అన్వేషించండి

AP Govt Vs Employees : ఏపీ ఉద్యోగులు కోరుతున్నదేంటి? ప్రభుత్వం ఇస్తానంటున్నదేంటి? వివాదానికి ఈ రోజు తెరపడేనా ?

ఏపీ ఉద్యోగులు, ప్రభుత్వ కమిటీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కొన్ని విషయాల్లో మార్పులకు అంగీకరించింది. కానీ పంచకపోయినా పర్వాలేదు పాత ప్రయోజనాలను రద్దు చేయవద్దని ఉద్యోగులు కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , ఉద్యోగుల మధ్య ఇంత కాలం ఉన్న ఓ రకమైన తెర తొలగిపోయింది. చర్చలు ప్రారంభించారు., ప్రభుత్వం ఇంత కాలం అపోహలు తొలగిస్తాం కానీ జీవోల్లో మార్పులు చేర్పులు లాంటివి ఏమీ ఉండవని చెబుతూ వస్తోంది.కానీ సమ్మెకు ముందు కాస్త మెట్టు దిగి.. ఉద్యోగుల డిమాండ్లపై బేరసారాలు మొదలు పెట్టింది. అసలు ఉద్యోగులు ఏం అడుగుతున్నారు...? ప్రభుత్వం ఏం ఇస్తానంటోంది ? 

హెచ్‌ఆర్‌ఏ సహా పాత పద్దతిలోనే అలవెన్స్‌లు ఉండాలంటున్న ఉద్యోగులు!

హెచ్‌ఆర్ఏ, సీసీఏ లాంటివి పెంచాలని ఉద్యోగులు కోరడం లేదు. గత నెల వరకూ ఏమిచ్చారో ఇప్పుడు కూడా అదే ఇవ్వమని అడుగుతున్నారు. పీఆర్సీ జీవోల్లో హెచ్ఆర్ఏను తగ్గించడంతో పాటు సీసీఏ రద్దు చేశారు. తాము ఈ సౌకర్యాలన్నీ దశాబ్దాలుగా పోరాడిగా తెచ్చుకున్న సౌకర్యాలని.. వాటిని ఈ ప్రభుత్వం ఎలా రద్దు చేస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు . ఎక్కడైనా పెంచుతారు కానీ తగ్గించడం ఏమిటని అంటున్నారు. 

కొత్త హెచ్‌ఆర్ఏల్లో కాస్త మార్పులు చేస్తామంటున్న ప్రభుత్వం !

ప్రభుత్వం పాత హెచ్‌ఆర్ఏ కొనసాగించడం ఆర్థికంగా భారం అని చెబుతోంది. ప్రత్యామ్నాయంగా జీవోల్లో మార్పులు చేస్తామని ప్రతిపాదన పెట్టింది. రెండు లక్షల మంది జనభా ఉన్న ప్రాంతాలకు ఎనిమిది శాతం, 2 నుండి 5 లక్షల జనాభా ఉండే ప్రాంతాలకు12, 5-15 లక్షల జనాభా ప్రాంతాలకు 16 శాతం, 15 లక్షలపైన జనాభా ఉండే ప్రాంతాలకు 24 శాతం హెచ్‌ఆర్‌ఎను మంత్రుల కమిటీ ప్రతిపాదించింది. అదే విధంగా రిటైర్డ్‌ ఉద్యోగులకు అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ పాత విధానాన్ని కొనసాగించేందుకు అంగీకారం తెలిపింది. 70 ఏళ్ల వారికి ఐదు శాతం, 75 ఏళ్లపైబడిన వారికి 10 శాతం ఇస్తామని మంత్రుల కమిటీ తెలిపింది.

ఫిట్‌మెంట్ పైనా రెండు వర్గాల మధ్య పీట ముడి !

ఐఆర్ 27 శాతం ఉన్నందున ఫిట్‌మెంట్ 30శాతం వరకూ ఉండాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు ఐఆర్ కన్నా ఫిట్‌మెంట్ తగ్గడంపై అసంతృప్తిగా ఉన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్‌కు అంగీకరించవద్దని కోరుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఫిట్‌మెంట్ విషయంలో ఎలాంటి చర్చలకు చాన్స్ లేదని..మార్చే అవకాశం లేదని తేల్చి చెబుతున్నారు. 

రికవరీ అంశంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ! 

ఏపీ ఉద్యోగులు  ఇప్పటికే రెండున్నరేళ్ల నుంచి 27 శాతం మధ్యంతర భృతి రూపంలో పొందుతున్నారు. ఇప్పుడు 23 శాతమే ఫిట్‌మెంట్ ఖరారు చేయడం వల్ల నాలుగు శాతం లోటు పడింది. గత రెండున్నరేళ్ల నుంచి అదనంగా ఇచ్చిన ఈ నాలుగు శాతం మొత్తాన్ని రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని డీఏలను ఒకే సారి మంజూరు చేసిన ప్రభుత్వం  వాటికి చెల్లించాల్సిన ఎరియర్స్‌ను ఈ ఐఆర్‌తో కవర్ చేయాలని నిర్ణయించుకుంది. ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించకుండా లెక్కలు సరి చేయాలనుకుంది. అయితే ఇప్పుడు రికవరీ లేకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ ఒక్క విషయంలో రెండు వర్గాల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని అనుకోవచ్చు. 

ఐదేళ్లకోసారి పీఆర్సీకి ప్రభుత్వం అంగీకారం !

ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పీఆర్సీ జీవోల్లో మరో పదేళ్ల వరకూ పీఆర్సీ ఉండదని ..కేంద్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం నియమించే వేతన సవరణ కమిటీ నివేదిక ఆధారంగానే తాము కూడా వేతన సవరణ చేస్తామని చెప్పింది. ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎప్పట్లాగే ఐదేళ్లకోసారి రాష్ట్ర పీఆర్సీనే ఉండాలంటున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 

మంత్రుల కమిటీ ముందు ప్రధానంగా పది డిమాండ్లు పెట్టిన ఉద్యోగ సంఘాల నేతలు !

మంత్రుల కమిటీ ముందు ఉద్యోగ సంఘ నేతలు  పిఆర్‌సిపై అశుతోష్‌ కమిటీ నివేదికను బయట పెట్టాలన్న డిమాండ్‌ను కూడా పెట్టారు. ఇది ఆర్థిక భారం కాదు. ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం లేదు. కానీ అందులో ఎక్కువ సిఫార్సులుంటే ఉద్యోగుల్లో ప్రభుత్వం మోసం చేసిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అందుకే ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. అలాగే6. కాంట్రాక్టు ఉద్యోగులకు పే, డిఎ, హెచ్‌ర్‌ఎ , అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మినిమం స్కేల్‌ , 8.గ్రామ సచివాలయ ఉద్యోగులకు గత అక్టోబర్‌ నుండి రెగ్యులర్‌ స్కేలు , 2022 పిఆర్‌సి స్కేళ్లు ఇవ్వడం, మార్చి 31 లోగా సిపిఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవడం వంటి డిమాండ్లు ఉద్యోగ సంఘ నేతలు పెట్టారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget