అన్వేషించండి

Vijayasai Reddy: అమిత్ షా వ్యాఖ్యలను లైట్ తీసుకున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. అవినీతి జరిగి ఉండే రిపోర్ట్ లను బయట పెట్టాలి కదా అని విజయ సాయి వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి లైట్ తీసుకున్నారు. అవినీతి జరిగి ఉండే రిపోర్ట్ లను బయట పెట్టాలి కదా అని విజయ సాయి వ్యాఖ్యానించారు.

లైట్ తీసుకున్న ఎంపీ విజయసాయిరెడ్డి...
రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమమన్వయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే రాజకీయాలు వేరు, ప్రభుత్వాలు వేరని ఆయన అన్నారు. కేంద్రానికి రాష్ట్రం, రాష్ట్రానికి కేంద్ర సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ వేరు, ప్రభుత్వం వేరన్నారు.రెండు ప్రభుత్వాలు మధ్య ఎప్పటికి సత్సంబంధాలు ఉంటాయని తెలిపారు.అవినీతి ఎక్కడ జరిగిందో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా లు చెప్పలేకపోయారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు ఆడిటింగ్ నిర్వహిస్తున్నారు కదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. వాళ్ళ ఆడిటింగ్ లో ఎక్కడైనా అవినీతి జరిగిందని గుర్తించారా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. అవినీతి అనేది సాధారణంగా చేసే ఆరోపణల్లో భాగంగా చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆ విషయాలపై ఎందుకు మాట్లాడలేదు..
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణ రద్దు పై ప్రకటన చెయ్యలేదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి అన్నారు. విభజన చట్టంలో హామీలు నెరవేర్చలేదని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ తోను పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు.

చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడతారా..
తెలుగు దేశం అధినేత చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడే అవకాశం లేదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడాల్సిన అవసరం బీజేపీకి ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అన్ని పార్టీలు ఎన్నికల కోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటాయని అది రాజకీయంగా జరిగే ప్రక్రియగానే చూడాలని సూచించారు. చంద్రబాబు మిని మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. నవంబర్ లో ఇతర రాష్ట్రాలకు చెందిన ఎన్నికల మేనిఫెస్టోను కాపి కొట్టి చంద్రబాబు మేనిస్టో రెండు ను విడదల చేస్తారేమో అని వ్యాఖ్యానించారు.

పరిపాలన రాజధాని విశాఖ...
విశాఖపట్నం కేంద్రంగా ఖచ్చితంగా పరిపాలన రాజధాని తరలిస్తామని విజయ సాయిరెడ్డి స్పష్టం చేశారు. రెండు నెలల కిందటే పరిపాలన రాజధానికి కావాల్సిన కార్యాలయాలను గుర్తించామని ఆయన అన్నారు.విశాఖ పట్టణం తరలింపుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకున్నామని, విధి విధానాల పై జగన్ కూడ త్వరలో ప్రకటన చేస్తారని తెలిపారు.  విశాఖ పట్టణాన్ని పరిపానా రాజధాని చేసి తీరుతామని వెల్లడించారు.

ప్యాకేజీతో సంబంధం లేకుండా నిధులు..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నిధులకు విభజన ప్యాకేజికి సంబందం లేదని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ప్రకటించిన ప్యాకేజీతో సంబంధం లేకుండా రెవెన్యూ లోటు కింద 10,400 కోట్లు కేంద్రం నుండి నిధులను సాధించామని చెప్పారు. కేంద్రం నుండి త్వరలోనే మరో నాలుగు వేల కోట్ల రూపాయలు కూడ నిధులు విడుదల అయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఆ తరువాతే పోలవరం నిధులు...
కేంద్ర క్యాబినెట్ ఆమోదం తర్వాత పోలవరం ప్రాజెక్టుకి నిధులు వస్తాయని రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం నుండి నిధులను తీసుకువచ్చి పోలవరం ను పూర్తి చేసే బాధ్యతను సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నాని, దాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు.

ప్రతి కార్యకర్త కీలకం...
వరుసగా అనుభంధ సంఘాలతో విజయ సాయిరెడ్డి సమావేశం అవుతున్నారు. ఈ నేపద్యంలో కార్యకర్తల నుండి అభిప్రాయాలు  తీసుకుంటున్నామని, ఎన్నికలలోపు ప్రతి కార్యకర్త ని సంతృప్తి పరుస్తామని విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
One Fast Every Month: ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
ప్రతి నెలా ఒక ఉపవాసం - ఢిల్లీలో అంతర్జాతీయ ప్రజాసంక్షేమ సదస్సు - పిలుపునివ్వనున్న బాబా రాందేవ్
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Embed widget