం 5.58 శాతం మాత్రమే పెరిగిందని తెలిపింది. ఇదే కాలంలో పాకిస్థాన్‌లో 39.77 శాతం, శ్రీలంకలో 36.66 శాతం, నేపాల్‌లో 20.35 శాతం, బంగ్లాదేశ్‌లో 42.69 శాతం పెరిగినట్లు పేర్కొంది. డీజిల్ ధరలు కూడా పొరుగు దేశాలతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువగా పెరిగాయని వెల్లడించింది.

ఇటీవల పశ్చిమ ఆసియా సంక్షోభం సమయంలో కూడా భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల పరిమితంగానే ఉందని కేంద్రం తెలిపింది. మార్చి నుంచి జూన్ 2026 మధ్య ఢిల్లీలో పెట్రోల్ ధర 7.76 శాతం మాత్రమే పెరిగిందని, ఇదే సమయంలో పాకిస్థాన్‌, శ్రీలంక‌, నేపాల్‌ & బంగ్లాదేశ్‌లలో ధరలు గణనీయంగా పెరిగాయని వెల్లడించింది.

E20 పెట్రోల్‌ వల్ల వాహనాల ఇంజిన్‌లు దెబ్బతింటాయనే ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఖండించిన విషయం తెలిసిందే. మైలేజ్ 3-5% వరకు తగ్గే అవకాశం ఉందని మాత్రం సర్కారు ఒప్పుకుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

హోండా షైన్‌ 125 ఆన్‌రోడ్‌ రేటు ఎంత? కేవలం రూ.10 వేల డౌన్‌పేమెంట్‌తో 3, 4, 5 ఏళ్ల EMI ప్లాన్స్‌
ఈ పండక్కి Honda Shine 125 కొనాలనుకుంటే లోన్‌ ఎంత వస్తుంది? EMI ఎంత పడుతుంది?
లెవెల్‌ 2 ADAS ఫీచర్లున్న కార్లు మిడిల్‌క్లాస్ బడ్జెట్‌లోనే! ఈ 10 మోడళ్లలో మీకు ఏది నచ్చింది?
జర్నీ టైమ్‌లో అదనపు రక్షణ ఇచ్చే ADAS కార్లు.. మిడిల్‌క్లాస్‌ బడ్జెట్‌లోనే కొనవచ్చు!
రూ.9 లక్షల నుంచే హ్యుందాయ్ కొత్త SUV.. ప్రీమియం కారును తలపించే ఫీచర్లు!
మిడిల్‌క్లాస్ కోసం హ్యుందాయ్ మోడ్రన్ కారు.. క్రెటా కంటే తక్కువ ధరకే కొత్త SUV!
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
APPSC Job Notifications: ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
ఏపీపీఎస్సీ జాబ్ నోటిఫికేషన్లు విడుదల.. 20 శాఖలకు సంబంధించి పోస్టులు భర్తీ
Transgender Co-option Members: తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
తెలంగాణ చారిత్రాత్మక నిర్ణయం - 9 మున్సిపల్ కార్పొరేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు కో-ఆప్షన్ పదవులు! మార్పు వస్తుందా?
ACC Trophy Standoff: పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
పహల్గామ్ బాధితుల కోసమే ట్రోఫీని తిరస్కరించాం.. నఖ్వీ తీరుపై మండిపడ్డ  సైకియా, త్వరలోనే భారత్‌కు రెండు కప్పులు
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
మొబైల్ సిమ్ పోర్టింగ్ తరహాలో FASTagకూ పోర్టింగ్.. స్టిక్కర్‌ మార్చకుండానే బ్యాంక్‌ను ఎలా మార్చుకోవాలంటే?
FASTag బ్యాంక్ మీకు నచ్చలేదా? ఇక స్టిక్కర్ మార్చే పని లేకుండానే బ్యాంక్‌ను మార్చేయొచ్చు
Jai Jai Ram Song: రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
రామాయణ నుంచి 'జయ జయ రామ్' సాంగ్ రిలీజ్... లిరికల్ వీడియో ఎలా ఉందో చూశారా?
Trophy Celebrations Viral Video: పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
పాక్ బోర్డు చీఫ్‌కు మరోసారి టీమ్ ఇండియా షాక్.. వాటర్ బాటిల్‌తో హర్మన్‌ప్రీత్ సేన వినూత్న సంబరాలు
AP Recruitment Age Limit: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నాన్-యూనిఫాం పోస్టులకు ఏజ్ లిమిట్ పెంపు
Embed widget