అన్వేషించండి

Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్

Andhra Pradesh | తిరుమల లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు దారుణమైన వ్యాఖ్యలు చేసి, వందల కోట్ల మంది హందువుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

YV Subba Reddy challengs AP CM Chandrababu over Tirumala Laddu Row | అమరావతి: తిరుమల పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, వైఎస్ జగన్ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, అలాంటి ఆరోపణలు చేయరంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివ్య క్షేత్రం అయిన తిరుమల (Tirumula Temple) పవిత్రతను, వందల కోట్ల హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడన్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయన్నారు. 

రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా వెనుకాడరని.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో నిరూపితం అయిందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదంపై ఎలాంటి అవకతవకలు జరగలేదని నేను, నా కుటుంబం ఆ దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే విధంగా సీఎం చంద్రబాబుచ నారా లోకేష్‌లు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.

 

ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు..

మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. 'తిరుమలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అపవిత్రం చేసింది. ఆఖరికి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపిన దారుణ పరిస్థితి ఉంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైసీపీ ప్రభుత్వం వాడింది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు చేసింది. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీశారు.  నాణ్యత లేని పదార్థాలతో లడ్డూను తయారు చేసి, దేవుడి ప్రసాదాలను కూడా అపవిత్రం చేశారు.

గతంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడితే.. కూటమి అధికారంలోకి రాగానే  నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నాం. వైసీపీ గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడింది. తిరుమలలో ఇలా తప్పులు చేసి, డబ్బు దండుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా శిక్ష పడాల్సిందే. అన్నా క్యాంటీన్‌ రద్దు చేసి దుర్మార్గమైన పని చేశారు జగన్. జగన్‌ సీఎంగా ఉన్న సమయంలోనే వాలంటీర్ల గడువు ముగిసినా రెన్యువల్‌ చేయలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టం. కూటమి ప్రభుత్వంలో ఒక్క తప్పు చేయడానికి కూడా వీల్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ' హెచ్చరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Chandrababu on Jagan: ఇంకా నయం వాటికన్ అనలేదు - వైసీపీలో అందరూ సైకోలే - చంద్రబాబు సైటైర్లు
ఇంకా నయం వాటికన్ అనలేదు - వైసీపీలో అందరూ సైకోలే - చంద్రబాబు సైటైర్లు
Chandra Babu: మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి క్లాస్‌! తండ్రి జోక్యం ఎక్కువైందని చీవాట్లు!
Cases against YSRCP leaders: రోజా , తోపుదుర్తి వంటి వారిపై విచారణలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ప్రభుత్వం వారిపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందా?
రోజా , తోపుదుర్తి వంటి వారిపై విచారణలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? ప్రభుత్వం వారిపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తోందా?

వీడియోలు

Gujarat Victory by One Run vs DC | ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విక్టరీ
Gujarat Victory Over Delhi IPL 2026 | ఢిల్లీపై గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ
Delhi Capitals Bowlers Come Back IPL 2026 | ఢిల్లీ బౌలర్ల స్ట్రాంగ్ కమ్ బ్యాక్
Reason for CSK Failures in IPL 2026 | సీఎస్కే కోచ్‌పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు
IPL 2026 DC vs GT Highlights | ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫస్ట్ విక్టరీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagityala KTR: జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
జగిత్యాలలో జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ - బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం
Sharmila: 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్ లు కట్టుకున్నారు - మావిగన్ జోకర్ జగన్ - వైఎస్ షర్మిలా ఘాటు విమర్శలు
Dacoit First Review: డెకాయిట్ ఫస్ట్ రివ్యూ... సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటంటే?
డెకాయిట్ ఫస్ట్ రివ్యూ... సినిమా చూశాక రాహుల్ రవీంద్రన్ రియాక్షన్ ఏమిటంటే?
Viral News: భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
భర్త అప్పు చెల్లించలేదని వృద్ధురాలైన భార్యను చెట్టుకు కట్టేశారు! సంగారెడ్డి జిల్లాలో దారుణం!
Vishwambhara Release Date : మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్? - ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడినట్లేనా...
మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్? - ఫ్యాన్స్ వెయిటింగ్‌కు చెక్ పడినట్లేనా...
Adilabad Airport: ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
ఆదిలాబాద్ జిల్లా వాసులకు గుడ్ న్యూస్! ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన!
Madhubala Biopic : మధుబాల బయోపిక్‌లో యంగ్ హీరోయిన్... సాయి పల్లవి బదులుగా?
మధుబాల బయోపిక్‌లో యంగ్ హీరోయిన్... సాయి పల్లవి బదులుగా?
MP Viral News: ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
ఏడాదిన్నర బాలుడి గొంతులో ఎగిరిపడ్డ చేప! ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులు!
Embed widget