అన్వేషించండి

YS Avinash Reddy : వైఎస్ అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట - ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టు ఏం చెప్పిందంటే ?

వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. మంగళవారం సాయంత్రం వరకూ సీబీఐ విచారణకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది.

 

YS Avinash Reddy :  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను తెలంగాణ  హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. పిటిషన్‌పై మంగళవారం ఉదయం విచారణ చేపట్టనున్నారు. అందుకే పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకూ అవినాష్ రెడ్డిని విచారణకు పిలవవద్దని హైకోర్టు స్పష్టం చేసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత అవినాష్ రెడ్డిని ప్రశ్నించవచ్చని తెలిపింది. ఇప్పటికే ఉదయం పదిన్నరకు రావాలని సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. కానీ హైకోర్టు ఆదేశంతో  ఆ నోటీసులు క్యాన్సిల్ చేసి మరోసారి సాయంత్రం నాలుగు గంటలకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. 

వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసిందని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎంపీ తరఫు న్యాయవాది వాదించారు.  భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి కాంఫెషన్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి సహ నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోంది.. దస్తగిరికి బెయిల్ వచ్చిన తర్వాతి రోజే సీబీఐ వాళ్ళు 306 పిటిషన్ వేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా ఆయన్ను అప్రూవర్‌గా మార్చారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేవని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు.   హత్య తర్వాత సాక్షాలు తుడిచివేయడంపై చెబుతున్నారు. సాక్షాలు రూపుమాపడం ఆరోపణ అయితే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని... ఎందుకు అంటే దానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు లేవని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు.  అన్ని కోణాల్లో విచారించి హత్య ఎవరో చేశారో తేల్చే కోణంలో విచారణ జరగట్లేదు. రాజకీయ కోణంలోనే విచారణ జరుగుతోంది. రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇరికించే కుట్ర జరుగుతోందని  అవినాష్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

సీబీఐ తరపు లాయర్ ఎన్ని సార్లు విచారణకు పిలుస్తున్నా.. ప్రతీ సారి పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  అవినాష్ రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. మూడోసారి విచారణకు రమ్మనప్పుడు 5 రోజులు సమయం తీసుకుని హాజరయ్యారు. ఇప్పుడు విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే మళ్ళీ పిటిషన్ వేశారు. మా తరఫు దర్యాప్తు పూర్తి చేయడానికే నోటీసులు ఇచ్చాం. వివేకా హత్య జరిగిన తర్వాత అవినాష్ పోలీసులకు ఫోన్ చేశారు. ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుల్స్ పంపండి చాలు అని చెప్పారు. అంతేకాదు.. గుండెపోటుతోనే వివేకా చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యను కప్పిపుచ్చుకునేందుకు సహజ మరణం కింద చిత్రీకరించారు. సాక్షాలు తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు’ అని సీబీఐ తరఫు లాయర్ తన వాదనలు వినిపించారు.

మరో వైపు వైఎస్ సునీత కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి అంగీకరించారు. సునీత తరపు లాయర్ కూడా కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది. 
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget