News
News
వీడియోలు ఆటలు
X

YS Viveka Case : విచారణకు మళ్లీ అవినాష్ రెడ్డి డుమ్మా - సీబీఐ సీరియస్ !

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. రాలేనని ఆయన రాసిన లేఖను సీబీఐ తిరస్కరించింది.

FOLLOW US: 
Share:

 

YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరు కాలేదు. సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు పులివెందుల నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన ఉదయం పది గంటల సమయంలో సీబీఐ విచారణకు బయలుదేరారు. అయితే అదే సమయంలో ఆయనకు పులివెందుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆయన తల్లి అనారోగ్యంతో పులివెందుల ఆస్పత్రిలో చేరారన్న సమాచారం వచ్చింది. దీంతో ఆయన సీబీఐ విచారణకు రాలేనని.. తన తల్లి ఆరోగ్యం బాగోలేకపోవడంతో పులివెందులకు వెళ్తున్నానని సీబీఐ అధికారులకు లేఖ రాసి .. హైదరాబాద్ నుంచి వెళ్లిపోయారు. ఆయన పులివెందుల వెళ్తున్నారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే అవినాష్ రెడ్డి రాసిన లేఖ విషయంలో సీబీఐ అధికారులు సానుకూలంగా స్పందించలేదు. అవినాష్ రెడ్డి తీరుపై సీబీఐ సీరియస్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. 

Also Read: అన్నయ్య! అన్నమయ్య డ్యామ్‌ ఎప్పుడు? ఉదయాన్నే వైసీపీకి టాస్క్ ఫిక్స్ చేసిన పవన్

మరో వైపు సీబీఐ కోర్టు వద్ద అవినాష్ రెడ్డి అనచరులు మీడియా ప్రతినిధులపై దాడులు చేశారు. అవినాష్ రెడ్డి విచారణకు వస్తారని తెలియడంతో పలువురు మీడియా సంస్థల ప్రతినిధులు వచ్చారు. అక్కడకు పెద్ద ఎత్తున పులివెందుల నుంచి వచ్చిన అవినాష్ రెడ్డి అనుచరులు కూడా గుమికూడారు. అవినాష్ రెడ్డి రావడం లేదని విషయం తెలిసిన తర్వాత మీడియా కవరేజీ ఇస్తున్న వాహనాలపై దాడి చేశారు. ఓ తెలుగు మిడియా చానల్ వాహనాన్ని.. కెమెరాలను ధ్వంసం చేశారు. ఇద్దరు ప్రతినిధుల్ని కూడా గాయపరిచారు. 

మరో వైపు  సీబీఐ అధికారులు కూడా వెంటనే పులివెందుల చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఓ సీబీఐ బృందం కడపలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.  సాయంత్రంలోపు పులివెందులలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని పులివెందులలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ చేస్తారనే భయంతోనే అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కావడం లేదని చెబుతున్నారు. మూడు రోజుల కిందట కూడా వ్యక్తిగత కారణాల పేరు చెప్పి విచారణకు  హాజరు కాలేదు.. వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఊరట లభించలేదు. విచారణకు రాలేదు. 

అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐకి చట్ట పరమైన అడ్డంకులు ఏమీ లేవు. అయితే అవినాష్ రెడ్డిని ఇతర నిందితుల్ని అరెస్ట్ చేసినట్లుగా చేయలేదు.  అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తెల్లవారుజామునే ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. కానీ అవినాష్ రెడ్డి విషయంలో నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తున్నారు. ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ జరిపితే వివరాలు తెలుస్తాయని కోర్టులో సీబీఐ చెప్పింది. అయినా వ్యూహాత్మకంగానే అరెస్ట్ చేయలేదన్న వాదన వినిపిస్తోంది.  విచారణకు పిలిచినప్పుడల్లా రాకపోతూండటంతో.. ఆయన విచారణకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు చెబుతోంది. అయినప్పటికీ అవినాష్ రెడ్డి  రకరకాల కారణాలతో డుమ్మా కొడుతున్నారు.     

Also Read: ఓ వైపు లోకేష్ - మరో వైపు చంద్రబాబు ! ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశమే హైలెట్ అవుతోందా ?

Published at : 19 May 2023 10:59 AM (IST) Tags: CBI Case ABP Desam breaking news YS Avinash Reddy YS Viveka Murder Case Avinash Reddy investigation

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Mini Jamili Elections : మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Mini Jamili Elections :  మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

Weather Latest Update: 48 గంటల్లో కేరళలోకి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉందంటే?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !

Lokesh Rayalaseema Declaration :  రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే  రత్నాల సీమే !

టాప్ స్టోరీస్

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

YS Viveka Case : వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

YS Viveka Case :  వివేకా లెటర్‌కు నిన్ హైడ్రిన్ టెస్టుకు ఓకే - కోర్టు అనుమతి

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!