అన్వేషించండి

YSRCP Nominated Posts: వీళ్లకే నామినేటెడ్ పోస్టులు.. వైసీపీ నేతలకు పండగే పండగ!

వైసీపీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టుల్లో నియోజకవర్గ స్థాయి నేతలు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో నియోజకవర్గ స్థాయి నాయకులు.. ద్వితీయ శ్రేణి నేతలు  ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల పంపకాన్ని ఆ పార్టీ హైకమాండ్ పూర్తి చేసింది. ఈ మేరకు పదవులు పొందిన అదృష్టవంతుల జాబితాను  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మొత్తం 135 మందికి రాష్ట్ర స్థాయి పదవులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. నియోజకవర్గ స్థాయి..  నేతలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చారు. 

గత ఎన్నికల్లో వైసీపీ గెలవని 24 నియోజకవర్గాల్లోని నేతలకు ప్రాధాన్య పదవులు ఇచ్చారు. విశాఖలో .. గంటా శ్రీనివాస్‌పై పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజుతో పాటు దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు కూడా రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు. అలాగే గత ఎన్నికల్లో టిక్కెట్లు రాకపోయినా పార్టీ కోసం కష్టపడిన వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డికి మళ్లీ టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆయనకు కొనసాగింపు ఇవ్వకుండా.. స్పెసిఫైట్ అథారిటీని నియమించడంతో.. ఆయన అలిగారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో... బోర్డు మొత్తాన్ని ప్రకటించకపోయినా ఆయనకు పదవి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రాహ్మణ కార్పొరేషన్  ఛైర్మన్‌గా సుధాకర్ , ఏపీఐడీసీ ఛైర్మన్‌గా పుణ్యశీలను నియమించారు. 

ఇక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న నేతల ఆనందానికి అవధులు లేవు. అయితే ఇది వైసీపీలో కొత్త రకం చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే..  పదవులు దక్కని అనేక మంది.. ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోయే ప్రమాదం ఉంది. చాలా మంది నేతలు... తమకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారని.. తాము పార్టీ కోసం కష్టపడ్డామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు.. సామాజిక సమీకరణాలు..  ఎస్సీ, ఎస్టీ , బీసీలకు అత్యధిక  ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో చాలా మందికి పదవులు దక్కలేదు. వారు ఎలా స్పందిస్తారన్నదానిపైనే వైసీపీలో చిచ్చు రేగుతుందా?.. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది. 

నిజానికి వైసీపీ కార్యకర్తలకు ఇటీవలి కాలంలో పదవుల పందేరం జరుగుతోంది. స్థానిక ఎన్నికలతో ఎక్కువ మందికి పదవులు దక్కాయి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఏ పదవులూ లేని వారికి ... కుల కార్పొరేషన్లు పెట్టి పదవులు ఇచ్చారు. కానీ.. ఆ పదవుల కంటే పెద్ద నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్ట బెట్టారు. ఇప్పటికీ.. కొంత మంది మిగిలిపోయారు. వారికి వైసీపీ హైకమాండ్ ఎలా న్యాయం చేస్తుందనే దాన్ని బట్టి.. ఆ పార్టీ నేతలు తమ స్పందన వ్యక్తం చేసే అవకాశం ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో మారిన రాజకీయం.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో మారిన రాజకీయం.. స్థానిక ఎన్నికల్లో పొత్తుపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Allagadda Politics: ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?
ఆళ్లగడ్డలో రాజుకుంటున్న రాజకీయం - గంగుల వర్సెస్ భూమా వరుస సవాళ్లు - ఇంతకూ ఎవరిది అవినీతి?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బెంగాల్‌లో ఘోర ప్రమాదం.. స్కూల్‌ బస్సును ఢీకొట్టిన రైలు- ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Embed widget