అన్వేషించండి

YS Jagan Mohan Reddy Vizag Visit : వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!

Vizag Steel Plant Accident Compensation YSRCP: ఎస్ జగన్ శాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు

Jagan Demands 1 Crore Ex Gratia: విశాఖపట్నం  స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రత్యక్షంగా పరామర్శించారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఆయన.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.  బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.

ప్రమాదంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు.  ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటూ నెపం నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూడటం సమంజసం కాదు. ఏ సంస్థలో ప్రమాదం జరిగినా, నష్టపోయింది మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలే అనే మానవతా దృక్పథం ప్రభుత్వానికి ఉండాలి  అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా గంటల వ్యవధిలోనే స్పందించి రూ. కోటి వరకు ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు.

బాధిత కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున తక్షణమే రూ. కోటి నష్టపరిహారం  చెల్లించాలని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, ఆయా కుటుంబాల్లోని అర్హులైన ఒక వ్యక్తికి స్టీల్ ప్లాంట్‌లో ,  ప్రభుత్వ పరంగా శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించాలని, వారి పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందించడంతో పాటు, వారు పూర్తిగా కోలుకునే వరకు నెలకు రూ. 50 వేల జీవన భృతి కల్పించాలన్నారు.  

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి మేము కృషి చేశాం .ఆ రోజు 28000 మంది పనిచేస్తుంటే ఈ రోజు 16000 మందే ఉన్నారు. కరెంటు బిల్లులు పెంచేశారు, బోనస్ లు, ఇన్సెంటివ్ లు ఆపేశారని ఆరోపించారు. ఇంత దారుణంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టారు..ఉక్కు కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాలన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది..కూటమి హయాంలో ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ అడ్డుకుందని జగన్ తెలిపారు. 2021 మార్చి 9న ప్రధాని మోదీకి లేఖ కూడా రాశామని గుర్తు చేశారు.  
 
ప్రభుత్వం స్పందించే వరకు వైఎస్సార్‌సీపీ తరపున బాధితుల పక్షాన పోరాటం ఆపేది లేదని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులకు, పేదలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలు పక్కనబెట్టి బాధితుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా జరిగిన వివాదంపై స్పందించారు. లోకేష్ లాంటి మనుషులు కూడా ఉంటారా అని జగన్ ఆశ్చర్యపోయారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
AP DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్‌సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget