YS Jagan Mohan Reddy Vizag Visit : వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
Vizag Steel Plant Accident Compensation YSRCP: ఎస్ జగన్ శాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా, శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు

Jagan Demands 1 Crore Ex Gratia: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాద బాధితులను, మృతుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ప్రత్యక్షంగా పరామర్శించారు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ఆయన.. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.
ప్రమాదంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటూ నెపం నెట్టేసి చేతులు దులుపుకోవాలని చూడటం సమంజసం కాదు. ఏ సంస్థలో ప్రమాదం జరిగినా, నష్టపోయింది మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలే అనే మానవతా దృక్పథం ప్రభుత్వానికి ఉండాలి అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రమాదాలు జరిగినా గంటల వ్యవధిలోనే స్పందించి రూ. కోటి వరకు ఎక్స్గ్రేషియా అందించి ఆదుకున్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తుచేశారు.
బాధిత కుటుంబాలకు శాశ్వత ప్రాతిపదికన న్యాయం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. మృతి చెందిన ప్రతి కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున తక్షణమే రూ. కోటి నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక సాయంతోనే సరిపెట్టకుండా, ఆయా కుటుంబాల్లోని అర్హులైన ఒక వ్యక్తికి స్టీల్ ప్లాంట్లో , ప్రభుత్వ పరంగా శాశ్వత ఉద్యోగ అవకాశం కల్పించాలని, వారి పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. గాయపడిన కార్మికులకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందించడంతో పాటు, వారు పూర్తిగా కోలుకునే వరకు నెలకు రూ. 50 వేల జీవన భృతి కల్పించాలన్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి మేము కృషి చేశాం
— Sakshi (@SakshiNews) June 10, 2026
ఆరోజు 28000 మంది పనిచేస్తుంటే ఈ రోజు 16000 మందే ఉన్నారు
కరెంటు బిల్లులు పెంచేశారు, బోనస్ లు, ఇన్సెంటివ్ లు ఆపేసారు
ఇంత దారుణంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టారు.. #sakshinews #ysjagan… pic.twitter.com/pLt6Vt6Bmp
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి మేము కృషి చేశాం .ఆ రోజు 28000 మంది పనిచేస్తుంటే ఈ రోజు 16000 మందే ఉన్నారు. కరెంటు బిల్లులు పెంచేశారు, బోనస్ లు, ఇన్సెంటివ్ లు ఆపేశారని ఆరోపించారు. ఇంత దారుణంగా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టారు..ఉక్కు కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాలన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది..కూటమి హయాంలో ఎలా ఉందో అందరూ గమనించాలన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ అడ్డుకుందని జగన్ తెలిపారు. 2021 మార్చి 9న ప్రధాని మోదీకి లేఖ కూడా రాశామని గుర్తు చేశారు.
ప్రభుత్వం స్పందించే వరకు వైఎస్సార్సీపీ తరపున బాధితుల పక్షాన పోరాటం ఆపేది లేదని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికులకు, పేదలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలు పక్కనబెట్టి బాధితుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు. లోకేష్ పర్యటన సందర్భంగా జరిగిన వివాదంపై స్పందించారు. లోకేష్ లాంటి మనుషులు కూడా ఉంటారా అని జగన్ ఆశ్చర్యపోయారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















