అన్వేషించండి

YSRCP: దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? టీడీపీ మాల వర్గాల సమావేశంపై మంత్రి నాగార్జున కౌంటర్

టీడీపీ మాలల సంక్షేమం సాధ్యం అయ్యిందని , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. మరో వైపున అసలు మాలల పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

TDP Mala Meeting: తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమావేశం రాజకీయ విమర్శలకు కేంద్రం అయ్యింది. తెలుగు దేశం హయాంలోనే మాలల సంక్షేమం సాధ్యం అయ్యిందని , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. మరో వైపున అసలు మాలల పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో మాలల సమావేశం...
వైసీపీ పాలనలో నాలుగేళ్ళ నుంచి మాలలపై జరుగుతున్న దాడులు,  దౌర్జన్యాలు వారికి జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం, మర్యాద దక్కిందని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కుల్ని కల్పించారని, అయితే స్వాతంత్ర్యం వచ్చాక  35 ఏళ్లు దేశంలో రాజ్యాంగం సరిగా అమలు జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన దళిత వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని, టీడీపీ నిజాయితీ నిరూపించుకుంటుందని అన్నారు. గత ఎన్నికల్లో దళితులు గంపగుత్తగా జగన్ కి ఓట్లు వేసి గెలిపించారని,  ఇప్పుడు కూడా  ఆ వర్గాలు తనకే ఓట్లు వేస్తాయన్న భావనలో జగన్ ఉన్నారని, అయితే మరోసారి దళితులు మోసపోవటానికి రెడీగా లేరన్నారు. దళితుల్లో చైతన్యం పెరిగిందని, జగన్ ని ఎప్పుడూ గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసీపీ తప్పుల్ని ప్రశ్నించినందుకు మహాసేన రాజేష్ ని వేధింపులకు గురిచేశారని,  ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించకూడదా.. రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా అని ఆయన ప్రశ్నించారు. మాల, మాదిగలు, బలహీన వర్గాలు గౌరవంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.

జగన్ చేసేది అంతా దగా...
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అని కులాలు దగాపడ్డాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.  అందులో మాలలు ఎక్కువగా దగా పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారని, దళితుల్లో మాలలు 58 శాతం ఉన్నారని వివరించారు. దళితుల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యునిటీగా మాల సామాజిక వర్గమని పేర్కొన్నారు. 

టీడీపీ కులాల మీటింగ్ పై వైసీపీ కౌంటర్...
దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని మమ్మల్ని తీవ్రంగా అవమానించిన రోజునే చంద్రబాబు దురాలోచనను ఎస్సీ ఎస్టీ లంతా గమనించారని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. టీడీపీ కులాల వారీగా సమావేశాను నిర్వహించి, ప్రజల్లో విభేదాలను రేకెత్తిస్తోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయం పై దళిత వర్గాలు కనీసం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే సాహసం చేయలేని స్థితిలో కి నెట్టేశారని అన్నారు. సుదీర్ఘకాలం చంద్రబాబు అవమానాలు భరించి   2019 ఎన్నికలతో ఆయన్ను దళితులు పూర్తిగా దూరంపెట్టారని అన్నారు. భవిష్యత్తులో బాబు ఊసే దళిత కుటుంబాల్లో వినిపించదని సవాల్ విసిరారు.

దళితలంతా జగన్‌  వెంటే..
రాష్ట్రంలో దళిత కుటుంబాలన్నీ విద్యవైద్యం, ఆదాయపరంగా అభివృద్ధి దిశగా మారుతున్న జీవనశైలితో ఆనందంగా కనిపిస్తున్నాయని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.  ఇలాంటి వాతావరణం నచ్చని చంద్రబాబు, ఆయన్ను భుజాల పై మోసే పచ్చమీడియా కళ్లు పేలిపోతున్నాయేమోనని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం పై ఉమ్మెస్తే మీ మీదనే పడుతుందనేది చంద్రబాబు, రామోజీరావు తెలుసుకోవాలన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళిత కుటుంబాల్లోని వారంతా తన సోదరులు, మేనల్లుళ్లు అంటూ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమగా చూసుకుంటున్నారని అన్నారు. ఆనాటి మహానేత వైఎస్‌ఆర్‌ వెంట నడిచినట్టే, ఈ రోజుకు కూడా దళితజాతి బిడ్డలంతా జగన్‌  వెంట నడుస్తున్నారని అన్నారు. దళిత సోదరుల సైన్యంతో   2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీనే కైవసం చేసుకుంటుందని దీమాగా వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati pipe burning case: అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
అమరావతి పైపుల దహనం వెనుక కుట్ర - పోలీసుల అదుపులో నిందితుడు!
AP Cabinet Meeting: ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీలో కొత్తగా 96 కోర్టులు - కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Nikhil Siddhartha : 6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
6 నెలల్లో 100 ప్రాణాలా? - వరుస యాక్సిడెంట్స్‌పై హీరో నిఖిల్ షాకింగ్ రియాక్షన్
Pemmasani warning to Jagan: ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్
ఒక్క మాటతో చంపేయగలం - జగన్‌కు కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్

వీడియోలు

Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Shane Warne 460 Crores Profil from RR | షేన్ వార్న్ కుటుంబానికి 460 కోట్ల లాభం | ABP Desam
Aryaman Birla IPL Player to RCB Owner | ఆర్సీబీ కొత్త బాస్ ఆర్యమన్ బిర్లా ఎమోషనల్ జర్నీ | ABP Desam
Ganguly Comments on Dhoni Retirement | ధోనీ రిటైర్మెంట్‌పై గంగూలీ వ్యాఖ్యలు | ABP Desam
Ben Duckett Out of IPL 2026 | ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Petrol Crisis: హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
హైదరాబాద్‌లో రోజుకు 100 ట్యాంకర్ల పెట్రోల్ ఖాళీ! ABP దేశంతో తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్  
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Co Living Culture Hyderabad : హైదరాబాద్ లో పెళ్లికి ముందైనా తరువాతైనా కోలివింగ్ బెస్ట్ అంటున్న జంటలు
Trump Warns Iran: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం- త్వరగా నిర్ణయం తీసుకోకపోతే అంతమే!
Iran Navy Chief Killed : హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
హార్మూజ్ జలసంధి కింగ్ పిన్ అంతం - ఇరాన్ నావికాదళాధిపతి మృతి - ఇక నౌకలకు అడ్డే లేదు!
Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?
Bandi Sanjay Song: బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
బండి సంజయ్ సింగ్ ఏ సాంగ్ - రిలీజ్ ఎప్పుడంటే ?
Metformin: డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్ -మెట్‌ఫార్మిన్ గురించి సంచలన విషయాలు కనిపెట్టిన సైంటిస్టులు
Telangana News: ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
ఆరోగ్యశ్రీ బకాయిలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు! 2,408 కోట్లు చెల్లించామని వెల్లడి!
Embed widget