By: ABP Desam | Updated at : 21 Jan 2022 01:52 PM (IST)
గుడివాడ టీడీపీ ఆఫీసుపై దాడి
కృష్ణా జిల్లా గడివాడ రణరంగం అయింది. సంక్రాంతి సందర్భంగా కేసినో ఏర్పాటు చేసి జూదం నిర్వహించిన అంశంపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నియమించింది. ఆ కమిటీ శుక్రవారం అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు ముందుగానే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కేసినో నిర్వహించిన... మంత్రి కొడాలి నానికి చెందిన కే- కన్వెన్షన్ సెంటర్లో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు ర్యాలీగా టీడీపీ ఆఫీసు వద్దకు వెళ్లారు. అక్కడ టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు.
మరో వైపు నిజనిర్ధారణ కమిటీని పోలీసులు గుడివాడలోకి కూడా రానీయలేదు. టీడీపీ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య ఉన్నారు. పామర్రు వద్దనే అడ్డుకున్న పోలీసులు ఒక్క కారును మాత్రమే అనుమతిస్తామన్నారు. అక్కడ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వీరందర్నీ గుడివాడలోకి రాక ము వద్దనే అరెస్ట్ చేసి తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ నేత బొండా ఉమ కారుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు . దీంతో ారు ధ్వంసం అయింది.
ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తారని తెలిసినా పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని నియంత్రించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల పాటు కేసినోలు నిర్వహించినా పోలీసులు ఆ వైపు చూడలేదని.. ఇప్పుడు టీడీపీ నేతలు నిజ నిర్ధారణ చేసేందుకు వస్తున్నారని తెలిసి కూడా వైఎస్ఆర్సీపీ నేతల్ని నియంత్రించలేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు గుడివాడలోకి రాకుండాప్రధాన రహదారిపై బారికేడ్లు ..రోప్పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు కానీ .. దాడులకు దిగుతున్న అధికార పార్టీ నేతలను మాత్రం అడ్డుకోలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య
కేసినోను మూడు రోజులు నిర్వహించిన తర్వాత టీడీపీ నేతలు ఫిర్యాదు చేసిన తర్వాత డీఎస్పీని విచారణ అధికారిగా ఎస్పీ నియమించారు. డీఎస్పీ ఇంకా కేసినో వ్యవహారంపై విచారణ నివేదిక ఇవ్వలేదు. ఇప్పుడీ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజకీయ అంశమయింది.
Kakinanda News : ఎమ్మెల్సీ అనంతబాబు ఇగో హర్ట్ అయి నెట్టడంతో డ్రైవర్ మృతి - ఎస్పీ రవీంద్రనాథ్
AP News : విశాఖ రుషికొండ తవ్వకాల స్టే, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్
Mlc Anantababu Arrest : ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు, కాకినాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు
Tirumala Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, రేపు ఆర్జితసేవా టికెట్ల ఆగస్టు నెల కోటా విడుదల
Nellore Crime : సినిమా స్టైల్ లో వెంటాడి మరీ దొంగతనం, పట్టించిన సీసీ కెమెరాలు
Infinix Hot 12 Play: 7 జీబీ ర్యామ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్ రూ.9 వేలలోపే - సూపర్ ఫీచర్లు కదా!
Shekar Movie: శేఖర్ సినిమా ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్!
Revanth Reddy : అధికారంలోకి రాగానే మల్లారెడ్డిని జైలుకు పంపిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Ind vs Pak, Hockey Asia Cup: చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన పాక్ - మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్!
Hyundai New Car: రూ.7 లక్షలలోపే హ్యుండాయ్ కొత్త కారు - ఎలా ఉందో చూశారా?