అన్వేషించండి

YCP Changed stand on Amaravati: వైసీపీ యూటర్న్ - అమరావతికి మద్దతుగా మారుతున్న స్వరం -3 రాజధానులు ప్రజలు వద్దన్నారన్న సజ్జల !

Amaravati: అమరావతికి మద్దతుగా వైసీపీ స్వరం మారుతోంది. ప్రజలు మూడు రాజధానులు వద్దన్నారని అందుకే తాము కూడా పునరాలోచిస్తామని అంటున్నారు.

YSRCP tone is changing in support of Amaravati: మూడు రాజధానుల పేరుతో చేసిన రాజకీయం ఘోరమైన ఓటమిని తెచ్చిపెట్టడంతో వైసీపీ పునరాలోచనలో పడింది. ఓ వైపు అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతూండటం, నిధుల కొరత లేకపోవడంతో మరో మూడేళ్లలో అమరావతి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమైన ప్రభుత్వ భవనాలన్నీ పూర్తవుతాయి. మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులును తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ, యూనివర్శిటీలు సహా పెద్ద పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.

అమరావతి రాజధానిగా కొనసాగుతుంది: సజ్జల

YSRCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ మరియు మాజీ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, "వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే నివసిస్తారు, విశాఖపట్నంకు వెళ్లరు" అని వ్యాఖ్యానించారు.   గతంలో విశాఖపట్నంకు మారాలని ఆలోచించామని, కానీ అది సాధ్యం కాలేదనన్నారు. మూడు రాజధానులను ప్రజలు వద్దన్నారని అందుకే తాము పునరాలోచిస్తున్నామన్నారు.  "లక్షల కోట్ల అప్పులు చేసి అమరావతి కట్టడానికి మేము వ్యతిరేకమే. బెజవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తే రెండు నగరాలు బాగా అభివృద్ధి చెందేవి" అని సజ్జల వ్యాఖ్యానించారు.  

అమరావతిని కొండవీటి వాగులో నిర్మిస్తున్నారు : అంబటి రాంబాబు
 
 TDP ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు   తన అనుచరులకు మాత్రమే ప్రయోజనం చేయాలని కుట్ర పన్నారు. మేము మళ్లీ రాజకీయంలోకి వస్తే, అమరావతి ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తాము, కానీ రాజధాని భావనను మార్చకుండా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. కొండవీటి వాగులో అమరావతిని నిర్మిస్తున్నారని.. మునిగిపోయే చోట నిర్మిస్తున్నారన్నారు.  అమరావతి ఒక్కటే రాజధాని కాదు .. గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము .. అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు. 

అమరావతికి మద్దతుగా వైసీపీ అధికారిక ప్రకటన చేస్తుందా ?

రాజధాని అంశంపై  YSRCPలో గందరగోళం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. మూడు రాజధానులు వదిలేసి, అమరావతిని ఒప్పుకున్నట్టు కనిపించడంతో, పార్టీ కార్యకర్తలు తమ విధానం మారిందా అని వాకబు చేస్తున్నారు. అయితే పార్టీ నేతలు అమరావతి రైతుల్ని మభ్యపుచ్చడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారని .. గతంలోనూ జగన్ తాను అమరావతిలోనే ఉంటానని చెప్పారని అంటున్నారు. వైసీపీ గతంలో అమరావతినే రాజధానిగా ఉంటుందని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు రాజధానులు అనడం వల్ల ప్రజలు నమ్మకం కోల్పోయారు. మరోసారి అదే మాట చెప్పినా నమ్మరని టీడీపీ నేతలంటున్నారు.           

                   

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్
రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Fact Check: భార్య ఆనందాన్నిచ్చే ఆటబొమ్మ...! జగద్గురు రాంభద్రాచార్య చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
భార్య ఆనందాన్నిచ్చే ఆటబొమ్మ...! జగద్గురు రాంభద్రాచార్య చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 81 రివ్యూ... ఇంటి దొంగల గుట్టు బయట పెట్టిన బిగ్ బాస్... బెడిసికొట్టిన సంజన ప్లాన్... చివరి కెప్టెన్సీ కంటెండర్లు వీళ్ళే
బిగ్‌బాస్ డే 81 రివ్యూ... ఇంటి దొంగల గుట్టు బయట పెట్టిన బిగ్ బాస్... బెడిసికొట్టిన సంజన ప్లాన్... చివరి కెప్టెన్సీ కంటెండర్లు వీళ్ళే
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్
రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Fact Check: భార్య ఆనందాన్నిచ్చే ఆటబొమ్మ...! జగద్గురు రాంభద్రాచార్య చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
భార్య ఆనందాన్నిచ్చే ఆటబొమ్మ...! జగద్గురు రాంభద్రాచార్య చేసిన వ్యాఖ్యల్లో నిజమెంత?
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 81 రివ్యూ... ఇంటి దొంగల గుట్టు బయట పెట్టిన బిగ్ బాస్... బెడిసికొట్టిన సంజన ప్లాన్... చివరి కెప్టెన్సీ కంటెండర్లు వీళ్ళే
బిగ్‌బాస్ డే 81 రివ్యూ... ఇంటి దొంగల గుట్టు బయట పెట్టిన బిగ్ బాస్... బెడిసికొట్టిన సంజన ప్లాన్... చివరి కెప్టెన్సీ కంటెండర్లు వీళ్ళే
iphone 17 Price Hike: భారీ డిమాండ్‌తో ఐఫోన్ 17 ధరలకు రెక్కలు! ఎంత మేర పెరుగుతాయంటే..
భారీ డిమాండ్‌తో ఐఫోన్ 17 ధరలకు రెక్కలు! ఎంత మేర పెరుగుతాయంటే..
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్! SCR 42 ప్రత్యేక రైళ్లను పొడిగించింది: మీ గమ్యస్థానాలకు చేరేందుకు రెడీ అవ్వండి!
Embed widget