అన్వేషించండి

YSRCP Candidates List: వైసీపీ ఫైనల్ లిస్ట్- జగన్ వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారా ? 

YSRCP News: 2019లో నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ వంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ప్రతిపక్షాలకు షాకిచ్చిన జగన్, ఈసారి సేఫ్ గేమ్ ఆడారు. బొత్స లాంటి సీనియర్లకు ఫ్యామిలీ ప్యాక్ ముట్టజెప్పారు.

Andhra Pradesh News: వైసీపీ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. ఒకటీ అరా స్థానాలు మినహా మిగతావన్నీ యథాతథంగానే ఉన్నాయి. అయితే అత్యధిక సిట్టింగ్ స్థానాల్లో మార్పులు చేసి జగన్ (YS Jagan) రికార్డ్ సృష్టించారనే చెప్పాలి. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా. 

వైసీపీ ప్రకటించిన అసెంబ్లీ స్థానాలు 175
ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు 81
వైసీపీ ప్రకటించిన ఎంపీ స్థానాలు 25
మార్పులు జరిగిన స్థాలు 18

ఎంపీ, ఎమ్మెల్యే కలిపి ఏపీలోని మొత్తం 200 స్థానాలకు గాను వైసీపీ 99 స్థానాల్లో అభ్యర్థులను మార్చేసింది. అంటే దాదాపు 50శాతం మార్పులు చేర్పులు జరిగాయన్నమాట. గతంలో ఏ పార్టీ కూడా ఈ స్థాయిలో మార్పులు చేయలేదు, కానీ తొలిసారి జగన్, ఎమ్మెల్యేల స్థానిక బలం కంటే.. తనపై రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న నమ్మకంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. అందుకే ఇక్కడివారిని అక్కడ అక్కడివారిని ఇక్కడ అంటూ విపరీతమైన ప్రయోగాలు చేశారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ షాక్ ఇచ్చారు. 14 మంది సిట్టింగ్ ఎంపీలను కూడా పక్కనపెట్టారు. 

మంత్రిగా పనిచేసినా, నెల్లూరు జిల్లా రాజకీయాలతో మాత్రమే తలమునకలై ఉన్న అనిల్ కుమార్ యాదవన్ ని రెండు జిల్లాలు దాటించేసి నర్సరావు పేట ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఎక్కడో చిత్తూరు జిల్లాలో బిజీగా ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏరికోరి ఒంగోలు తెప్పించారు. తొలిసారి విజయసాయిరెడ్డికి ప్రత్యక్ష రాజకీయాలు పరిచయం చేస్తున్నారు. ఇలా సీఎం జగన్ ఎంపీ స్థానాల్లో చాలా ప్రయోగాలే చేశారు. 

ఎమ్మెల్యే స్థానాల విషయానికొచ్చేసరికి ఏకంగా మంత్రులకు కూడా స్థాన చలనం తప్పలేదు. గుడివాడ అమర్నాథ్ ని అనకాపల్లికి దూరం చేశారు, చెల్లుబోయిన గోపాల కృష్ణ, జోగి రమేష్, విడదల రజిని, ఆదిమూలపు సురేష్.. ఇలా కొందరికి స్థాన చలనం కలిగింది. అదే సమయంలో పెద్దిరెడ్డి, రోజా, కాకాణి గోవర్దన్ రెడ్డి వంటి మంత్రులు మాత్రం తమ తమ స్థానాలను వదిలిపెట్టలేదు. మంత్రి గుమ్మనూరు జయరాంకి జగన్ చీటీ చింపేసే సరికి ఆయన చంద్రబాబు జట్టులో చేరారు. 

వలస నేతల పరిస్థితి ఏంటి..?
టీడీపీని కాదని వైసీపీలోకి వెళ్లినవారిలో మద్దాలి గిరికి మినహా మిగతా అందరికీ సీటు దక్కింది. ఇక జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కి ఎంపీగా ప్రమోషన్ ఇచ్చి రాజోలు నుంచి అమలాపురం పంపించారు జగన్. చివర్లో పార్టీలో చేరిన గొల్లపల్లి సూర్యారావు లాంటి వారికి సైతం టికెట్ ఆఫర్ చేశారు జగన్. 

గతంలో నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ వంటి ఎంట్రీలు ఈసారి పెద్దగా లేవు. 2019లో సామాన్యులకు పెద్దపీట వేసి ప్రతిపక్షాలకు షాకిచ్చిన జగన్, ఈసారి మాత్రం సేఫ్ గేమ్ ఆడారు. వారసులకు అవకాశాలిచ్చారు, బొత్స లాంటి సీనియర్లకు ఫ్యామిలీ ప్యాక్ ముట్టజెప్పారు. కొత్త మొహాలు ఉన్నా కూడా.. రాజకీయ నేపథ్యం ఉన్నవారికే ఎక్కువగా అవకాశాలిచ్చి ప్రోత్సహించారు జగన్. 

వైనాట్ 175 అంటూ బరిలో దిగుతున్న సీఎం జగన్ ఏకంగా 32మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కనపెట్టడం విశేషం. వీరిలో కొందరు పక్క పార్టీల్లో చేరిపోయినా, మిగతా వారికి మాత్రం అభ్యర్థుల ప్రకటన సమయంలో గట్టి హామీలే ఇచ్చారు. అందరికీ సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. 50 శాతం మార్పులు చేర్పులతో వైసీపీ అధినేత జగన్ చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా, లేక ఫెయిలవుతుందా వేచి చూడాలి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
AP JAC Demand: ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగుల ఆగ్రహం - పీఆర్‌సీ, ఐఆర్‌కై ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం - సచివాలయంలో నిరసనలకు రెడీ
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget