అన్వేషించండి

YSRCP: దళితుల్లో పుట్టాలని కోరుకుంటారా? టీడీపీ మాల వర్గాల సమావేశంపై మంత్రి నాగార్జున కౌంటర్

టీడీపీ మాలల సంక్షేమం సాధ్యం అయ్యిందని , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. మరో వైపున అసలు మాలల పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

TDP Mala Meeting: తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మాలల ఆత్మీయ సమావేశం రాజకీయ విమర్శలకు కేంద్రం అయ్యింది. తెలుగు దేశం హయాంలోనే మాలల సంక్షేమం సాధ్యం అయ్యిందని , ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. మరో వైపున అసలు మాలల పేరు ఎత్తే అర్హత టీడీపీకి లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

టీడీపీ ఆధ్వర్యంలో మాలల సమావేశం...
వైసీపీ పాలనలో నాలుగేళ్ళ నుంచి మాలలపై జరుగుతున్న దాడులు,  దౌర్జన్యాలు వారికి జరుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాలల ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించిన తర్వాతే బడుగు, బలహీన వర్గాలకు ఆత్మగౌరవం, మర్యాద దక్కిందని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కుల్ని కల్పించారని, అయితే స్వాతంత్ర్యం వచ్చాక  35 ఏళ్లు దేశంలో రాజ్యాంగం సరిగా అమలు జరగలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ప్రాతిపదికన దళిత వర్గాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన అవకాశం కల్పించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నామని, టీడీపీ నిజాయితీ నిరూపించుకుంటుందని అన్నారు. గత ఎన్నికల్లో దళితులు గంపగుత్తగా జగన్ కి ఓట్లు వేసి గెలిపించారని,  ఇప్పుడు కూడా  ఆ వర్గాలు తనకే ఓట్లు వేస్తాయన్న భావనలో జగన్ ఉన్నారని, అయితే మరోసారి దళితులు మోసపోవటానికి రెడీగా లేరన్నారు. దళితుల్లో చైతన్యం పెరిగిందని, జగన్ ని ఎప్పుడూ గద్దె దించుదామా అని ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసీపీ తప్పుల్ని ప్రశ్నించినందుకు మహాసేన రాజేష్ ని వేధింపులకు గురిచేశారని,  ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నించకూడదా.. రాష్ట్రం ఏమైనా జగన్ జాగీరా అని ఆయన ప్రశ్నించారు. మాల, మాదిగలు, బలహీన వర్గాలు గౌరవంగా బ్రతకాలంటే చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు.

జగన్ చేసేది అంతా దగా...
జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అని కులాలు దగాపడ్డాయని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు.  అందులో మాలలు ఎక్కువగా దగా పడ్డారని తెలిపారు. రాష్ట్రంలో 80 లక్షల మంది దళిత ఓటర్లు ఉన్నారని, దళితుల్లో మాలలు 58 శాతం ఉన్నారని వివరించారు. దళితుల్లో సింగిల్ లార్జెస్ట్ కమ్యునిటీగా మాల సామాజిక వర్గమని పేర్కొన్నారు. 

టీడీపీ కులాల మీటింగ్ పై వైసీపీ కౌంటర్...
దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని మమ్మల్ని తీవ్రంగా అవమానించిన రోజునే చంద్రబాబు దురాలోచనను ఎస్సీ ఎస్టీ లంతా గమనించారని మంత్రి మేరుగ నాగార్జున వ్యాఖ్యానించారు. టీడీపీ కులాల వారీగా సమావేశాను నిర్వహించి, ప్రజల్లో విభేదాలను రేకెత్తిస్తోందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తమకు జరిగిన అన్యాయం పై దళిత వర్గాలు కనీసం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టే సాహసం చేయలేని స్థితిలో కి నెట్టేశారని అన్నారు. సుదీర్ఘకాలం చంద్రబాబు అవమానాలు భరించి   2019 ఎన్నికలతో ఆయన్ను దళితులు పూర్తిగా దూరంపెట్టారని అన్నారు. భవిష్యత్తులో బాబు ఊసే దళిత కుటుంబాల్లో వినిపించదని సవాల్ విసిరారు.

దళితలంతా జగన్‌  వెంటే..
రాష్ట్రంలో దళిత కుటుంబాలన్నీ విద్యవైద్యం, ఆదాయపరంగా అభివృద్ధి దిశగా మారుతున్న జీవనశైలితో ఆనందంగా కనిపిస్తున్నాయని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.  ఇలాంటి వాతావరణం నచ్చని చంద్రబాబు, ఆయన్ను భుజాల పై మోసే పచ్చమీడియా కళ్లు పేలిపోతున్నాయేమోనని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకాశం పై ఉమ్మెస్తే మీ మీదనే పడుతుందనేది చంద్రబాబు, రామోజీరావు తెలుసుకోవాలన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ దళిత కుటుంబాల్లోని వారంతా తన సోదరులు, మేనల్లుళ్లు అంటూ  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రేమగా చూసుకుంటున్నారని అన్నారు. ఆనాటి మహానేత వైఎస్‌ఆర్‌ వెంట నడిచినట్టే, ఈ రోజుకు కూడా దళితజాతి బిడ్డలంతా జగన్‌  వెంట నడుస్తున్నారని అన్నారు. దళిత సోదరుల సైన్యంతో   2024 ఎన్నికల్లో 175 స్థానాలకు 175 స్థానాలను వైఎస్‌ఆర్‌సీపీనే కైవసం చేసుకుంటుందని దీమాగా వ్యక్తం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Prasna Ravan Bail and Arrest: అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ మళ్లీ అరెస్టు! 2025 నాటి కేసులో చర్యలు!
AP TET 2026: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థులకు అలర్ట్! దరఖాస్తుల సవరణకు వన్ టైమ్ డిలీట్ ఆప్షన్! పూర్తి వివరాలు ఇవే!
Importance Of Voter List Verification: ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!
ఓటు హక్కు కేవలం రాజకీయం కాదు.. మీ రేషన్, పెన్షన్ పథకాలను శాసించే డిజిటల్ పత్రం ! సామాన్యులకు అలర్ట్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Telangana Police vs AP Police:హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
హైదరాబాద్‌లో ఏపీ పోలీసులపై క్రిమినల్‌ కేసు! కేవీ రెడ్డి అరెస్టుతో రేగిన వివాదం!
Super Subbu OTT : ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సందీప్ కిషన్ కామెడీ సిరీస్ - సూపర్ సుబ్బు ఎందుకు చూడాలంటే?
Jana Nayagan Release Date : జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
జన నాయగన్‌కు సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ - సీఎం విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: ETV Winలో కొత్త వెబ్ సిరీస్... నవ్వుల నోస్టాల్జియా బావుందా?
Isakapatnam Web Series Review - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?
Embed widget