అన్వేషించండి

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !

Allu Arjun Trolls Statement: ట్రోల్స్‌పై డబ్బు, ఎనర్జీ వేస్ట్ చేయకండి అంటూ అల్లు అర్జున్ అభిమానులకు చేసిన సూచన వైరల్‌గా మారింది. ఇటీవలి కాలంలో ఆయన చుట్టూ రాజకీయ ప్రచారం జరుగుతోంది. కౌంటర్ ఇచ్చారా?

Tollywood Political PR Wars:   "నీకు ఎవరైనా నచ్చకపోతే వదిలేయండి, అంతేకానీ వాళ్లను హేట్ చేయడం లేదా ట్రోల్ చేయడం సరికాదు. మనకు నచ్చని వారి కోసం మన డబ్బును, ఎనర్జీని ఎందుకు ఖర్చు పెట్టాలి?" అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీట్‌లో  సందేశం ఇచ్చారు.  గత కొంతకాలంగా అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్న రాజకీయ వివాదాలు, ఆయనను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా  . ఈ వ్యాఖ్యలు కేవలం సామాన్య నెటిజన్లకు మాత్రమే కాకుండా, తెరవెనుక నడుస్తున్న డిజిటల్ రాజకీయంపై వేసిన నేరుగా చేసిన కామెంట్స్ గానే చూడవచ్చు. 

ఇతరులను ట్రోల్ చేసి సమయం వృధా చేసుకోవద్దని సలహా
 
నేడు సోషల్ మీడియాలో జరుగుతున్న సైబర్ దాడి లేదా ట్రోలింగ్ అనేది కేవలం వ్యక్తిగత ద్వేషంతో అప్పటికప్పుడు పుట్టుకొచ్చేది కాదు. రాజకీయ పార్టీలు, హీరోలు, వాటి అనుబంధ డిజిటల్ పిఆర్   ఏజెన్సీలు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నడిపిస్తున్న ఒక పెద్ద వ్యూహాత్మక నెట్‌వర్క్ అన్న విమర్శలు ఉన్నాయి.  గత ఎన్నికల సమయం నుండి ఆంధ్రప్రదేశ్‌లో వ్యతిరేకులను మానసికంగా దెబ్బతీయడానికి  ట్రోల్ సైన్యాలను రంగంలోకి దించారు. మనకు నచ్చని వారి కోసం డబ్బు, ఎనర్జీ ఎందుకు ఖర్చు పెట్టడం  అని బన్నీ అనడం వెనుక.. రాజకీయ ప్రయోజనాల కోసం తనను టార్గెట్ చేస్తూ పెయిడ్ క్యాంపెయిన్లు నడుపుతున్న ఏజెన్సీలను, వాటికి నిధులు సమకూరుస్తున్న రాజకీయ శక్తులను ఎండగట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని అనుకోవచ్చు. 
 
గత ఎన్నికలకు ముందు మిత్రుడి ఇంటికి వెళ్లినప్పటి నుండి ట్రోల్స్

అల్లు అర్జున్ తన వ్యక్తిగత నిర్ణయాల్లో సాంప్రదాయ  మెగా  చట్రాన్ని దాటి సొంత గుర్తింపును చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన వ్యక్తిగత స్నేహాలకు విలువ ఇస్తారు. గతంలో వైసీపీ నేత నంద్యాల నుంచి పోటీ చేస్తూంటే ఆయన తన మిత్రుడుకాబట్టి ఆయన ఇంటికి వెళ్లారు. అది వివాదాస్పదం అయిది.  త ఎన్నికల సమయంలో నంద్యాలలో తన స్నేహితుడికి మద్దతుగా వెళ్లిన ఉదంతం నుండి, తదనంతర పరిణామాల వరకు.. ఆయనను పొలిటికల్ రీజన్స్‌తో దెబ్బతీయడానికి  సోషల్మీడియాలో ప్రయత్నాలు జరిగాయి. సినిమా రంగాన్ని, రాజకీయ ప్రయోజనాలను ముడిపెట్టి, డిజిటల్ వేదికలపై  అల్లు అర్జున్ వ్యక్తిత్వ హననం చేయడానికి ప్రయత్నించిన రాజకీయ వర్గాలకు తన సైలెంట్ కౌంటర్ ద్వారా అల్లు అర్జున్ గట్టి సందేశాన్ని పంపారని అంటున్నారు. 

ఎనర్జీని కుటుంబం కోసం వెచ్చించాలని అల్లు అర్జున్ సలహా

సాధారణంగా ఫ్యాన్ వార్స్ లేదా పొలిటికల్ క్యాంపెయిన్లలో నష్టపోయేది నిరుద్యోగులైన యువత ,  అభిమానులే. పొలిటికల్ పార్టీలు తమ ప్రయోజనాల కోసం యువతలోని ఆవేశాన్ని వాడుకుంటూ, వారి సమయాన్ని, శక్తిని ద్వేషాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నాయి.  మనకున్న 100 శాతం ఛార్జింగ్‌ను మన ఎదుగుదల కోసం వాడుకుందాం  అని తన అభిమానులకు అర్జున్ చెప్పిన మాటలు..  ప్రచారాల వలలో చిక్కుకుని విలువైన సమయాన్ని పాడుచేసుకుంటున్న యువతకు ఒక హెచ్చరిక లాంటివి. రాజకీయ నాయకుల లేదా పార్టీల ప్రాపగండాకు బలై, సోషల్ మీడియాలో ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ఆయన చేసిన విజ్ఞప్తి ఒక   అవసరాన్ని ఎత్తిచూపుతోంది.
 
మొత్తంగా చూస్తే, అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం  ఫ్యాన్స్ మీట్ లో చెప్పిన పంచ్ డైలాగ్ మాత్రమే కాదు; అది నేటి సోషల్ మీడియా పొలిటికల్ కల్చర్ పై చేసిన తీవ్రమైన వ్యాఖ్య. డిజిటల్ మీడియాను వేదికగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడే పొలిటికల్ ప్లాట్‌ఫామ్‌లకు, పిఆర్ నెట్‌వర్క్‌లకు ప్రజాదరణ పొందిన ఒక స్టార్ ఇచ్చిన బలమైన  పరోక్ష సమాధానం ఇది. అనుకోవచ్చు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Fans Meet 2026: నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
నచ్చకపోతే పట్టించుకోవద్దు - ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఇచ్చిన సలహా వెనుక అసలు కారణం ఇదే !
Allu Arjun: వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
వదిలేయండి బ్రదర్... ట్రోల్స్‌పై అభిమానుల సమావేశంలో అల్లు అర్జున్
Rao Bahadur OTT: రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
రావు బహదూర్ ఓటీటీ రిలీజ్... నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
Srinidhi Shetty: శ్రీమతి స్వర్ణ... 'ఆదర్శ కుటుంబం'లో చిట్టిబాబు భార్య
శ్రీమతి స్వర్ణ... 'ఆదర్శ కుటుంబం'లో చిట్టిబాబు భార్య
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget