అన్వేషించండి

YSRCP: దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? టీడీపీ మాల వర్గాల సమావేశంపై మంత్రి నాగార్జున కౌంటర్

టీడీపీ మాలల సంక్షేమం సాధ్యం అయ్యిందని , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. మరో వైపున అసలు మాలల పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

TDP Mala Meeting: తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమావేశం రాజకీయ విమర్శలకు కేంద్రం అయ్యింది. తెలుగు దేశం హయాంలోనే మాలల సంక్షేమం సాధ్యం అయ్యిందని , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. మరో వైపున అసలు మాలల పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో మాలల సమావేశం...
వైసీపీ పాలనలో నాలుగేళ్ళ నుంచి మాలలపై జరుగుతున్న దాడులు,  దౌర్జన్యాలు వారికి జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం, మర్యాద దక్కిందని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కుల్ని కల్పించారని, అయితే స్వాతంత్ర్యం వచ్చాక  35 ఏళ్లు దేశంలో రాజ్యాంగం సరిగా అమలు జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన దళిత వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని, టీడీపీ నిజాయితీ నిరూపించుకుంటుందని అన్నారు. గత ఎన్నికల్లో దళితులు గంపగుత్తగా జగన్ కి ఓట్లు వేసి గెలిపించారని,  ఇప్పుడు కూడా  ఆ వర్గాలు తనకే ఓట్లు వేస్తాయన్న భావనలో జగన్ ఉన్నారని, అయితే మరోసారి దళితులు మోసపోవటానికి రెడీగా లేరన్నారు. దళితుల్లో చైతన్యం పెరిగిందని, జగన్ ని ఎప్పుడూ గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసీపీ తప్పుల్ని ప్రశ్నించినందుకు మహాసేన రాజేష్ ని వేధింపులకు గురిచేశారని,  ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించకూడదా.. రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా అని ఆయన ప్రశ్నించారు. మాల, మాదిగలు, బలహీన వర్గాలు గౌరవంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.

జగన్ చేసేది అంతా దగా...
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అని కులాలు దగాపడ్డాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.  అందులో మాలలు ఎక్కువగా దగా పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారని, దళితుల్లో మాలలు 58 శాతం ఉన్నారని వివరించారు. దళితుల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యునిటీగా మాల సామాజిక వర్గమని పేర్కొన్నారు. 

టీడీపీ కులాల మీటింగ్ పై వైసీపీ కౌంటర్...
దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని మమ్మల్ని తీవ్రంగా అవమానించిన రోజునే చంద్రబాబు దురాలోచనను ఎస్సీ ఎస్టీ లంతా గమనించారని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. టీడీపీ కులాల వారీగా సమావేశాను నిర్వహించి, ప్రజల్లో విభేదాలను రేకెత్తిస్తోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయం పై దళిత వర్గాలు కనీసం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే సాహసం చేయలేని స్థితిలో కి నెట్టేశారని అన్నారు. సుదీర్ఘకాలం చంద్రబాబు అవమానాలు భరించి   2019 ఎన్నికలతో ఆయన్ను దళితులు పూర్తిగా దూరంపెట్టారని అన్నారు. భవిష్యత్తులో బాబు ఊసే దళిత కుటుంబాల్లో వినిపించదని సవాల్ విసిరారు.

దళితలంతా జగన్‌  వెంటే..
రాష్ట్రంలో దళిత కుటుంబాలన్నీ విద్యవైద్యం, ఆదాయపరంగా అభివృద్ధి దిశగా మారుతున్న జీవనశైలితో ఆనందంగా కనిపిస్తున్నాయని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.  ఇలాంటి వాతావరణం నచ్చని చంద్రబాబు, ఆయన్ను భుజాల పై మోసే పచ్చమీడియా కళ్లు పేలిపోతున్నాయేమోనని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం పై ఉమ్మెస్తే మీ మీదనే పడుతుందనేది చంద్రబాబు, రామోజీరావు తెలుసుకోవాలన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళిత కుటుంబాల్లోని వారంతా తన సోదరులు, మేనల్లుళ్లు అంటూ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమగా చూసుకుంటున్నారని అన్నారు. ఆనాటి మహానేత వైఎస్‌ఆర్‌ వెంట నడిచినట్టే, ఈ రోజుకు కూడా దళితజాతి బిడ్డలంతా జగన్‌  వెంట నడుస్తున్నారని అన్నారు. దళిత సోదరుల సైన్యంతో   2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీనే కైవసం చేసుకుంటుందని దీమాగా వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

JanaSainiks on Pithapuram Sabha | నాలుగు కాదు పవన్ కళ్యాణ్ కోసం 40కిలోమీటర్లైనా నడుస్తాం | ABP DesamRayapati Aruna on Pithapuram Sabha | నాగబాబుకు MLC పదవి ఎందుకో చెప్పిన రాయపాటి అరుణ | ABP DesamFood Items Menu Janasena Pithapuram Sabha | పిఠాపురం సభలో 10వేల మందికి భోజనాలు | ABP DesamJanasena Pithapuram Sabha Arrangements | పిఠాపురంలో భారీ రేంజ్ లో జనసేన సభ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News:ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
ఏప్రిల్‌లో ఏపీ రానున్న ప్రధానమంత్రి మోదీ - నవ నగరాల నిర్మాణ శంకుస్థాపనకు హాజరు
Group-3 Results: గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
గ్రూప్‌-3 ఫలితాలు విడుదల, అభ్యర్థుల మార్కుల వివరాలు అందుబాటులో - డైరెక్ట్ లింక్ ఇదే
Janasena Formation Day: పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
పిఠాపురంలో పెరిగిన జోష్, జయకేతనం సభకు భారీగా తరలివస్తున్న జనసైనికులు
Chandra Babu Latest News: గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
గ్రూప్ పాలిటిక్స్ వద్దు- వైసీపీ నేతలకు దూరంగా ఉండండి, టీడీపీ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
Tamannaah - Vijay Varma: ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
ఇద్దరి మధ్య బ్రేకప్ అంటూ ప్రచారం - హోలీ సంబరాల్లో తమన్నా, విజయ్ వర్మ.. వీడియో వైరల్
Dilruba Movie Review - 'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
'దిల్‌రూబా' రివ్యూ: ఇది కిరణ్ అబ్బవరం 'జల్సా'యే కానీ... 50 కోట్ల కలెక్షన్లు తెచ్చిన 'క' తర్వాత చేసిన సినిమా హిట్టేనా?
Viral News: చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
చేపకొరితే చెయ్యి తీసేయాల్సి వచ్చింది - టైమ్ బ్యాడ్ అయితే అంతే !
Tirumala Letters Issue: తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
తెలంగాణ నేతలకు తిరుమలలో దక్కే గౌరవం ఇదేనా, చాలా బాధాకరం: రఘునందన్ రావు
Embed widget