అన్వేషించండి

YCP Bus Yatra: 'రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్ దే' - వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం

YCP Bus yatra: రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ దేనని వైసీపీ నేతలు తెలిపారు. సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు.

ఏపీలో పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్ దేనని వైసీపీ నేతలు ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ 'సామాజిక సాధికార యాత్ర' పేరుతో చేపట్టిన బస్సు యాత్రం గురువారం ఇచ్ఛాపురం నుంచి ప్రారంభంమైంది. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు బయలు దేరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించనున్నారు. మధ్యాహ్నం ఇచ్ఛాపురం బస్టాండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నారు.

'సంతోషంగా ఉంది'

ఇచ్ఛాపురం నుంచి బస్సు యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. మంత్రులు బొత్స, మేరుగ నాగార్జున, పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు వి.కళావతి, గొర్లె కిరణ్ కుమార్, ఎమ్మెల్సీలు దువ్వాడ, వరుదు కల్యాణి పాల్గొన్నారు.

'సంక్షేమాన్ని వివరిస్తాం'

'గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ హయాంలో అందిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్. కేబినెట్ లోనూ సామాజిక న్యాయం చేశారు. వైసీపీకి ఓటు వేయని వారికీ సంక్షేమ పథకాలు అందించాం. అవినీతికి తావు లేకుండా ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందాయి. విద్యా రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాం. నాడు - నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. సీఎం జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేస్తున్నారు. పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్ దే' అని వైసీపీ నేతలు, మంత్రులు ప్రశంసించారు.

షెడ్యూల్ ఇదే

అక్టోబర్ 26 నుంచి నవంబర్ 9 వరకూ మొదటి విడత సామాజిక సాధికార యాత్ర జరగనుంది. తొలి రోజు ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమలలో యాత్రలు జరగనున్నాయి. మొదటి విడతలో 39 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర కొనసాగనుంది. ఆయా ప్రాంతాల్లో వైసీపీ ముఖ్య నేతలు యాత్రలో పాల్గొంటారు. ఆయా నియోజకవర్గాల్లో ముందుగా ఎంపిక చేసిన సచివాలయాన్ని వైసీపీ నేతలు సందర్శిస్తారు. ఇక్కడే ఎమ్మెల్యేలు, రీజినల్ కోఆర్డినేటర్లు,ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, స్థానికంగా ఎంపిక చేసిన 200 మందితో కలిసి సహాపంక్తి భోజనం చేస్తారు. బస్సు యాత్ర జరిగే మార్గంలో ముందుగా నిర్ణయించిన చోట్ల ప్రజలతో మమేకమవుతారు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ సభలో బస్సు పై నుంచే నేతలు ప్రసంగిస్తారు. ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తారు. 

వీరిపైనే స్పెషల్ ఫోకస్

వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార యాత్రను బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్లాన్ చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో, ప్రజలకు వివరించడమే లక్ష్యంగా యాత్ర ఉంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పేదలకు - పెత్తందార్లకు మధ్యే యుద్ధమనే నినాదాన్ని బస్సు యాత్ర ద్వారా బలంగా తీసుకెళ్లాలని సీఎం జగన్ నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో వైసీపీ నేతలు క్లాస్ వార్ స్లోగన్‌తో సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లేదా సమన్వయకర్తల అధ్యక్షతన బస్సు యాత్ర జరగనుంది. ప్రతి బస్సులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు తప్పకుండా ఉండేలా ప్లాన్ చేశారు. మొదటి విడతలో నవంబర్ 9 వరకూ ఒక్కో రోజు 3 ప్రాంతాల్లో యాత్రలు సాగనున్నాయి.

 
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind u19 vs Pak u19 Final Live Streaming: భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Telugu TV Movies Today: ఈ ఆదివారం (డిసెంబర్ 21) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..
ఈ ఆదివారం (డిసెంబర్ 21) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..

వీడియోలు

Sanju Samson For T20 World Cup 2026 | మొత్తానికి చోటు దక్కింది...సంజూ వరల్డ్ కప్పును శాసిస్తాడా | ABP Desam
Ishan Kishan Named T20 World Cup 2026 | రెండేళ్ల తర్వాత టీ20ల్లో ఘనంగా ఇషాన్ కిషన్ పునరాగమనం | ABP Desam
Shubman Gill Left out T20 World Cup 2026 | ఫ్యూచర్ కెప్టెన్ కి వరల్డ్ కప్పులో ఊహించని షాక్ | ABP Desam
T20 World Cup 2026 Team India Squad Announced | ఊహించని ట్విస్టులు షాకులతో టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ | ABP Desam
Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind u19 vs Pak u19 Final Live Streaming: భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
భారత్, పాక్ అండర్ 19 ఆసియా కప్ ఫైనల్ ఎక్కడ చూడాలి, లైవ్ స్ట్రీమింగ్ వివరాలివే
World Bank Loan For Pakistan: పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
పాకిస్తాన్ కు 700 మిలియన్ డాలర్ల సహాయం అందించిన ప్రపంచ బ్యాంకు
Kondagattu Temple: పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
పవన్ కళ్యాణ్ చొరవతో కొండగట్టు ఆలయానికి రూ.35 కోట్లు.. బండి సంజయ్ హర్షం
Telugu TV Movies Today: ఈ ఆదివారం (డిసెంబర్ 21) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..
ఈ ఆదివారం (డిసెంబర్ 21) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్.. లిస్ట్ ఇదే! డోంట్ మిస్..
CM Revanth Reddy: పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
పర మతాలను కించపరిస్తే శిక్షించేలా కొత్త చట్టం - సీఎం రేవంత్ రెడ్డి
Maa Vande Movie : మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
మోదీ బయోపిక్ 'మా వందే' - పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్
Home Loans Interest Rate: అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
అతి తక్కువ వడ్డీకే హోం లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే.. పూర్తి జాబితా
Ishan Kishan Viral Video: టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
టి20 ప్రపంచ కప్‌నకు ఎంపికైన ఇషాన్ కిషన్.. ప్యాకెట్ డైనమైట్ ఫస్ట్ రియాక్షన్ చూశారా
Embed widget